వ్యాపకం లేదు.. వ్యాపారం లేదు..!
అమరావతి మెట్రో రైలు కార్పోరేషన్ (ఏఎంఆర్సీ) కాస్తా.. ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్(ఏపీ ఎంఆర్సీ)గా మారిన తర్వాత విజయవాడ పేరుకే ప్రధాన కార్యాలయం.. ఊరు విశాఖగా మారింది.
ఈనాడు, అమరావతి
నాలుగంతస్తుల వాణిజ్య భవనం.. వందల సంఖ్యలో ఉద్యోగులు.. విదేశీ ప్రతినిధులు.. సమావేశాలు.. రకరకాల డ్రాయింగులు.. సర్వేలు.. నివేదికలు.. అంతా విధినిర్వహణలో నిమగ్నం.. ఇది 2019 వరకు..
నివాస భవనంలో ఒక డబుల్బెడ్ రూం ప్లాట్.. నలుగురే ఉద్యోగులు.. ఇద్దరు మాత్రమే హాజరు. చేయడానికి పనిలేదు. విదేశీ ప్రతినిధులు లేరు. కార్యాలయానికి బాస్ రారు.. ఉద్యోగులు వస్తారు.. వెళతారు. అన్యులు అటువైపు కన్నెత్తి చూడరు. మీడియా ఆసక్తి చూపినా ‘ఎండీ లేరు.. విశాఖపట్నంలో ఉన్నారు..’ అనే సమాధానం వస్తుంది. ఇదీ 2020 తర్వాత పరిస్థితి.
అమరావతి మెట్రో రైలు కార్పోరేషన్ (ఏఎంఆర్సీ) కాస్తా.. ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్(ఏపీ ఎంఆర్సీ)గా మారిన తర్వాత విజయవాడ పేరుకే ప్రధాన కార్యాలయం.. ఊరు విశాఖగా మారింది. కేవలం నలుగురంటే.. నలుగురే ఉద్యోగులు. కార్యాలయ నిర్వహణకు నిధులు కొతర ఉంది. రెండేళ్ల కిందట బడ్జెట్లో పెట్టిన నిధులు పూర్తిగా అందలేదు. ప్రస్తుతం బడ్జెట్లో అసలు మెట్రో ఊసేలేదు. పురపాలక శాఖ నుంచి నామమాత్రంగా ఉద్యోగుల వేతనాలు, ఖర్చులకు అందాల్సి ఉంది. చాలా వరకు ఒప్పంద ఉద్యోగులు ఉండేవారు. అందరూ మానేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం కార్యాలయం కళతప్పింది.
మసక బారిన మెట్రో...
గత ప్రభుత్వంలో మెట్రో కారిడార్కు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. మెట్రో దిగ్గజం డీఎంఆర్సీ ఎండీ శ్రీధరన్ ఆధ్వర్యంలో డీపీఆర్ రూపొందింది. తర్వాత సలహాదారు నుంచి డీఎంఆర్సీ వైదొలగింది. 2019లోనే డీఎంఆర్సీ సిబ్బంది దిల్లీకి తరలిపోయారు. తర్వాత వైకాపా ప్రభుత్వంలో ఒకే ఒక్కసారి మెట్రోపై సమీక్ష జరిగింది. సీఎం సమక్షంలో జరిగిన సమీక్షలో గత ప్రభుత్వం రూపొందించిన లైట్మెట్రో డీపీఆర్ను విమర్శించారు. కొత్తగా డీపీఆర్ తయారు చేయాలని సూచించారు. కానీ నిధులు లేక మూలన పడింది. తర్వాత ‘అమరావతి’ పదాన్ని తొలగించి ఏపీ చేర్చారు. వెంటనే కార్పొరేట్ కార్యాలయం కాస్తా లబ్బీపేటలోని ఒక నివాస సముదాయం (అపార్టుమెంట్)లో డబుల్ బెడ్రూం ఇంటికి మార్చారు. మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి పరిస్థితిని గ్రహించి ఇది వచ్చే ప్రాజెక్టు కాదని పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆర్థిక విభాగం అధిపతిగా ఉన్న జయమన్మధరావును ఎండీగా ప్రకటించారు. ఆయన సిబ్బంది విశాఖ వెళ్లి అక్కడ ప్రాంతీయ కార్యాలయం పెట్టారు. ఇక్కడ ప్రధాన కార్యాలయం అని నామకరణం చేశారు. కానీ నలుగురే సిబ్బంది ఉన్నారు. డీఎంఆర్సీ రూ.70 కోట్ల వరకు తీసుకుని ప్రాజెక్టు నుంచి తప్పుకొంది. జర్మన్ కంపెనీకి లైట్మెట్రో డీపీఆర్ కోసం రూ.10 కోట్లు ఖర్చు చేశారు. ఉచితంగానే డీపీఆర్ అందించేందుకు ముందుకు వచ్చిన జర్మన్ కంపెనీకి కేవలం ఖర్చులు వసతి ఇతర సదుపాయాలకు ఈ నిధులు వెచ్చించాల్సి వచ్చింది. ప్రస్తుతం విజయవాడ, విశాఖ కార్యాలయాలకు ఏడాదికి రూ.3.5 కోట్ల వరకు నిర్వహణ ఖర్చులు అవుతున్నాయి. గత ఏడాది ఆలస్యంగా నిధులు విడుదల చేశారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి ఇంకా రెండు త్రైమాసిక(క్వార్టర్ల) నిధులు విడుదల కాలేదు. మెట్రో కార్యాలయం మసకబారింది.
మిగిలింది నిరాశే...
మెట్రో వస్తే.. తమకు భారీ డిమాండ్ ఉంటుందని ఆశించిన భారత్ ఎర్త్మూవర్స్ లిమిటెడ్ (బీఎంఈఎల్) సంస్థ భంగపడింది. తమ కార్యాలయాన్ని విశాఖకు తరలించేసింది. రక్షణ శాఖకు అవసరమైన భారీ యంత్రాలను ఈ సంస్థ సమకూరుస్తుంది. దేశవ్యాప్తంగా రూ.4 వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థ. విజయవాడలో దీని శాఖ కార్యాలయాన్ని 2015లో ఏర్పాటు చేశారు. మెట్రోకు అవసరమైన కోచ్లు సరఫరా చేసేందుకు బీఈఎంఎల్ ముందుకు వచ్చింది. బుల్డోజర్లు, గ్లాడర్లు వంటి యంత్రాలను ఈ సంస్థ రూపొందిస్తుంది. రాజధానిలో మెట్రోతోపాటు ఇతర కార్యక్రమాలతో వ్యాపారం అభివృద్ధి చెందుతుందని భావించినా... నిరాశే మిగిలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ