logo

తెదేపా ఎన్నికల ప్రణాళికతో భవితకు భరోసా

తెదేపా మహానాడులో చంద్రబాబునాయుడు ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

Published : 31 May 2023 05:16 IST

చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న
దేవినేని ఉమామహేశ్వరరావు, పక్కనే నాయకులు

జి.కొండూరు, న్యూస్‌టుడే: తెదేపా మహానాడులో చంద్రబాబునాయుడు ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్నికల ప్రణాళిక విడుదల పురస్కరించుకొని మహిళలకు ప్రకటించిన పథకాలపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం స్థానిక ఎన్టీఆర్‌ కూడలిలో చంద్రబాబు చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు. పేదలకు సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ఎన్టీఆర్‌కే చెల్లుతుందని, అదేబాటలో చంద్రబాబు సంక్షేమ బావుటా ఎగురవేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు పజ్జూరు రవికుమార్‌, లంకా రామకృష్ణ, ఉయ్యూరు నరసింహారావు, పటాపంచుల నరసింహారావు, అంకెం ఇందిరాప్రియదర్శిని, సర్పంచులు ధనేకుల శ్రీకాంత్‌, బాణవతు సరస్వతి,  ఎంపీటీసీ సభ్యులు నూతక్కి అపర్ణ, సందిపాము జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని