ప్రమాదవశాత్తు నదిలో పడి వృద్ధుడి దుర్మరణం
కృష్ణా నదిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు వృద్ధుడు మృతి చెందిన సంఘటన శనివారం పెదకళ్లేపల్లిలో చోటుచేసుకుంది.
అరజా రాంకృష్ణయ్య (పాత చిత్రం)
పెదకళ్లేపల్లి (మోపిదేవి), న్యూస్టుడే: కృష్ణా నదిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు వృద్ధుడు మృతి చెందిన సంఘటన శనివారం పెదకళ్లేపల్లిలో చోటుచేసుకుంది. మోపిదేవి ఎస్ఐ సీహెచ్ పద్మ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అరజా రాంకృష్ణయ్య (74) నదిలో స్నానానికి దిగాడు. కొద్ది సేపటి తర్వాత గల్లంతయ్యాడు. అక్కడ ఉన్న వారంతా గుర్తించి వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. వీఆర్వో రమణ తహసీల్దార్కు సమాచారం ఇచ్చారు. కొద్ది సేపటి తర్వాత మృతదేహం లభించింది. రాంకృష్ణయ్యకు భార్య సుమిత్ర, ఇద్దరు కుమారులున్నారు. తెదేపా హయాంలో పెదకళ్లేపల్లి నీటి సంఘ అధ్యక్షుడిగా పనిచేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
చోడవరం యువకుడు విశాఖలో మృతి
గుర్విందల రాజేష్ (పాత చిత్రం)
పెనమలూరు, న్యూస్టుడే: మండలంలోని చోడవరం గ్రామానికి చెందిన యువకుడు విశాఖపట్నంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. గురివిందల రాజేష్ (22) చోడవరం నివాసి. కొంతకాలం కిందట డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ ఉద్యోగం చేస్తూ... నెల కిందట విశాఖపట్నం స్టీల్ప్లాంట్ ప్రాంతంలోని తన స్నేహితుల వద్దకు వెళ్లారు. అక్కడ తన స్నేహితుడు నాగరాజుతో కలిసి ఓ గదిలో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం నాగరాజు ఉద్యోగ నిమిత్తం వెళ్లి సాయంత్రం 5 గంటలకు వచ్చారు. గది తలుపులు కొట్టినా రాజేష్ తీయకపోవడంతో నిద్రిస్తున్నాడనుకొని తిరిగి బయటకు వెళ్లారు. రాత్రి 12 గంటల వరకు వేచి చూసినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి స్నేహితులు, స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టి చూడగా... అప్పటికే రాజేష్ ఉరేసుకొని కనిపించాడు. భయాందోళనలకు గురైన అతను వెంటనే రాజేష్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని శనివారం సాయంత్రం చోడవరం తీసుకొచ్చారు. మృతదేహంపై గాయాలున్నట్లు తల్లిదండ్రులు గుర్తించి పెనమలూరు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐలు రాజేష్, శేషు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్మార్టానికి తరలించారు. తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని తల్లిదండ్రులు అచ్యుతరావు, చిన్నమ్మ పోలీసుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విశాఖపట్నం బదిలీ చేస్తామని సీఐ కిషోర్బాబు తెలిపారు.
మిల్లు షెడ్డు పైనుంచి జారిపడి తాపీ మేస్త్రి..
యాకోబు మృతదేహం
నందివాడ, న్యూస్టుడే: రైసుమిల్లు షెడ్డుపై పనిచేస్తూ జారిపడి ఒక యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం మధ్యాహ్నం నందివాడలో జరిగిందని పోలీసులు తెలిపారు. నందివాడ బాబుకు చెందిన రైసుమిల్లును సుబ్బరాజు అనే వ్యక్తి లీజుకు తీసుకుని బందరుకు చెందిన వేముల బుజ్జి అనే వ్యక్తికి మరమ్మతుల నిర్వహణ పనులు అప్పగించాడు. బుజ్జి తన వద్ద ఉన్న తాపీవారు పనికి రాకపోవడంతో గుడివాడలోని నీలామహాల్ సెంటర్ వద్ద నుంచి దూళ్లవానిగూడెంకు చెందిన మదిరి యాకోబు(38) అనే యువకుడిని ఉదయం పనికి తీసుకెళ్లాడు. మిల్లు సన్షెడ్డుపై పనిచేస్తూ యాకోబు జారిపడ్డాడని, గుడివాడ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతిచెందినట్లు ఎస్ఐ శిరీష తెలిపారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
[ 24-04-2024]
‘‘పార్టీలోనే ఉండాలని డబ్బులిస్తున్నారు.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రాధాన్య పోస్టులని ఆశ చూపుతున్నారు.. చివరకు బెదిరిస్తున్నారు. -
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
[ 24-04-2024]
వేసవి రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఐఆర్సీటీసీతో కలిసి తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ఎకానమీ మీల్స్ పేరుతో విజయవాడ రైల్వే అధికారులు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. -
అంటకాగితే.. అంతే రాణా..!
[ 24-04-2024]
అధికార వైకాపాతో అంటకాగుతూ.. ప్రతిపక్ష నేతలను కక్షపూరితంగా వేధిస్తూ, అకారణంగా వారిపై కేసులు నమోదు చేసిన విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణాపై బదిలీ వేటు పడింది. -
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా
[ 24-04-2024]
విజయవాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కార్లు, స్థలాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు స్వాహా చేసిన కేటుగాడిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. -
జగన్ షాకులు.. జనం కేకలు!
[ 24-04-2024]
విద్యుత్తు సర్దుబాటు ఛార్జీల రూపంలో జగన్ వేసిన దొంగ దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పేరుకు ఛార్జీలు పెంచలేదంటూనే.. దొడ్డిదారిన వడ్డిస్తున్న ట్రూఅప్ బాదుడు మామూలుగా లేదు. -
తవ్వుకో.. దండుకో!
[ 24-04-2024]
పెడన నియోజకవర్గంలో అక్రమ ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. పెడనతో పాటు గూడూరు, కృత్తివెన్ను మండలాల్లో అక్రమార్కులు ఇసుక తవ్వకాలను నిరాటంకంగా సాగిస్తున్నారు. -
పేర్ని కిట్టూ నామినేషన్ దాఖలు
[ 24-04-2024]
మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పేర్ని వాకా సాయికృష్ణమూర్తి(కిట్టూ) అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ప్రతిభ చాటిన విద్యార్థినులకు సన్మానం
[ 24-04-2024]
స్థానిక తోటమూల భట్ట మోహనరావు, హైమావతి జిల్లా పరిషత్తు హైస్కూలు విద్యార్థులు తొలిసారిగా మంచి ఫలితాలు సాధించారని ఎంఈవో-2 వైవీ హరినాథ్ అన్నారు. -
ఏటా కొలువులన్నారు.. ఏమార్చారు
[ 24-04-2024]
రాష్ట్రంలో 2.50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇప్పటి వరకూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ నిరుద్యోగులు, వివిధ సంఘాల నాయకులు కోరుతున్నారు. -
ఒక్క ఎస్సీకైనా అవకాశమిచ్చారా జగన్?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగి అయినా గత ఐదు సంవత్సరాలలో పనిచేశారా అని మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. -
22 మంది అభ్యర్థులు...28 నామపత్రాలు
[ 24-04-2024]
జిల్లాలోని పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం 22 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
అయిదేళ్లుగా.. రెండు పిల్లర్లు వేయలేదు!
[ 24-04-2024]
ఉట్టికెగరలేని అమ్మ.. ఆకాశానికి ఎగురుతానన్నదట.. అలాగే ఉంది వైకాపా ప్రభుత్వ తీరు. అయిదేళ్లలో రెండు పిల్లర్లు నిర్మించడం చేతకాలేదు కానీ.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ బిల్డప్లు ఇస్తుంటారు. -
అదనపు పని భారంతో సిబ్బంది సతమతం
[ 24-04-2024]
ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తాం. భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తామని.. సీఎం జగన్మోహన్రెడ్డి ఊదరగొట్టారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా వేయలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. -
పాత బూత్ల ముద్రణతో ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 24-04-2024]
అధికార వైకాపా ఓటర్లను తప్పుదోవ పట్టిస్తోంది. ఓటరు స్లిప్పులను పోలింగ్ అధికారులు పంపిణీ చేయాల్సి ఉండగా, ముందస్తుగానే వాటి పంపిణీని చేపట్టింది. -
సింహ వాహనంపై ఆది దంపతులు
[ 24-04-2024]
చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదిదంపతులకు సింహ వాహన సేవను దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో రుత్వికులు శోభాయమానంగా మంగళవారం నిర్వహించారు. -
ముఖ్యమంత్రి మాట.. నీటి మూట
[ 24-04-2024]
అవనిగడ్డ - నాగాయలంక ప్రధాన రహదారిపై ఉన్న డంపింగ్ యార్డు తరలింపు ఆవశ్యకతను ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబు 2022 అక్టోబరు 20న అవనిగడ్డ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. -
జనంపై జగనన్న అదనపు బాదుడు
[ 24-04-2024]
విద్యుత్తు వినియోగదారులకు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రీడింగ్ తీసేందుకు సిబ్బంది వస్తే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. సర్ఛార్జీలు, విద్యుత్తు సుంకం, ఫిక్స్డ్, ట్రూఅప్, ఇతర ఛార్జీల పేరుతో వినియోగదారుడి ఇంటి బడ్జెట్ను ప్రభుత్వం తలకిందులు చేస్తోంది. -
గుడివాడ పసుపుమయం
[ 24-04-2024]
గుడివాడ పట్టణమంతా మంగళవారం పసుపుమయమైంది. ఎటువైపు చూసినా కనుచూపుమేరలో జనవాహిని కనిపించింది. ప్రత్యర్థి పార్టీల గుండెలదిరేలా ఎన్డీఏ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్కు జనం తరలి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి