వెంటాడి దాడి..
విజయవాడలోని అత్యంత రద్దీగా ఉండే ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో నెల క్రితం రాత్రి 10.30 సమయంలో పని ముగించుకుని ఇంటికి వెళుతున్న ఓ యువకుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి
చిన్నారులను తీవ్రంగా గాయపరుస్తున్న కుక్కలు
రాత్రి 10 దాటితే ద్విచక్ర వాహనదారులకు గండమే
నియంత్రణ లేదు.. పీహెచ్సీల్లో మందులు లేవు
ఈనాడు, అమరావతి : విజయవాడలోని అత్యంత రద్దీగా ఉండే ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో నెల క్రితం రాత్రి 10.30 సమయంలో పని ముగించుకుని ఇంటికి వెళుతున్న ఓ యువకుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. చేయి, కాలును తీవ్రంగా గాయపరిచాయి.
* కృష్ణా జిల్లాలోని విజయవాడ శివారు ప్రాంతమైన సనత్నగర్లో ఇంటి ముందే ఆడుకుంటున్న మూడేళ్ల సిద్ధిక్ అనే బాలుడిపై వీధికుక్కలు ఇటీవల దాడి చేశాయి. ముక్కు, ముఖంతో పాటు కాళ్లపై కొరకడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.
* కృష్ణా జిల్లాలోని కానూరు సమీపంలో ఉన్న మహదేవపురం కాలనీలో రాంబాబు అనే డ్రైవరు రాత్రి 10 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వీధికుక్కలు వెంటపడి దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వాహనంపై నుంచి కూడా కిందపడి గాయపడ్డాడు.
* మచిలీపట్నంలోని జగన్నాథపురంలో ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కుక్కలు వెంటాడి మరీ కరిచాయి. వాహనం పట్టుతప్పి పడిపోయినా వదలకుండా దాడి చేశాయి.
* మచిలీపట్నం రాజుపేటలో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా కుక్కలు వెంటపడి మరీ తీవ్రంగా గాయపరిచాయి.
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గత మూడు నాలుగేళ్లలో వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. విజయవాడ నగరం, శివారులోని ఏ వీధిలో చూసినా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు, స్థానికంగా ఆడుకునే చిన్నారులపై విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో ప్రతి రోజూ పదుల సంఖ్యలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి కుక్కకాటు ఇంజెక్షన్ల (యాంటీ రేబిస్) కోసం బారులు తీరుతున్నారు. వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతుండడం వల్లే గత రెండు మూడేళ్లలోనే వీటి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. గతంలో ఎప్పుడూ తమ ప్రాంతంలో ఇన్ని వీధి కుక్కలను చూసింది లేదని, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి వదిలేస్తున్నారంటూ విజయవాడ సహా శివారు ప్రాంతాల్లోని చాలా కాలనీల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంగళవారం కూడా విజయవాడలోని ఆంజనేయవాగు ప్రాంతంలో మేఘన అనే ఐదేళ్ల బాలిక ఇంటి దగ్గరే తల్లి వెనుక వస్తుండగా వీధి కుక్కలు దాడి చేసి కాలిపై తీవ్రంగా గాయం చేశాయి.
సూది మందుల్లేవ్...
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి రెండేళ్ల క్రితం వరకూ రోజుకు 30 నుంచి 40 మంది వరకూ యాంటీ రేబిస్ ఇంజెక్షన్ల కోసం వచ్చేవారు. ప్రస్తుతం వీరి సంఖ్య రోజుకు 70కు పైగా పెరిగింది. కుక్కకాటుకు గురై ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నవారి సంఖ్య మాత్రమే ఇది. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్న వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. విజయవాడ నగరంలోని చాలా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కడా కుక్క కాటు ఇంజెక్షన్లు లేవు. దీంతో స్థానికంగా కుక్క కరిచిన వెంటనే స్థానికులు పీహెచ్సీలకు వెళ్లడం, అక్కడ ఇంజెక్షన్లు లేవని చెప్పడంతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి పరుగులు తీయడం పరిపాటిగా మారిపోయింది. భవానీపురం పీహెచ్సీకి తీసుకెళ్లగా కుక్కకాటు ఇంజెక్షన్లు లేవని చెప్పడంతో విజయవాడ జీజీహెచ్కు హుటాహుటిన తరలించారు. ఇటీవల భవానీపురం ఊర్మిళానగర్లో బాలుడిపై కుక్కలు దాడి చేయగా స్థానికంగా ఉన్న పీహెచ్సీకి తీసుకెళ్లారు. కానీ. అక్కడ ఇంజెక్షన్లు లేవని చెప్పడంతో విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాజీవ్నగర్లో ఎనిమిదేళ్ల బాలుడిపై దాడి చేసినప్పుడు కూడా స్థానిక పీహెచ్సీలో ఇంజెక్షన్లు లేవు. కొత్తాస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది.
మచిలీపట్నంలో శస్త్రచికిత్సలే లేవు...
మచిలీపట్నంలో వీధి కుక్కల నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. చాలాకాలంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు పూర్తిగా ఆపేశారు. కనీసం వ్యాక్సిన్లు సైతం వేయడం లేదు. దీంతో గత నాలుగేళ్లలో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నగరంలోని ఏ ప్రాంతంలో చూసినా గుంపులు గుంపులుగా సంచరిస్తూ కనిపిస్తున్నాయి. మహిళలు, ద్విచక్ర వాహనదారులను వెంటాడి మరీ దాడి చేస్తున్నాయి. మచిలీపట్నంలోని పశువుల ఆస్పత్రి దగ్గరే వీధి కుక్కల నియంత్రణ కోసం యానిమల్ బర్త్ కంట్రోల్ షెడ్(ఏబీసీ)ని గత ప్రభుత్వ హయాంలో కట్టారు. గత మూడున్నరేళ్లుగా ఆ భవనం ఖాళీగా పడి ఉంది. వైద్యులు, సిబ్బంది లేరంటూ ఎలాంటి శస్త్రచికిత్సలు చేయడం లేదు.
* విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 30వేలకు పైగా వీధి కుక్కలు ఉన్నట్లు ఇటీవల అంచనా వేశారు. వీటి సంతతిని అదుపు చేసేందుకు ఏటా రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నారు. ఏటా కుక్కల సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలకే రూ.కోటికి పైగా ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు. వీటితో పాటు వీధి కుక్కలకు యాంటీ రేబిస్ వాక్సిన్లు వేసేందుకు కూడా ఏటా భారీగా ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు.
300 మంది వరకూ..
కుక్కల దాడిలో గాయపడి ఒక్క మచిలీపట్నంలోని ప్రభుత్వాస్పత్రికే నెలకు 300 మంది వరకూ యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు వేయించుకునేందుకు వస్తున్నారు. పీహెచ్సీల్లో ఇంజెక్షన్లు వేయించుకునేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది.
ఒక్క విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలోనే 2020 నుంచి ఏటా 20వేలకు పైగా యాంటీ రేబిస్ ఇంజెక్షన్ల వినియోగం జరుగుతోంది. వీటిలో మొదటి డోసు వేసుకుంటున్న వాళ్ల సంఖ్య 6వేల నుంచి 8వేల వరకూ ఉంటోంది. ఇటీవల రోజుకు 70 మంది వరకూ మొదటి డోసు ఇంజెక్షన్ల కోసం వస్తున్నారు. రి విజయవాడలోని భవానీపురం ఊర్మిళానగర్లోని వైఎస్ఆర్ పార్కు సమీపంలో 14 ఏళ్ల బాలుడిపై వీధికుక్కలు వారం క్రితం దాడి చేశాయి. సాయంత్రం సమయంలో నడుచుకుంటూ వెళ్తుండగా రెండు కుక్కలు వెంటపడి తీవ్రంగా గాయపరిచాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
[ 29-03-2024]
పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
[ 29-03-2024]
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
మీకో దండం.. మీతో ఉండం
[ 29-03-2024]
మచిలీపట్నం నగరపాలిక పరిధిలో 12 మంది వాలంటీర్లు ఈ నెలలోనే తమ రాజీనామాలను కమిషనర్కు సమర్పించారు. 39వ వార్డులో ఆరుగురు, 20వ వార్డులో నలుగురు, 7, 47వ వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున వైదొలగారు. -
అంతా అన్నారు.. కొంతే కొన్నారు!
[ 29-03-2024]
దివిసీమలో ఖరీఫ్ ఆలస్యంగా సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోతలు కోస్తున్నారు. నూర్పిళ్లు చేస్తున్నారు. -
ఆత్మీయ అతిథికి అపూర్వ స్వాగతం
[ 29-03-2024]
సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. -
తమ్ముళ్లూ.. మీరే మా బలం
[ 29-03-2024]
పోరాట పటిమ చూపి రానున్న ఎన్నికల్లో తెదేపా విజయానికి కృషి చేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. -
‘తుస్సుమన్న జగన్ బస్సు యాత్ర’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమందని.. డబ్బులిచ్చినా, బిర్యానీలు పెట్టినా ఎవరూ రావడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
దూసుకొస్తున్నాయ్.. జాగ్రత్తమ్మా!
[ 29-03-2024]
రెప్పపాటులో దూసుకొచ్చే వాహనాలు.. ఆదమరచి రోడ్డుపైనే ఆడుకునే చిన్నారులు.. రోడ్డు దాటాలా వద్దా అని తటపటాయించి ఒక్కసారిగా పరిగెత్తే విద్యార్థులు.. -
వైకాపా నేతల కనుసన్నల్లో.. అర్ధరాత్రి ఇసుక అక్రమ తవ్వకాలు
[ 29-03-2024]
అనుమతులు లేని తవ్వకాలపై ప్రజలు ఆందోళనకు దిగినా.. జాతీయ హరిత ట్రైబ్యునల్కు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకునే నాథుడే లేరు. -
అంతర జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
[ 29-03-2024]
జల్సాలకు అలవాటుపడి వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న దొంగను పట్టుకొని 37 ద్విచక్ర వాహనాలను తోట్లవల్లూరు పోలీసులు పట్టుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. -
నిశిత తనిఖీలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, గంజాయి తదితరాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. -
కోడ్ ఉల్లంఘించి.. వైకాపా నేతల వేడుకలు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. వైకాపా నేతల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. -
‘అతడి ఆత్మహత్యాయత్నానికి కారకులెవరు..?’
[ 29-03-2024]
ఓ మనిషి ప్రాణం తీసుకునేలా ప్రేరేపించడం దారుణం. న్యాయం కోసం వస్తే కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన వారే అతడి ఆత్మహత్యాయత్నానికి కారణం కావడం శోచనీయం. -
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
[ 29-03-2024]
జిల్లాలోని గంపలగూడెం మండలం పెదకొమిర, రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు ఆర్.శైలజ, ఎ.వీరరాజు గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ