దారికొస్తేనే.. రయ్ రయ్!
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో నందిగామ నుంచి విజయవాడ వైపు మినీ వ్యాన్లో లైటింగ్ సామగ్రి వేసుకుని వస్తున్నారు. అంబారుపేట క్రాస్ రోడ్డు వద్ద అసంపూర్తి దారిపై ఉన్న గుంతలో టైరు పడి వ్యాను బోల్తాకొట్టింది.
అసంపూర్తి నిర్మాణాలతో గాల్లో ప్రాణాలు
శాఖల సమన్వయలేమితో కొలిక్కిరాని భూసేకరణ
ఈనాడు, అమరావతి
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో నందిగామ నుంచి విజయవాడ వైపు మినీ వ్యాన్లో లైటింగ్ సామగ్రి వేసుకుని వస్తున్నారు. అంబారుపేట క్రాస్ రోడ్డు వద్ద అసంపూర్తి దారిపై ఉన్న గుంతలో టైరు పడి వ్యాను బోల్తాకొట్టింది. ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదలగా.. డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే రహదారి పరిధిలో.. ద్విచక్ర వాహనంపై వస్తున్న దంపతులను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరూ మృతి చెందగా.. పిల్లలు అనాథలయ్యారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకులు అడ్డుగా పెట్టిన డివైడర్ను ఢీ కొట్టి... ఒకరు మృతి చెందారు.
అదీ ఓ జాతీయ రహదారి.. ఏ.కొండూరు మండలం రామచంద్రాపురంలో రెండు మూడు మీటర్ల లోతులో గోతులు ఉన్నాయి. విజయవాడ నుంచి భద్రాచలం వెళుతున్న ఓ కారు గోతులను గమనించకుండా అందులోకి వెళ్లి అక్కడికక్కడే పల్టీ కొట్టింది. టైరు చక్రం యాక్సెల్ విరిగి.. కారులోని వారు గాయాలతో బయటపడ్డారు. అధిక బరువుతో వచ్చే ఓ ట్రక్కు గోతుల్లో పడి అడ్డం తిరిగింది. దాన్ని తొలగించడానికి ఓ రోజంతా పట్టింది.
జిల్లా నుంచి వెళ్లే మూడు ప్రధాన జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తి చేశారు. అక్కడక్కడ కొన్ని పనులు అసంపూర్తిగా వదిలేశారు. గుత్తేదారు మాత్రం బిల్లులు చేసుకుని చేతులు దులుపుకొన్నారు. రహదారి మొత్తం అద్దంలా ఉంటుంది. అసంపూర్తిగా వదిలిన ప్రాంతాలు నరకానికి దారులై.. వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా.. పూర్తి చేయడం లేదు. పరిష్కారం చూపడం లేదు. భూసేకరణ సమస్య అని జాతీయ రహదారుల సంస్థ, న్యాయపర సమస్యలు అని రెవెన్యూ అధికారులు ఒకరిపై ఒకరు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఒకవైపు టోల్ గుంజుతూనే విస్తరణను విస్మరించడమే కాక.. కనీసం మరమ్మతులూ చేయడం లేదు. మరోవైపు భద్రత చర్యలూ లేవు. వెరసి ప్రమాదాలు జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
జగదల్పూర్ జాతీయ రహదారి ఏ.కొండూరు మండలం రామచంద్రాపురం వద్ద దుస్థితి
భారీ గుంతలు.. ప్రమాదాలు..
విజయవాడ భద్రాచలం జాతీయ రహదారిలో రెండు ప్రాంతాల్లో వదిలేశారు. కొండపల్లి వద్ద, రామచంద్రాపురం వద్ద మిగిలిపోయింది. ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం వద్ద కిలోమీటరు విస్తరణ వదిలేశారు. ఇక్కడ గ్రామం మధ్యలో నుంచి దారి వేయాల్సి ఉండగా.. గ్రామస్థులు.. బైపాస్ నిర్మించాలని ఆందోళనలు చేశారు. కొందరు కోర్టుకు వెళ్లారు. ఇక్కడ కీలక మలుపు ఉంది. ఇటీవల ఓ భారీ వాహనం అడ్డం తిరిగి ఇరుక్కోగా ఒకపూట వాహనాలు నిలిచాయి. తరచూ ఇక్కడ రహదారి మరమ్మతులకు గురవుతుంది. రామచంద్రాపురం ప్రజలు గత కొన్నేళ్లుగా ట్రాఫిక్తో నరకం చూస్తున్నారు. మార్గం తెలియని కొత్తవారైతే.. ప్రమాదం జరిగినట్లే. కనీసం గుంతలు పూడ్చలేదు. కానీ బాడవ వద్ద టోల్ ప్లాజా పెట్టి వసూలు చేస్తున్నారు. ఇటీవల టోల్ ధరలనూ పెంచారు. గుత్తేదారు మాత్రం నిర్మాణం చేసినట్లు మొత్తం బిల్లు చేయించుకున్నారు. టెండర్లు పిలుస్తున్నామని మూడేళ్లుగా చెబుతున్నా.. ఒక్క అడుగు ముందుకు కదలలేదు.
నందిగామ మండలం అంబారుపేట వద్ద జాతీయ రహదారి ఇలా..
బాబోయ్ నందిగామ...
హైదరాబాద్ జాతీయ రహదారి అంబారుపేట క్రాస్ రోడ్డు వద్ద పరిస్థితి మరీ దారుణం. రూ.కోట్లు వెచ్చించి నందిగామ వద్ద ఏడు కిమీ విస్తరించి... సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఆరు కిమీ మేర పూర్తయింది. ఒక కిలోమీటరు ఆగి రెండున్నరేళ్లు గడిచినా కదలిక లేదు. నందిగామలోకి వెళ్లేందుకు అండర్ పాస్.. అక్కడే ఒక బస్బే, బస్స్టాప్ అవసరం. దీనికి భూ సేకరణపై రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. అండర్పాస్ వంతెన నిర్మించారు. ఇక్కడ రాకపోకలకు జాతీయ రహదారిపై డివైడర్లు అడ్డదిడ్డంగా ఏర్పాటు చేశారు. వీటిని అంచనా వేయని వాహనదారులు 100 కి.మీ వేగంతో వచ్చి ఢీ కొడుతూ.. ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్నిసార్లు గాయాలతో బయటపడుతున్నారు. అనాసాగర్ వద్ద సర్వీసు రోడ్డు పరిస్థితీ ఇంతే. ఇక్కడ కూడా అండర్పాస్ నుంచి వస్తున్న వాహనాన్ని సర్వీసు రహదారి మీదుగా వస్తున్న కారు ఢీ కొని యువకుడు మృతి చెందాడు.
అలా వదిలేశారు..
విజయవాడ బందరు జాతీయ రహదారి 64 కిమీ నాలుగు వరసలుగా విస్తరించారు. రూ.800 కోట్ల ప్రాజెక్టు. దీనిలో భాగమే బెంజి పైవంతెన నిర్మాణం. రెండేళ్ల కిందట పూర్తి చేశారు. దిలీప్ బిల్డ్కాన్ సంస్థ కాంట్రాక్టు. కానీ మధ్యలో కొన్ని పనులు వదిలేశారు. బెంజి సర్కిల్ సెంటర్ నుంచి నిర్మించాలి. కానీ బెంజి సర్కిల్ నుంచి ఆటోనగర్ గేట్ వరకు వదిలేశారు. కారణం కొన్ని భవనాలను కూల్చాలి. దీనికి వీఎంసీ ముందుకు రాలేదు. దీంతో గుత్తసంస్థ ఈ భాగాన్ని కాంట్రాక్టు నుంచి మినహాయించింది. ప్రస్తుతం వీఎంసీ నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లు ఇస్తున్నారు. మొత్తం 168 భవనాలను కూల్చాలి. ఇక్కడ ట్రాఫిక్ పెద్దసమస్యగా మారింది. ఇదే బందరు రోడ్డులో కంకిపాడు వద్ద, మరికొన్ని ప్రాంతాల్లో గుత్తసంస్థ నిర్మాణాన్ని వదిలేసింది.
కంకిపాడు మండలం కొణతనపాడు వద్ద ప్రమాదాలు అధికమయ్యాయి. బందరు జాతీయ రహదారి పూర్తయ్యాక ఈ ఒక్కచోటే 18 మంది మరణించారు. ఉయ్యూరులోకి వెళ్లే సర్వీసు దారి అలాగే ఉంది. అయిదు ప్రాంతాల్లో గుత్తేదారు పనులు అసంపూర్తిగా వదిలేశారు. భూసేకరణకు యజమాని ముందుకు రాక, న్యాయపర విషయాలు ముడిపడి ఉండటంతో పనులు వదిలేశారని అధికారులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
[ 24-04-2024]
‘‘పార్టీలోనే ఉండాలని డబ్బులిస్తున్నారు.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రాధాన్య పోస్టులని ఆశ చూపుతున్నారు.. చివరకు బెదిరిస్తున్నారు. -
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
[ 24-04-2024]
వేసవి రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఐఆర్సీటీసీతో కలిసి తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ఎకానమీ మీల్స్ పేరుతో విజయవాడ రైల్వే అధికారులు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. -
అంటకాగితే.. అంతే రాణా..!
[ 24-04-2024]
అధికార వైకాపాతో అంటకాగుతూ.. ప్రతిపక్ష నేతలను కక్షపూరితంగా వేధిస్తూ, అకారణంగా వారిపై కేసులు నమోదు చేసిన విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణాపై బదిలీ వేటు పడింది. -
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా
[ 24-04-2024]
విజయవాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కార్లు, స్థలాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు స్వాహా చేసిన కేటుగాడిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. -
జగన్ షాకులు.. జనం కేకలు!
[ 24-04-2024]
విద్యుత్తు సర్దుబాటు ఛార్జీల రూపంలో జగన్ వేసిన దొంగ దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పేరుకు ఛార్జీలు పెంచలేదంటూనే.. దొడ్డిదారిన వడ్డిస్తున్న ట్రూఅప్ బాదుడు మామూలుగా లేదు. -
తవ్వుకో.. దండుకో!
[ 24-04-2024]
పెడన నియోజకవర్గంలో అక్రమ ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. పెడనతో పాటు గూడూరు, కృత్తివెన్ను మండలాల్లో అక్రమార్కులు ఇసుక తవ్వకాలను నిరాటంకంగా సాగిస్తున్నారు. -
పేర్ని కిట్టూ నామినేషన్ దాఖలు
[ 24-04-2024]
మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పేర్ని వాకా సాయికృష్ణమూర్తి(కిట్టూ) అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ప్రతిభ చాటిన విద్యార్థినులకు సన్మానం
[ 24-04-2024]
స్థానిక తోటమూల భట్ట మోహనరావు, హైమావతి జిల్లా పరిషత్తు హైస్కూలు విద్యార్థులు తొలిసారిగా మంచి ఫలితాలు సాధించారని ఎంఈవో-2 వైవీ హరినాథ్ అన్నారు. -
ఏటా కొలువులన్నారు.. ఏమార్చారు
[ 24-04-2024]
రాష్ట్రంలో 2.50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇప్పటి వరకూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ నిరుద్యోగులు, వివిధ సంఘాల నాయకులు కోరుతున్నారు. -
ఒక్క ఎస్సీకైనా అవకాశమిచ్చారా జగన్?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగి అయినా గత ఐదు సంవత్సరాలలో పనిచేశారా అని మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. -
22 మంది అభ్యర్థులు...28 నామపత్రాలు
[ 24-04-2024]
జిల్లాలోని పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం 22 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
అయిదేళ్లుగా.. రెండు పిల్లర్లు వేయలేదు!
[ 24-04-2024]
ఉట్టికెగరలేని అమ్మ.. ఆకాశానికి ఎగురుతానన్నదట.. అలాగే ఉంది వైకాపా ప్రభుత్వ తీరు. అయిదేళ్లలో రెండు పిల్లర్లు నిర్మించడం చేతకాలేదు కానీ.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ బిల్డప్లు ఇస్తుంటారు. -
అదనపు పని భారంతో సిబ్బంది సతమతం
[ 24-04-2024]
ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తాం. భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తామని.. సీఎం జగన్మోహన్రెడ్డి ఊదరగొట్టారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా వేయలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. -
పాత బూత్ల ముద్రణతో ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 24-04-2024]
అధికార వైకాపా ఓటర్లను తప్పుదోవ పట్టిస్తోంది. ఓటరు స్లిప్పులను పోలింగ్ అధికారులు పంపిణీ చేయాల్సి ఉండగా, ముందస్తుగానే వాటి పంపిణీని చేపట్టింది. -
సింహ వాహనంపై ఆది దంపతులు
[ 24-04-2024]
చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదిదంపతులకు సింహ వాహన సేవను దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో రుత్వికులు శోభాయమానంగా మంగళవారం నిర్వహించారు. -
ముఖ్యమంత్రి మాట.. నీటి మూట
[ 24-04-2024]
అవనిగడ్డ - నాగాయలంక ప్రధాన రహదారిపై ఉన్న డంపింగ్ యార్డు తరలింపు ఆవశ్యకతను ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబు 2022 అక్టోబరు 20న అవనిగడ్డ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. -
జనంపై జగనన్న అదనపు బాదుడు
[ 24-04-2024]
విద్యుత్తు వినియోగదారులకు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రీడింగ్ తీసేందుకు సిబ్బంది వస్తే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. సర్ఛార్జీలు, విద్యుత్తు సుంకం, ఫిక్స్డ్, ట్రూఅప్, ఇతర ఛార్జీల పేరుతో వినియోగదారుడి ఇంటి బడ్జెట్ను ప్రభుత్వం తలకిందులు చేస్తోంది. -
గుడివాడ పసుపుమయం
[ 24-04-2024]
గుడివాడ పట్టణమంతా మంగళవారం పసుపుమయమైంది. ఎటువైపు చూసినా కనుచూపుమేరలో జనవాహిని కనిపించింది. ప్రత్యర్థి పార్టీల గుండెలదిరేలా ఎన్డీఏ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్కు జనం తరలి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ