logo

కిడ్నీ మార్పిడి చికిత్స విజయవంతం

కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను గన్నవరం మండలం చిన్నఅవుటపల్లికి చెందిన డా.పిన్నమనేని సిద్ధార్థ మెడికల్‌ కళాశాల వైద్యులు శుక్రవారం విజయవంతంగా పూర్తి చేశారు.

Published : 03 Jun 2023 03:52 IST

శస్త్రచికిత్స అనంతరం రవిబాబుతో డా.పిన్నమనేని సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, వైద్య బృందం

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను గన్నవరం మండలం చిన్నఅవుటపల్లికి చెందిన డా.పిన్నమనేని సిద్ధార్థ మెడికల్‌ కళాశాల వైద్యులు శుక్రవారం విజయవంతంగా పూర్తి చేశారు. హనుమాన్‌జంక్షన్‌కు చెందిన కంభంపాటి రవిబాబు రెండేళ్లుగా మూత్రపిండ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. గత నెల 17న విజయవాడ పటమటకు చెందిన దేవరాజుగట్టు వెంకటసాంబశివరావు(67) బ్రెయిన్‌ డెడ్‌తో మృతిచెందారు. సాంబశివరావు కుటుంబ సభ్యులు అవయవదానికి అంగీకరించడంతో ఆయన కిడ్నీని రవిబాబుకు అమర్చారు. ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన డా.వరుణ్‌, సింధు, సూర్యకుమారి, బాలమురళీకృష్ణ, పవన్‌సాయి, గోవర్ధని ఇతర వైద్య బృందాన్ని సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు చదలవాడ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్‌ రంగారావు, సూపరింటెండెంట్‌ వరప్రసాద్‌, కల్యాణిశ్రీలతో కలిసి అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని