మెట్రోమాయం.. మానని గాయం..!
ఆయనకు ఎనికేపాడులో ఓ ఇంటి స్థలం ఉంది. కుటుంబ అవసరాల కోసం అమ్మకానికి పెట్టారు. మెట్రోకు భూసేకరణ చేస్తున్నారనీ.. దానికి తీసుకుంటారని ప్రచారం జరగడంతో కొనడానికి ఎవరూ ముందుకురాలేదు.
భూసేకరణ పేరుతో దగా..!
నాలుగేళ్లుగా భూములన్నీ నిషేధంలోనే..
మార్కెట్ విలువ పతనంతో రూ.కోట్లలో నష్టం
ఈనాడు, అమరావతి
* మెట్రో నిర్మాణానికి భూసేకరణ పేరుతో మార్కెట్ విలువ గణనీయంగా పడిపోయింది. ఆయా సర్వే నెంబర్లలో క్రయ విక్రయాలపై నిషేధం విధించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు జాబితా వెళ్లింది.
* ఆరేళ్లుగా ఇది నలిగింది. ప్రభుత్వం మారాక దీనిపై ఆశలు సన్నగిల్లాయి. రాజధాని అమరావతిలో నిర్మాణాలు ఆపేయడం, పలు సంస్థలు తరలిపోవడంతో రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. అదే తీరు బందరు, ఏలూరు రహదారి వెంట స్థలాలపై కూడా ప్రభావం చూపింది. ఇన్నేళ్లు నిషేధంలో ఉంచి ఇప్పుడు నోటిఫికేషన్ ఉపసంహరణతో రైతులు తల్లడిల్లుతున్నారు.
* పలువురు రూ.కోట్లలో నష్టపోతున్నారు. ఆడబిడ్డలకు పసుపు కుంకుమ కింద కూడా నిడమానూరు రైతులు భూములు ఇచ్చారు. వాటిని నాడు విక్రయించేందుకు వీలు లేదని రెవెన్యూ శాఖ అడ్డుపడింది. ప్రస్తుతం విలువలు దిగజారడంతో వాపోతున్నారు.
ఆయనకు ఎనికేపాడులో ఓ ఇంటి స్థలం ఉంది. కుటుంబ అవసరాల కోసం అమ్మకానికి పెట్టారు. మెట్రోకు భూసేకరణ చేస్తున్నారనీ.. దానికి తీసుకుంటారని ప్రచారం జరగడంతో కొనడానికి ఎవరూ ముందుకురాలేదు. 2016లో ప్రాథమిక సర్వేలో ఆయన నివాస స్థలం 445 గజాలు సేకరిస్తున్నట్లు రెవెన్యూ శాఖ ప్రకటించింది. 2017లో తుది నోటిఫికేషన్ ఇచ్చింది. 2016లో అక్కడ గజం.. సుమారు 1.5 లక్షలు పలికింది. భూసేకరణలో రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం పరిహారం అందుతుందని భావించారు. తర్వాత పరిణామాల్లో మరుగున పడింది. ప్రస్తుతం అదే స్థలం గజం రూ.80 వేలు నుంచి రూ.లక్ష వరకే మార్కెట్ విలువ ఉంది. డిమాండ్ తక్కువగా ఉంది. దాదాపు ఏడేళ్లు గడిచాయి. స్థలం విలువ భారీగా తగ్గి తీవ్రంగా నష్టపోయారు. తాజాగా మెట్రో భూసేకరణను ఉపసంహరిస్తూ.. నోటిఫికేషన్ ఇచ్చారు. వెరసి గజానికి రూ.70 వేలు చొప్పున 445 గజాల స్థలంలో రూ.3.12 కోట్లు నష్టం. పైగా ఏడేళ్లు కరిగిపోయింది. దీనికి వడ్డీ నష్టం. ఇదీ మెట్రోకు ఈ ప్రభుత్వం ఉరేసిన తీరుతో జరిగిన నష్టం.
నిడమానూరులో మెట్రో రైల్ కోచ్ మార్పిడి స్టేషన్ ఏర్పాటును ప్రతిపాదించారు. అప్పటికే అక్కడ ఎకరం రూ.20 కోట్లు పలుకుతోంది. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం రూ.50 లక్షలకే సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కానీ రైతులు తాము ఇవ్వబోమని అడ్డం తిరిగారు. మెట్రో భూసేకరణ నోటిఫికేషన్తో అమ్మకాలు నిలిచిపోయాయి. తాజాగా నిడమానూరు నోటిఫికేషన్ను ప్రభుత్వం ఉపసంహరించుకోనుంది. ప్రస్తుతం అక్కడ భూములు అడిగే వారే లేరు. ఎకరం రూ.20 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పడిపోయింది. సగానికి సగం నష్టం. నాడు అమ్ముకోనీయలేదు.. పరిహారం ఇవ్వలేదు.. మెట్రో పేరుతో దారుణంగా మోసం చేశారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మారకపోతే.. మెట్రో పట్టా లెక్కేదని తమ భూములకు పరిహారం అందేదని రైతులు భావిస్తున్నారు.
దశల వారీగా ఉపసంహరణ..!
విజయవాడ మెట్రో రైలు కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్లను దశలవారీగా ఉపసంహరించేందుకు రెవెన్యూ శాఖ సన్నాహాలు చేస్తోంది. డీఎన్డీడీ (డ్రాప్టు నోటిఫికేషన్, డ్రాప్టు డిక్లరేషన్) జారీ చేసి దాదాపు నాలుగేళ్లు పైగా గడువు కావడంతో కాలపరిమితి ముగిసిందనే నెపంతో భూసేకరణ నోటిఫికేషన్లను రెవెన్యూ శాఖ ఉపసంహరిస్తోంది. సాధారణంగా గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. కానీ ఇక మెట్రో ఇప్పట్లో ఉండబోదని నిర్ధారణకు రావడంతోనే ఉపసంహరణ నోటిపికేషన్ గెజిట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జారీ చేస్తున్నారు. అధికార వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం రెవెన్యూ గ్రామాల వారీగా ఉపసంహరణ నోటిఫికేషన్లు ఇస్తారని తెలిసింది.
భారీ అంచనాలతో అడుగులు...
మొదట డీఎంఆర్సీ ఇచ్చిన డీపీఆర్ ప్రకారం విజయవాడ మెట్రో రెండు కారిడార్లు నిర్మించాలి. వీటి దూరం 26 కిలోమీటర్లు. ఏలూరు కారిడార్ పీఎన్బీఎస్ నుంచి నిడమానూరు వరకు, బందరు కారిడార్ పీఎన్బీఎస్ నుంచి పెనమలూరు వరకు ఉండేది. ఏలూరు కారిడార్ను గన్నవరం వరకు పొడిగించారు. ఇది మొత్తం 38.4 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.9,078 కోట్లు. కిలోమీటరు వ్యయం రూ.236 కోట్లు. దీనిలో గన్నవరం కారిడార్ దూరం 26 కిలోమీటర్లు. పెనమలూరు దూరం 12.5 కిలోమీటర్లు.
* గన్నవరం కారిడార్కు 85.56 ఎకరాలు, పెనమలూరుకు 5.97 ఎకరాలు అవసరం. అయితే పీఎన్బీఎస్ నుంచి నిడమానూరు వరకే నోటిఫికేషన్ జారీ చేశారు. బందరు రోడ్డులో పెనమలూరు వరకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎలివేటెడ్ కారిడార్కు కి.మీ.కి రూ.230 కోట్లు వ్యయం అంచనా వేశారు.
* రెండు కారిడార్లకు సుమారు రూ.300 కోట్ల వరకు భూసేకరణ వ్యయం అవుతుందని అంచనా వేశారు. భవనాలు ఇతర కట్టడాలు కూడా కొన్ని సేకరించాలని అంచనా. అన్ని ప్రాంతాల్లోనూ పెగ్ మార్కింగ్ ఇచ్చారు. ఎర్రరంగుతో నిర్మాణాలకు సర్వే సిబ్బంది మార్కింగ్ ఇవ్వడం విశేషం.
ప్రతిపాదనలు అందగానే...
విజయవాడ గ్రామీణ మండలంలో, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు మండలాల పరిధిలో భూసేకరణ ప్రతిపాదనలు ఉన్న వాటిని దశల వారీగా ఉపసంహరించనున్నారు. నాడు మెట్రోకు భూసేకరణ అధికారిగా విజయవాడ రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ వ్యవహరించారు. తాజాగా సబ్ కలెక్టర్ నుంచే ప్రతిపాదనలు అందాలి. వి కానూరు, తాడిగడప, పోరంకి, పెనమలూరు పంచాయతీల్లో భూసేకరణ నాడు విజయవాడ డివిజన్ పరిధిలో ఉండేవి. ప్రస్తుతం జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉయ్యూరు రెవెన్యూ డివిజన్, కృష్ణా జిల్లా పరిధిలోకి వెళ్లాయి. ఉయ్యూరు ఆర్డీవో నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉంది. వీటిని త్వరలో ఉపసంహరిస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు. దీని పరిధిలో సుమారు 5 ఎకరాల వరకు ఉంది. వి అవసరమైతే మరోసారి సేకరణకు ప్రతిపాదనలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి చెబుతున్నారు. ప్రస్తుతం నాలుగేళ్ల గడువుతో కాలపరిమితి ముగియడంతో ఉపసంహరిస్తున్నట్లు ‘ఈనాడు’తో చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్