చేసేందుకా.. మేసేందుకా?
పామర్రు పరిధిలో ఎగువ గుడివాడ సెక్షన్ కింద 2023-24 నిర్వహణ పనుల కింద ఎగువ పుల్లేరు కాలువ, రైవస్ కాలువ.. బ్రాంచ్ల్లో తూటికాడ తొలగింపునకు రూ.23.70 లక్షల అంచనాతో టెండర్ పిలిచారు.
ఎమ్మెల్యేలు చెబితే సరి..
నిర్వహణ పనులన్నీ ముక్కలే..
టెండర్ల దాఖలు తక్కువకే
ఈనాడు, అమరావతి
* పామర్రు పరిధిలో ఎగువ గుడివాడ సెక్షన్ కింద 2023-24 నిర్వహణ పనుల కింద ఎగువ పుల్లేరు కాలువ, రైవస్ కాలువ.. బ్రాంచ్ల్లో తూటికాడ తొలగింపునకు రూ.23.70 లక్షల అంచనాతో టెండర్ పిలిచారు. దీనికి ఓ గుత్తేదారు రూ.16.50 లక్షలకు టెండర్ వేశారు. అంటే దాదాపు 31 శాతం తక్కువ. ఆయనకు పనులు అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నారు.
* ఏలూరు కాలువలో 4.250 కిమీ నుంచి 18.500 కిమీ వరకు తూటి కాడ తొలగింపు, రసాయనాలు చల్లడం, ఫ్లౌవింగ్ ద్వారా తూటికాడ తొలగింపునకు రూ.22.60 లక్షల అంచనాతో టెండర్ పిలిచారు. దాదాపు 35 శాతానికి తక్కువకు కోట్ చేశారు. దీంతో ఆ పనులు ఆ గుత్తేదారుకే ఇవ్వాలి. ఇంకా ఖరారు కాలేదు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో జలవనరుల శాఖలో నిర్వహణ పనుల తీరు అక్రమాలకు నిలయంగా మారింది. అసలు పనులు జరుగుతున్నాయో లేదో తెలియడం లేదు. ఉద్యోగులు, విద్యార్థుల హాజరు సైతం బయోమెట్రిక్, ముఖ ఆధారిత గుర్తింపు ద్వారా నమోదు చేస్తుంటే.. జలవనరుల శాఖలో అసలు చేసిన పనులకు ఎంబీలు(కొలతల పుస్తకం) మినహా ఎలాంటి ఆధారాలు లేదు. అసలు పనులు జరుగుతున్నాయో లేదో... కనీసం పర్యవేక్షణ లేదు. నాణ్యత పరీక్షలు బోగస్గా మారాయి. గత ఏడాది నిర్వహణ(ఓఅండ్ఎం) పనులు ప్యాకేజీలుగా మార్చి 5 శాతం వరకు అధిక ధరలకు అప్పగించేలా చక్రం తిప్పిన ఎమ్మెల్యేలు ఈసారి ముక్కలు చెక్కలు చేసేందుకే అనుమతించారు. చిన్నచిన్న పనులుగానే టెండర్లను పిలిచారు. దీనికి గుత్తేదారులు పోటీలు పడి 30-45 శాతం తక్కువకే టెండర్లు దాఖలు చేశారు. వెరసి అసలు పనులు చేసేందుకే ఇంత తక్కువకు టెండర్లను వేశారా..? అనే అనుమానాలు ఇంజినీర్లే వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రూ.30 కోట్ల విలువైన పనులకు జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల టెండర్లను పిలిచి.. సోమ, మంగళవారాల్లో తెరిచారు. బుధవారం టెండర్ విశ్లేషణ(ఎవాల్యూషన్) చేయగా.. త్వరలో ఖరారు చేసి ఒప్పందాలు చేసుకోవాలి.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 151 నిర్వహణ పనులకు మూడు విభాగాల కింద టెండర్లు పిలిచారు. వీటి విలువ రూ.28.06 కోట్లు. ఈ ఏడాది నిర్వహణ పనులకు రూ.30 కోట్లు కేటాయించారు. బుధవారమే కాలువలకు నీరిచ్చారు. ఖరీఫ్ సీజన్ ఆసాంతం కాలువల్లో నీరు పారనున్న వేళ నిర్వహణ పనులకు తావెక్కడని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వంద క్యూసెక్కుల చొప్పున కాలువలకు నీరిచ్చారు. మరో వారం.. పది రోజుల తర్వాత 200 క్యూసెక్కులు ఇవ్వనున్నారు. ఆ ప్రవాహానికి తూటికాడ కొట్టుకుపోయి లాకులు/గేట్లు/తూములు వద్ద ఆగిపోతుంది. దీనిని తొలగిస్తే సరిపోతుంది. ఇందుకు రూ.లక్షల అంచనాలతో టెండర్లను పిలిచారు. దీంతో గుత్తేదారులు పోటీపడి తక్కువకే టెండర్లు వేశారు. రసాయనాలు కాలువలో చల్లుతారు. దీనికి లెక్కలేదు. నాణ్యత పరీక్షలు ఊసే ఉండదు. కేవలం కాగితాల్లోనే ఉంటుంది. ఇక ఎవరి కమీషన్లు వారివే. ఎంబీ చేసి బిల్లులు చెల్లించేందుకు మొత్తం 10 శాతం వరకు గుత్తేదారులు ఇస్తారు. ముందుగానే అంచనాలు పెంచి వేసేందుకు గుత్తేదారుల నుంచి మామూళ్లు అందుతున్నాయి. అయితే ఈసారి ప్రజాప్రతినిధులు వారి అనుచరులకు గ్రామాల వారీగా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎవరికి టెండరు వచ్చినా.. ఎమ్మెల్యే సూచించిన వారికే ఇవ్వాల్సిందేనని అంటున్నారు.
గత ఏడాది ప్యాకేజీలు...
2022-23 ఏడాదికి రూ.50 కోట్లు నిర్వహణ పనులకు కేటాయించగా ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని 30 నుంచి 70 వరకు పనులు గుదిగుచ్చి ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. దాదాపు రూ.40 కోట్లు విలువైన 250 పనుల వరకు.. ఆరు వరకు ప్యాకేజీలు పిలిచారు. వీటిని ఎమ్మెల్యే బినామీలకు, అనుచరులైన గుత్తేదారులకు అప్పగించారు. ఎమ్మెల్యేల జోక్యంతో 5శాతం వరకు అధిక ధరలకే టెండర్లను దక్కించుకున్నారు. వీటిలో చాలావరకు పనులు చేయలేదు. దీనిపై ‘ఈనాడు’లో వచ్చిన కథనానికి స్పందించి కృష్ణా జిల్లా గత కలెక్టర్ రంజిత్బాషా విచారణకు ఆదేశించారు. ఉయ్యూరు ఆర్డీవో విజయ్కుమార్ విచారణ చేస్తే అసలు పనులు ప్రారంభించలేదని ఫిబ్రవరిలోనే తేలింది. తర్వాత కూడా అవి జరగనేలేదు. తాజాగా పూర్తి చేసినట్లు చెబుతున్నారు. బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. సగానికి పైగా దోపిడీ జరిగిందని ఇంజినీర్లే అంగీకరిస్తున్నారు. ఈ ఏడాది ప్యాకేజీల జోలికి వెళ్లకుండా ముక్కలనే ఉంచారు. దీనిపై అధికారులు మాత్రం పెదవి విప్పడం లేదు. ప్యాకేజీలు చేస్తే.. బడా గుత్తేదారులు త్వరితగతిన పనులు చేస్తారని చెప్పిన అధికారులు ప్రస్తుతం పనులు జరగకపోవడంపై, చిన్న పనులుగా పిలవడంపై మౌనంగా ఉన్నారు. ప్రజాప్రతినిధులు చెప్పినట్లు చేస్తున్నారని అంటున్నారు. వాస్తవం వివరించే ప్రయత్నం చేస్తే.. ‘బుద్ధి లేదా..! ఒళ్లు దగ్గరపెట్టుకోండి..!’ అనే హెచ్చరికలు వస్తుంటాయని ఓ ఇంజినీరు వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా?: షర్మిల
[ 25-04-2024]
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. -
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు