పట్టాలన్నారు.. పత్తా లేకున్నారు!
ఏక మొత్తం పరిష్కారమని చెప్పి వెంటపడి మరీ డబ్బులు కట్టించుకున్నారు.. ప్రస్తుతం మమ్మల్ని కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు.. ఇదీ ఓఏటీఎస్ పథకంలో నగదు చెల్లించిన లబ్ధిదారుల ఆవేదన.
చేతికందని ఓటీఎస్ పత్రాలు
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే
ఏక మొత్తం పరిష్కారమని చెప్పి వెంటపడి మరీ డబ్బులు కట్టించుకున్నారు.. ప్రస్తుతం మమ్మల్ని కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు.. ఇదీ ఓఏటీఎస్ పథకంలో నగదు చెల్లించిన లబ్ధిదారుల ఆవేదన. జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది నుంచి నిర్దేశించిన రుసుము చెల్లించుకున్నారు. వారిలో ఇంకా చాలామందికి పట్టాలు అందకపోవడం, అడిగినా అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పక పోవడంతో ఆవేదన చెందుతున్నారు.
గృహనిర్మాణ పథకాల ద్వారా అప్పుడెప్పుడో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు రుణవిముక్తి కలిగించడంతో పాటు సర్వహక్కులు కల్పిస్తూ పట్టాలు కూడా పంపిణీ చేస్తామని ప్రకటించిన పాలకులు ఆదిశగా చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో 90వేలకుపైగా లబ్ధిదారులు ఉంటే దాదాపు 45వేలమందికి వరకు నగదు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ఓటీఎస్ పథకాన్ని చాలామంది వ్యతిరేకించారు. నగదు చెల్లించిన వారు కూడా తొలుత విముఖత వ్యక్తం చేసినా భూమికి సంబంధించి హక్కులతో కూడిన పట్టా ఉంటే పిల్లలకు ఉపయోగపడుతుందని నగదు చెల్లించారు. ఏడాది దాటిపోయినా ఇంకా పట్టాలు చేతికందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల నుంచి రూ.10 కోట్లకుపైగా వసూళ్లు చేశారు. డివిజన్ల వారీగా చూస్తే అత్యధికంగా బందరు డివిజన్ పరిధిలోనే వసూళ్లయ్యాయి. నగదు వసూళ్లపై చూపించిన శ్రద్ధ పట్టాల పంపిణీపై చూపడం లేదన్న విమర్శలు లబ్ధిదారులనుంచి వ్యక్తమవుతున్నాయి. ఇళ్ల చుట్టూ తిరిగి డబ్బులు కట్టించుకున్న సిబ్బంది కూడా ఫలానా సమయంలో ఇస్తామని కూడా చెప్పడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గృహనిర్మాణ సంస్థ అధికారులేమో మండలాలకు పంపించేశామని చెబుతున్నారు. అవి ఎక్కడున్నాయో..ఎప్పుడిస్తారో కూడా తెలియని పరిస్థితి.
అధికారులకు తెలిపినా.. జిల్లాలో 1983 నుంచి 2013 మధ్యకాలంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులను గుర్తించి గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.15వేలు, నగరాల్లో రూ.20వేలు ఇలా నిబంధనల ప్రకారం అధికారులు వసూలు చేశారు. డబ్బులు లేవంటే డ్వాక్రాలో రుణం ఇప్పిస్తామని చెప్పారు.. సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేసేలా ఏర్పాట్లు చేశారు. బంటుమిల్లి మండలంలోని పెందుర్రు, చోరంపూడి, మల్లంపూడి, నాగేశ్వరరావుపేట, మల్లేశ్వరం, గూడూరు మండలంలోని ఆకులమన్నాడు, పెడన మండలంలోని చేవెండ్ర తదితర గ్రామాల్లో ఇప్పటివరకు పట్టాలు పంపిణీ చేయలేదు. ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, గుడివాడ, గుడ్లవల్లేరు ఇలా పలు మండలాల వారికి పట్టాలు అందించాల్సి ఉంది. ఇటీవల నిర్వహించిన జిల్లా పరిషత్స్థాయీ సంఘ సమావేశంలోనూ పలువురు సభ్యులు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసువచ్చారు. ఇప్పటికైనా చొరవ తీసుకుని త్వరితగతిన పట్టాలు పంపిణీ చేయాలని కోరుతున్నారు.
కొందరికే ఇచ్చారు
మహ్మద్రఫీ, ఆకులమన్నాడు సర్పంచి
మా గ్రామంలో కొందరికే పట్టాలు ఇచ్చారు. అప్పట్లో లబ్ధిదారులకు మేలు జరుగుతుందని, అధికారులతో కలిసి నేను కూడా తిరిగి డబ్బులు కట్టించా. వాళ్లు అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నా. పట్టాలు వచ్చాయని అంటున్నారు కానీ ఇంతవరకు లబ్ధిదారులకు చేరలేదు.
పరిష్కరిస్తాం
సూర్యనారాయణ, జిల్లా గృహనిర్మాణ సంస్థ అధికారి
ఏకమొత్త పరిష్కారంలో భాగంగా లబ్ధిదారులకు అందించాల్సిన పట్టాలను ఇప్పటికే మండలాల వారీగా పంపిణీ చేశాం. చాలాచోట్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఇంకా ఎక్కడెక్కడ సమస్య ఉందో పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తాం. లబ్ధిదారులు సమస్య ఉంటే మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకు రావాలని కోరుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనగళమే.. జయ కెరటమై..
[ 18-04-2024]
పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగళం సభలు, రోడ్షోకు జనం పోటెత్తారు. -
నేడే.. ఈనాడే..
[ 18-04-2024]
2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
మీరు.. మనసులు గెలవాలండీ..
[ 18-04-2024]
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అధినేత పవన్కల్యాణ్ బీ ఫారాలు అందించారు. -
అనిశాకు చిక్కిన పౌరసరఫరాల అధికారి
[ 18-04-2024]
ఓ బియ్యం వ్యాపారి నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరి శ్రీనివాస్ అనిశా వలకు చిక్కారు. -
1నే జీతాలివ్వండి మహాప్రభో!
[ 18-04-2024]
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఎదురుమొండికి ఎదురు చూపులే..
[ 18-04-2024]
ఎదురుమొండి వారధి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమ చిరకాల స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందోనని దీవుల్లో నివాసముంటున్న పది వేల మంది జనాభా దశాబ్ద కాలంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
కూటమి ప్రభంజనం ఖాయం
[ 18-04-2024]
ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో వైద్యశాల
[ 18-04-2024]
వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
‘రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన’
[ 18-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్ సీపీఎం అభ్యర్థి సి.హెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక చైతన్యం అవసరం
[ 18-04-2024]
నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్