పరిహారంపై దోబూచులాట!
బాపులపాడు మండలం మల్లవల్లిలో పారిశ్రామికవాడ కోసం ప్రభుత్వం సేకరించిన భూములకు చెల్లించాల్సిన పరిహారం విషయంలో అధికారుల వైఖరి విమర్శలకు తావిస్తోంది.
మల్లవల్లి పారిశ్రామికవాడ నిర్వాసితుల నిర్వేదం
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే
బాపులపాడు మండలం మల్లవల్లిలో పారిశ్రామికవాడ కోసం ప్రభుత్వం సేకరించిన భూములకు చెల్లించాల్సిన పరిహారం విషయంలో అధికారుల వైఖరి విమర్శలకు తావిస్తోంది. కొద్ది రోజుల కిందట నిర్వాసితులంతా పారిశ్రామికవాడ రహదారుల్ని దిగ్బంధించడంతో దిగి వచ్చిన అధికారులు 15 రోజుల్లో పరిష్కారం చేస్తామని ఇచ్చిన హామీ ఇచ్చారు. కానీ ఏడేళ్లుగా కొలిక్కిరాని ఈ సమస్య కేవలం పక్షం రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మల్లవల్లిలో సర్వే సంఖ్య 11లో ఉన్న 1,460 ఎకరాలను 2016లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పారిశ్రామికవాడ నెలకొల్పేలా ఏపీఐఐసీకు అప్పగించింది. ఇది మొత్తం ప్రభుత్వ భూమే అయినా రైతుల సాగులో ఉండటంతో ఎకరాకు రూ.7.50 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి భూ సేకరణ జరిపారు. మొత్తం 490 మంది, 716.44 ఎకరాలు ఆక్రమించుకుని సాగు చేస్తున్నట్లు నిర్ధారించి, ఎకరాకు రూ.7.50 లక్షల చొప్పున రూ.53.73 కోట్లు పరిహారం చెల్లించేందుకు 2016లోనే ప్రభుత్వం నిధులు కేటాయించింది. జాబితాలో అనర్హులు చోటుచేసుకున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు వడపోత చేపట్టి చివరకు 443 మందికి 615.6 ఎకరాలకు రూ.46.17 కోట్లు చెల్లించారు. దీంతో పాటు గ్రామంలో ఉన్న 1,612 తెల్లకార్డులకు 1,228 మందికి రూ.50 వేలు చొప్పున రూ.61.40 లక్షలు చెల్లించారు.
అర్హుల ఎంపికపై సందిగ్ధం
వివిధ కారణాలతో అధికారులు పక్కనబెట్టినప్పటికీ అర్హులై ఉండి పరిహారం రావాల్సి వారు 50 మందికి పైగా ఉంటారని అప్పట్లోనే అంచనా వేశారు. ఆ సంఖ్య గత ఏడేళ్లుగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం పారిశ్రామికవాడలో ఆందోళన చేస్తున్న రైతుల లెక్కల ప్రకారం 118 మందికి 99.17 ఎకరాలకు పరిహారం రావాల్సి ఉందని చెబుతుండగా.. ఈ ఏడాది జనవరిలో గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో స్వీకరించిన అర్జీల ప్రకారం 247 మందికి 713 ఎకరాలకు పరిహారం ఇవ్వాలని అర్జీలు సమర్పించారు. దీంతో పాటు 2016లో కొత్తగా రేషన్కార్డులు మంజూరైన వారికి కూడా రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
స్పష్టత కరవు
గతేడాది ఎమ్మెల్యే వంశీ సీఎంను కలిసి నియోజకవర్గానికి సంబంధించి పరిష్కారం చేయాల్సిన అంశాల్లో మల్లవల్లి నిర్వాసితుల పరిహారం విషయం కూడా ఉంది. కానీ ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు నూజివీడు ఆర్డీవోలుగా వ్యవహరించిన ఇద్దరు అధికారులు ఎవరికీ పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదనే విధంగా నివేదికలు సమర్పించారు. కానీ ఆ తర్వాత కూడా అర్జీల స్వీకరణలు, క్షేత్ర విచారణలు నిర్వహించడంతో నిర్వాసితులు పరిహారం వస్తుందనే ఆశాభావంతోనే ఉన్నారు.
ప్రాణాలు తీసుకోబోయినా ఫలితం లేదు
- పంతం కామరాజు
పరిహారం చెల్లించడానికి వీలుగా ప్రభుత్వం నిర్వహించిన జియోకాన్ సర్వేలో నాకు వ్యక్తిగతంగా 4.50 ఎకరాలు ఉన్నట్లు తేలింది. కానీ అర్హుల జాబితాలో నా పేరు రాలేదు. ఇదేమని అడిగితే అధికారులు స్పందించలేదు. అప్పట్నుంచి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నా. ఈ వేదనతోనే అనారోగ్యం కూడా వచ్చేసింది. రెండుసార్లు పోలీసుల సమక్షంలో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసుకున్నా.
స్థానికులం కాదని ఇవ్వలేదు
- దోనవల్లి వెంకట్రావు
మా కుటుంబం ఆధీనంలో ఎప్పట్నుంచో దాదాపు పదెకరాల పొలం సాగులో ఉంది. జియోకాన్ సర్వే సమయంలో అధికారులు దీనిని గుర్తించినా, పరిహారం ఇచ్చేసరికి మొండి చెయ్యి చూపారు. అదేమంటూ స్థానికులు కాదంటున్నారు. పక్కనే ఉన్న మర్రిబంధం, పోలసానపల్లి గ్రామాల్లో ఉండి ఈ భూములు సాగు చేసుకున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరతా.. సీఎంకు తెలిపిన భారాస ఎమ్మెల్యే!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్