పర్యాటకం కళావిహీనం
వేసవి కాలం వచ్చిందంటే చాలు పర్యాటక, చారిత్రక ప్రదేశాలకు వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధి అటకెక్కింది.
నిలిచిన అభివృద్ధి పనులు
నాలుగేళ్లుగా దృష్టి పెట్టని వైనం
భవానీపురం, న్యూస్టుడే
వేసవి కాలం వచ్చిందంటే చాలు పర్యాటక, చారిత్రక ప్రదేశాలకు వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధి అటకెక్కింది. నాలుగేళ్లుగా ఆయా ప్రదేశాల అభివృద్ధిలో ఎటువంటి పురోగతి లేదు. పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం, నిధులు కేటాయించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం దృష్టి సారిస్తే ఆయా ప్రదేశాలు పర్యాటకులు, సందర్శకులతో కళకళలాడేందుకు వీలుంటుంది.
ఊసేలేని రోప్వే
కృష్ణానది మధ్యలో ఉన్న భవానీ ద్వీపం అభివృద్ధికి నోచుకోని పరిస్థితి ఉంది. సహజసిద్ధంగా ఏర్పడిన ద్వీపం అభివృద్ధి నాలుగేళ్లుగా నిలిచిపోయింది. అడపాదడపా పండగల సమయంలో ఈవెంట్లు నిర్వహిస్తూ అధికారులు మమ అనిపిస్తున్నారు. నది ఒడ్డున లేజర్షో, వాటర్ ఫౌంటేన్ను గత ప్రభుత్వ హయాంలో రూ.12 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. వరదల కారణంగా ఈ ఫౌంటేన్, లేజర్షో దెబ్బతిన్నాయి. గుత్తేదారు మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు దృష్టి పెట్టని పరిస్థితి ఉంది. దీంతో కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. ద్వీపం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్(బీఐటీసీ)ను ఏర్పాటు చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది.
* రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల వద్ద 25 పైగా రోప్వేల నిర్మాణానికి ఏపీ పర్యాటక శాఖ సంకల్పించింది. అందులో మొదటి విడతగా కృష్ణానదిపై భవానీ ద్వీపానికి రోప్వే నిర్మాణానికి నిర్ణయించారు. కనకదుర్గ గుడి వద్ద నుంచి రోప్వేను నిర్మిస్తామని ప్రకటించినప్పటికీ ఆ తర్వాత పున్నమిఘాట్ వద్ద నుంచి ఏర్పాటు చేస్తామన్నారు. ఆ ప్రకారం డీపీఆర్ తయారు చేయిస్తామని ప్రకటించి నెలలు గడుస్తున్నా అమలు కాలేదు. రోప్ వే నిర్మాణం పూర్తయితే విజయవాడ నగరానికి కొత్తరూపు వచ్చే అవకాశం ఉంటుంది.
దాత ఆశయానికి తూట్లు..
బుద్ధుడికి సంబంధించిన ఆనవాళ్లు కృష్ణాజిల్లా ఘంటసాలలో ఉన్నాయి. అమరావతిలో బుద్ధుడు కూర్చుని ఉండగా ఘంటసాలలో శయనిస్తూ ఉండే విగ్రహ నిర్మాణానికి నిర్ణయించారు. 100 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తుతో విగ్రహం నిర్మించేందుకు సంకల్పించారు. అందుకు ప్రవాసాంధ్రుడు తన సొంత స్థలాన్ని ఉచితంగా అందించారు. ఏడేళ్ల కిందట ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. రెండు అంతస్థులకు సంబంధించిన శ్లాబ్ల నిర్మాణం పూర్తయింది. బుద్ధుడి విగ్రహం, ఇతర నిర్మాణాలు చేయాల్సి ఉంది. నాలుగేళ్లుగా పనులు నిలిచిపోయాయి. ప్రాజెక్టు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దాత ఆశయానికి తూట్లు పడినట్లయింది. ఆ ప్రాజెక్టు పూర్తయితే పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందేందుకు వీలుంది.
మంగినపూడి బీచ్ పరిస్థితి ఇలా..
మచిలీపట్నంలో మంగినపూడి బీచ్ ఉంది. అక్కడకు నిత్యం విజయవాడ నగరం నుంచి ఎంతో మంది వెళ్తుంటారు. ఆ బీచ్ ఒడ్డున కాటేజీలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించినప్పటికీ అమలుకు నోచుకోలేదు. అక్కడ కనీస వసతులు కరవయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో రూ.5కోట్ల వ్యయంతో బీచ్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పర్యాటక శాఖ అధికారులు ప్రకటించారు. ఇబ్రహీంపట్నం సమీపంలో సీతాకోక చిలుకల ఉద్యానవనం, అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్, చల్లపల్లిలో కోట, నగరానికి సమీపంలోని ఉండవల్లి గుహలు, గాంధీ కొండ, కొండపల్లి కోట ఇలా... పలు పర్యాటక, సందర్శనీయ ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు వీలున్నప్పటికీ అధికారులు దృష్టి పెట్టడం లేదు. సంబంధిత అధికారులు స్పందించి అభివృద్ధి చేస్తే పర్యాటకరంగం పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది. కొండపల్లి కోటకు సందర్శకులు వెళ్లేలా పర్యాటక బస్సులు, ఆర్టీసీ బస్సులను నడుపుతామని ప్రకటించినా అమలుకు నోచుకోవడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ