శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ పి.జాషువా హెచ్చరించారు.
అధికారులకు సూచనలు చేస్తున్న కలెక్టర్ రాజబాబు, పక్కనే ఎస్పీ జాషువా తదితరులు
గుడివాడ గ్రామీణం, న్యూస్టుడే:c స్థానిక టిడ్కో కాలనీలో కలెక్టర్ పి.రాజబాబు, ఎస్పీ జాషువా, ఎమ్మెల్యేలు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), పేర్ని వెంకట్రామయ్య(నాని)లు వివిధ శాఖల అధికారులతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సుమారు 9 వేల మంది గృహప్రవేశాలు చేసే శుభ సందర్భం ఇదని, ఇక్కడ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈనెల 8వ తేదీ నుంచి టిడ్కో కాలనీలో పోలీసు సిబ్బందిని నియమించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. సభకు వచ్చే వాహనాలకు పార్కింగ్ స్థలాలు కేటాయించామని, అక్కడ డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు. కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతి పెద్ద గృహ సముదాయాన్ని గుడివాడలో సీఎం ఈనెల 9న ప్రారంభిస్తారని చెప్పారు. 20 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి లాంఛనంగా ఫ్లాట్లను అప్పగిస్తారని, మిగిలిన వారికి అధికారులు అందజేసి గృహప్రవేశాలు చేయిస్తారన్నారు.
600 బస్సుల ఏర్పాటు...ముఖ్యమంత్రి సభకు గుడివాడ పట్టణం, పరిసర గ్రామాల నుంచి ప్రజలను తరలించడానికి సుమారు 600 బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. వార్డుకు మూడు బస్సుల జనాన్ని తరలించడానికి సిద్ధమవుతున్నారు. సభావేదిక వద్ద గత రాత్రి కురిసిన వర్షానికి బురద మయం కాగా...ఫ్లైయాష్ పరిచి చదును చేశారు. హెలీప్యాడ్ను వేగంగా నిర్మిస్తున్నారు. సీఎం హెలీప్యాడ్ నుంచి సభావేదిక వద్దకు వచ్చి తిరిగి అక్కడకు వెళ్లే మార్గంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
సిద్ధమవుతున్న సభావేదిక
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయిదాడి కేసు.. పోలీసుల అదుపులో మరో వ్యక్తి
[ 17-04-2024]
అజిత్సింగ్ నగర్ వడ్డెర కాలనీలో మహిళలు, చిన్నారులు బుధవారం ఆందోళన నిర్వహించారు. -
తోడేళ్ల రాజ్యం
[ 17-04-2024]
కృష్ణా జిల్లాలో ఓ ప్రజాప్రతినిధికి జేపీ పేరుతో అప్పగించగా.. ఆయన నష్టం వస్తుందని వదిలేశారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన ప్రజాప్రతినిధుల సోదరులు, మరో ప్రజాప్రతినిధి వియ్యంకుడు, కింది వైపున ఓ మంత్రి, ప్రజాప్రతినిధి సోదరుడు ఇష్టానుసారం కొల్లగొట్టారు. -
మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైను ఐదేళ్లలో పూర్తి
[ 17-04-2024]
దివిసీమ వాసులు దశాబ్దాలుగా కోరుతున్న.. మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైన్ను తాము గెలిచిన తర్వాత ఐదేళ్లలోనే పూర్తిచేస్తామని జనసేన, తెదేపా, భాజపా కూటమి మచిలీపట్నం లోక్సభ అభ్యర్థి, ఎంపీ వల్లభనేని బాలశౌరి వెల్లడించారు. -
తీరాన నేడు.. ప్రజాగళం
[ 17-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం సభలో పాల్గొనేందుకు తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్లు బుధవారం పెడన రానున్నారు. -
పనులు చేశారా.. పైసలు మేశారా..!
[ 17-04-2024]
ఎయిర్పోర్టు గ్రీన్ కారిడార్లో భాగంగా ఇటీవల విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి రామవరప్పాడు కూడలి దాకా సుమారు 13 కి.మీ జాతీయ రహదారిని అధికారులు అభివృద్ధి చేశారు. -
‘జగన్ హయాంలో కార్మికులకు ఉపాధి కరవు’
[ 17-04-2024]
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులకు ఉపాధి కరవైందని తెదేపా జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. విజయవాడ గురునానక్ రోడ్డులోని ఎన్ఏసీ కల్యాణ మండపంలో మంగళవారం -
హామీ ఇచ్చారు.. నిర్మాణం మరిచారు
[ 17-04-2024]
అవనిగడ్డ మండలంలోని లంక గ్రామమైన పాత ఎడ్లంకకు రాకపోకలు సాగించేందుకు వీలుగా కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మరుగున పడింది. -
రూకలివ్వలేదు.. రూపు మారలేదు!
[ 17-04-2024]
విజయవాడ రూపురేఖలు మేమే మార్చాం. అభివృద్ధి మా ప్రభుత్వమే చేసింది’ అని సీఎం జగన్ విజయవాడ పర్యటనకు వచ్చినపుడు పదే పదే చెప్పే అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకున్నారు. -
అప్పుల బతుకు..!
[ 17-04-2024]
రాష్ట్రం రుణాంధ్రప్రదేశ్గా మారడంతో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. పీఆర్సీ, కరవు భత్యం, సరెండర్ లీవులు తదితరాల కింద రూ.25,000 కోట్లకు పైగా ప్రభుత్వం నుంచి అందాల్సి ఉంది. -
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 17-04-2024]
సార్వత్రిక ఎన్నికల ఘట్టానికి తెరలేచింది. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ లోక్ సభ స్థానంతో పాటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 18వ తేదీ నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. -
నమ్మించి.. వంచన
[ 17-04-2024]
ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వారికి రావాల్సిన బకాయిలను సైతం ఏళ్లతరబడి విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభ
[ 17-04-2024]
సివిల్స్ ఫలితాల్లో శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్, విజయవాడ శాఖల్లో శిక్షణ తీసుకున్న విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని... -
వైకాపాకు ‘బొకినాల’ రాజీనామా
[ 17-04-2024]
బాపులపాడు మండలం మల్లవల్లికు చెందిన వైకాపా నాయకుడు బొకినాల సాంబశివరావు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఐ లావాదేవీలు.. ఫోన్పే, గూగుల్పే ఆధిపత్యానికి NPCI చెక్..!
-
పేదలకు ఉచితంగా 10 గ్యాస్ సిలిండర్లు.. టీఎంసీ మేనిఫెస్టో విడుదల
-
270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘన.. యువతికి రూ.1.36 లక్షల జరిమానా
-
నరైన్ అరుదైన రికార్డు.. శ్రేయస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా
-
భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్
-
మాదాపూర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్ట్