కోరుకొన్నట్లే.. కొలువు!
రాజకీయ పలుకుబడి, ఉత్తరంతోపాటు... దక్షిణ సమర్పించుకున్న వారికి కోరుకున్న స్థానం దక్కింది. నిబంధనలు, మార్గదర్శకాలు బేఖాతరు. ఎవరికి ఇష్టమైన వారిని వారు బదిలీ చేయించుకున్నారు.
దేవాదాయ శాఖలో పైరవీలకే పెద్దపీట
ఈనాడు, అమరావతి
రాజకీయ పలుకుబడి, ఉత్తరంతోపాటు... దక్షిణ సమర్పించుకున్న వారికి కోరుకున్న స్థానం దక్కింది. నిబంధనలు, మార్గదర్శకాలు బేఖాతరు. ఎవరికి ఇష్టమైన వారిని వారు బదిలీ చేయించుకున్నారు. కోరుకున్న పోస్టు దక్కించుకున్నారు. అర్హులు ఉన్నా.. వారిని కాదని రెండు జిల్లాలకు ఒకే అధికారిని నియమించడం, రెండు దేవాలయాలకు ఒకే అధికారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగాయి. ఇటీవల బదిలీ జరిగి... మార్గదర్శకాల ప్రకారం కాలపరిమితి లేకపోయినా బదిలీ చేశారు. జోనల్ పరిధి దాటి కొంతమందిని బదిలీ చేశారు. కోరుకున్న పోస్టులు దక్కించుకున్నారు. పోస్టుల కోసం రూ.లక్షల్లో సమర్పించుకున్నట్లు ఆ శాఖలోనే చర్చ జరుగుతోంది. తమకు స్థానం ఇస్తామని నమ్మబలికిన రాజకీయ నాయకులు వేరే వారు బరువు పెంచడంతో వారికి ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. దేవదాయ శాఖలో గురువారం పలువురు అధికారులు, ఉద్యోగుల బదిలీలు జరిగాయి. అన్నీ గందరగోళంగా జరిగాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిబంధనలకు వ్యతిరేకంగా జరిగాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కౌన్సెలింగ్లో నిబంధనల కన్నా.. వినతుల కన్నా.. రాజకీయ పలుకుబడికే ప్రాధాన్యం ఇచ్చారు.
ఆరు నెలలైనా కాకుండానే...
* కనీసం రెండేళ్లు దాటితేనే రిక్వెస్టు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. కానీ కనీసం ఆరునెలలు గడువు కూడా లేకుండానే బదిలీ చేశారు. ఒకే అధికారికి రెండు పోస్టులు ఇవ్వడానికి అవకాశం లేదు. సీఎంవోలో ఓ అధికారి పైరవీతో కల్పించారనే విమర్శలు ఉన్నాయి. కృష్ణాజిల్లా దేవదాయశాఖ అధికారి (సహాయ కమిషనరు) జిల్లాకు వచ్చి ఆరు నెలలుకూడా కాలేదు. తిరిగి ఆయనను డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా అప్పనపల్లి బాలబాలాజీ దేవాలయానికి బదిలీ చేశారు.
* ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం నెమలి వేణుగోపాల స్వామి ఈవోగా ఉన్న, సహాయ కమిషనర్ హోదా ఉన్న శాంతిని తిరిగి ఎన్టీఆర్ జిల్లా దేవదాయ శాఖ అధికారిగా నియమించారు. ఆమెను కృష్ణా జిల్లా దేవాదాయ శాఖ అధికారిగా కూడా నియమిస్తూ.. పూర్తి అదనపు బాధ్యతలు కల్పించారు. గతంలో ఎన్టీఆర్ జిల్లా అధికారిగా పని చేసిన శాంతి ఆరునెలల కిందటే నెమలికి బదిలీ అయ్యారు. అక్కడ మెటర్నిటీ సెలవులో ఉన్నారు. కేవలం మూడు నెలల సెలవు తర్వాత తిరిగి ఇప్పుడు బదిలీ అయ్యారు. రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించడం ఆ శాఖలో చర్చనీయాంశమైంది.
* అంతకు ముందు ఎన్టీఆర్ జిల్లా దేవదాయ శాఖ అధికారిగా (ఏసీ) ఉన్న శాంతి స్థానంలోకి అన్నపూర్ణ రాగా బాధ్యతలు అప్పగించేందుకు ముప్పుతిప్పలు పెట్టారు. ఎన్టీఆర్ జిల్లా అధికారిగా (ఏసీ) ఉన్న అన్నపూర్ణను నూకాలమ్మ దేవాలయం విశాఖకు బదిలీ చేశారు. ఆమె శ్రీకాకుళంలో నాలుగేళ్లుగా పనిచేస్తుంటే అక్కడి రాజకీయ నాయకులతో పొసగక ఎన్టీఆర్ జిల్లాకు పంపారు. దస్త్రాల్లో డిప్యుటేషన్ చూపించి తాజాగా విశాఖకు బదిలీ చేశారు.
* కృష్ణా జిల్లా అధికారిగా సాయిబాబు (ఏసీ) ఇటీవల మచిలీపట్నంలో బాధ్యతలు తీసుకున్నారు. అంతకు ముందు హరిగోపీనాథ్ జిల్లా అధికారిగా ఇన్ఛార్జి హోదాలో ఉండేవారు. ఆయనను తప్పించి సాయిబాబును నియమించారు. ప్రస్తుతం ఆయనను బదిలీ చేసి శాంతికి అదనపు బాధ్యతలు ఇవ్వడం విశేషం.
* వేంకటేశ్వరస్వామి దేవాలయం ఈవోగా ఉండే హరిగోపీనాథ్ అయిదేళ్లుగా ఒకే స్థానంలో ఉన్నారు. ఆయనకు బదిలీ జరగలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా?: షర్మిల
[ 25-04-2024]
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. -
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం