1,27,954 మంది రైతులకు లబ్ధి
వై.ఎస్.ఆర్. రైతు భరోసా, పీఎం కిసాన్ కింద జిల్లాలో మొదటి విడతగా 1,27,954 మంది రైతులకు రూ.95,96,55,000 ఆర్థిక సాయం అందిస్తున్నట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్టుడే : వై.ఎస్.ఆర్. రైతు భరోసా, పీఎం కిసాన్ కింద జిల్లాలో మొదటి విడతగా 1,27,954 మంది రైతులకు రూ.95,96,55,000 ఆర్థిక సాయం అందిస్తున్నట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. వీరిలో 1,27,739 మంది రైతులు సొంత భూములను కలిగి ఉండగా రూ.95,80,43,000లు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న 215 మందికి రూ.1,61,25,000లు అందిస్తున్నట్టు వివరించారు. గురువారం రైతు భరోసా నిధుల జమ జిల్లా కార్యక్రమాన్ని విజయవాడలోని జలవనరుల శాఖ ఆవరణలోని రైతు శిక్షణ కేంద్ర భవనంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 సాయం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. గత నాలుగు విడతలుగా రైతు భరోసా కింద రూ.7,500లు, పీఎం కిసాన్ పథకం కింద రూ.6,000లను ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు 5 విడతలుగా 1,34,338 మంది రైతులకు రూ.748.43 కోట్ల ఆర్థిక సాయం చేసినట్టు అవుతుందని తెలిపారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇటీవల కురిసన అకాల వర్షాలకు జిల్లాలో మొక్కజొన్న, జొన్న, వరి, మినుము, నువ్వులు, పెసర వంటి పంటలు 1070.41 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు చెప్పారు. 1610 మంది రైతులకు రూ.1,36,10,000 లను పెట్టుబడి రాయితీ, నష్ట పరిహారంగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్లు ఛైర్మన్లు తోలేటి శ్రీకాంత్, శివరామకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారిణి ఎస్.నాగమణి, జిల్లా ఉద్యాన శాఖాధికారి కె.బాలాజీ కుమార్, ఏపీఎంఐపీ డీడీ షేక్ సుభానీ, వ్యవసాయాధికారులు రత్నశ్రీ, స్వప్న, ఊర్మిళ, అనితా భాను, రైతులు పాల్గొన్నారు. రైతు సాధికార సంస్థ ఏర్పాటు చేసిన పండ్లు, కూరగాయల స్టాళ్లను కలెక్టర్ తదితరులు పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనగళమే.. జయ కెరటమై..
[ 18-04-2024]
పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగళం సభలు, రోడ్షోకు జనం పోటెత్తారు. -
నేడే.. ఈనాడే..
[ 18-04-2024]
2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
మీరు.. మనసులు గెలవాలండీ..
[ 18-04-2024]
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అధినేత పవన్కల్యాణ్ బీ ఫారాలు అందించారు. -
అనిశాకు చిక్కిన పౌరసరఫరాల అధికారి
[ 18-04-2024]
ఓ బియ్యం వ్యాపారి నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరి శ్రీనివాస్ అనిశా వలకు చిక్కారు. -
1నే జీతాలివ్వండి మహాప్రభో!
[ 18-04-2024]
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఎదురుమొండికి ఎదురు చూపులే..
[ 18-04-2024]
ఎదురుమొండి వారధి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమ చిరకాల స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందోనని దీవుల్లో నివాసముంటున్న పది వేల మంది జనాభా దశాబ్ద కాలంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
కూటమి ప్రభంజనం ఖాయం
[ 18-04-2024]
ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో వైద్యశాల
[ 18-04-2024]
వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
‘రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన’
[ 18-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్ సీపీఎం అభ్యర్థి సి.హెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక చైతన్యం అవసరం
[ 18-04-2024]
నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే