‘పదవీ కాలం పూర్తయినా వేధిస్తున్నారు’
ఏపీ ఉర్దూ అకాడమీ మాజీ ఛైర్మన్ నదీమ్ అహ్మద్ తన పదవీ కాలం పూర్తయినా, ఇప్పటికీ కార్యాలయంలోనే ఉంటూ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అందులో పనిచేసే ఉద్యోగులు వాపోయారు.
ఉర్దూ అకాడమీ కార్యాలయం వద్ద ఉద్యోగుల నిరసన
విజయవాడ(భవానీపురం), న్యూస్టుడే: ఏపీ ఉర్దూ అకాడమీ మాజీ ఛైర్మన్ నదీమ్ అహ్మద్ తన పదవీ కాలం పూర్తయినా, ఇప్పటికీ కార్యాలయంలోనే ఉంటూ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అందులో పనిచేసే ఉద్యోగులు వాపోయారు. మాజీ ఛైర్మన్ నదీమ్ అహ్మద్కు వ్యతిరేకంగా విజయవాడ భవానీపురం హెచ్బీ కాలనీలోని కార్యాలయం వద్ద ఉద్యోగులు బుధవారం సాయంత్రం నిరసన తెలిపారు. మాజీ ఛైర్మన్ కార్యాలయానికి రాగా నిలదీశారు. ఈ సందర్భంగా ఉర్దూ అకాడమీ ఉద్యోగి మహ్మద్ ఉమర్ మాట్లాడుతూ మాజీ ఛైర్మన్ నదీమ్ అహ్మద్ రెండేళ్ల పదవీ కాలం ఈ ఏడాది జులై 28తో పూర్తయిందన్నారు. అయినా ఆయన కార్యాలయానికి వచ్చి పనులు చక్కబెట్టుకుంటున్నారని తెలిపారు. అకాడమీలో 15 నుంచి 35 ఏళ్లుగా పని చేస్తున్నప్పటికీ సర్వీసుకు తగినట్లు జీతాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఉర్దూ అకాడమీలో రాష్ట్ర వ్యాప్తంగా 167 మంది ఉద్యోగులు పని చేస్తున్నామని, రెండేళ్ల నుంచి తమ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మభ్యపెట్టారన్నారు. కొందరు ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటే మాజీ ఛైర్మన్ నదీమ్ అహ్మద్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో తనకు పలుకుబడి ఉందని, ఉద్యోగులను ఏమైనా చేస్తానని బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఆయన ఒక డైరెక్టర్ను, సూపరింటెండెంట్ను కార్యాలయానికి తెప్పించుకున్నారని, వారి పదవీ కాలం కూడా పూర్తి కావొచ్చాయని తెలిపారు. తమ సమస్యలను డిప్యూటీ సీఎం, ప్రిన్సిపల్ సెక్రటరీలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటే డైరెక్టర్, సూపరింటెండెంట్లు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యాలయానికి వచ్చిన నదీమ్ అహ్మద్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి కొందరు ఉద్యోగులపై కేసులు ఉన్నాయని, వాటివల్లే సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. తన పదవీ కాలం పూర్తయినప్పటికీ పొడిగింపు ఉత్తర్వులు వస్తాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కట్టలేరు
[ 06-12-2023]
తుపాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. -
Vijayawada: నేడూ విజయవాడ డివిజన్లో రైళ్ల రద్దు
[ 06-12-2023]
తుపాను తీరం దాటడంతో రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది. డివిజన్ పరిధిలోని ఆయా స్టేషన్లలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు సమాచారం అందిస్తున్నారు. -
కల్లాలను కమ్మేసి.. కష్టాల్లో నెట్టేసి
[ 06-12-2023]
ధాన్యం రాశులు తడిసి కొందరు.. కోసిన వరి పనలు తడిసి మరికొందరు.. నేలకొరిగిన వరి చేలు చూసి కన్నీరు మున్నీరవుతున్న కర్షకులు ఎందరో... ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు. -
మిగ్జాం... బీభత్సం
[ 06-12-2023]
కుండపోత వర్షం.. వణికించిన ఈదురుగాలులు.. నేలకూలిన చెట్లు.. ధ్వంసమైన దారులు.. కూలిన గుడిసెలు.. ఎడతెరిపి లేని ముసురుతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు పంటలకు అపార నష్టం సంభవించింది. -
అన్నదాతపై మిగ్జాం పంజా
[ 06-12-2023]
మిగ్ జాం తుపాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వీస్తున్న ఈదురు గాలుల వల్ల జిల్లాలో జనజీవనం స్తంభించింది. పలు చోట్ల విద్యుత్తు స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరగడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
తీపి పంచేనా?
[ 06-12-2023]
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏకైక ఉయ్యూరు కేసీపీ చక్కెర కర్మాగారంలో 2023-24 క్రషింగ్ సీజన్ ఈ నెల 6వ తేదీన ప్రారంభం కానుంది. గత నాలుగైదేళ్లుగా సాగు పెంచేందుకు కేసీపీ వ్యవసాయ విభాగం, యాజమాన్యం ఎంత ప్రయత్నించినా ఆశించిన ఫలితం కనపడలేదు -
ప్రయాణికులు లేక బస్సులు రద్దు
[ 06-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల ప్రభావం ఆర్టీసీ సర్వీసులపై పడింది. వాతావరణం అనుకూలంగా లేక చాలా మంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. -
తడిసి ముద్దయిన నగరం..
[ 06-12-2023]
జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారులు జలమయంకావడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. సాధారణ ప్రజలు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
దారులు కాదు.. దారుణాలే
[ 06-12-2023]
విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి జక్కంపూడి మీదుగా మైలవరం వెళ్లేదారి మధ్యలో గుంతలు కనిపిస్తున్నాయి. వర్షాలు పడుతుండటంతో.. తారుపోయి గుంతలు ఏర్పడ్డాయి. -
కనీస వేతనాల కరవు.. అభద్రతాభావం..
[ 06-12-2023]
విజయవాడ గాంధీనగర్లోని జింఖానా మైదానంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న పొరుగు సేవల ఉద్యోగుల రాష్ట్ర స్థాయి ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అసోసియేట్ ఛైర్మన్ టి.వి.ఫణి పేర్రాజు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సంఘ నాయకులు పిలుపునిచ్చారు. -
రైల్వేకు ప్రతిష్ఠాత్మక అవార్డులు
[ 06-12-2023]
విజయవాడ డివిజన్కు అవార్డుల పంట పండింది. అధికారులు, సిబ్బంది కృషి కారణంగా ఈ ఏడాది వివిధ విభాగాల్లో ప్రతిష్ఠాత్మకమైన జీఎం ఎఫిషియన్సీ షీల్డులు కైవసం చేసుకుంది. -
సహాయ చర్యలకు కలెక్టర్ ఆదేశం
[ 06-12-2023]
తుపాను నేపథ్యంలో కలెక్టర్ ఎస్.డిల్లీరావు మంగళవారం నగర, పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. సహాయక చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
నేడూ పాఠశాలలు.. కళాశాలలకు సెలవు
[ 06-12-2023]
తుపాను నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ బుధవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించినట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
అపరాల విత్తనాలను ఉచితంగా ఇవ్వాలి: మండలి
[ 06-12-2023]
రైతులు రెండో పంటగా వేసేందుకు మినుము, మొక్క జొన్న, పెసర విత్తనాలను ఉచితంగా ప్రభుత్వం అందించాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కోరారు. -
పంట నష్టం లెక్కింపులో జాప్యం వద్దు
[ 06-12-2023]
తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు డిమాండ్ చేశారు. -
నేర వార్తలు
[ 06-12-2023]
ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన వైద్యుడు అతని కుటుంబం వేధించడం వల్ల, మరో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన కుమార్తె చనిపోయిందని తండ్రి ఎస్పీ పి.జాషువాను ఆశ్రయించడంతో మంగళవారం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా డీఎస్పీ పి.శ్రీకాంత్ దర్యాప్తు... -
దేశంలో 12 అత్యంత తీవ్రమైన తుపానులు
[ 06-12-2023]
బంగాళాఖాతంలో ఇంతవరకు అత్యంత తీవ్రమైన తుపాన్లు 12 ఏర్పడ్డాయి. వాటిలో 3 అత్యంత ప్రభావమైనవి మచిలీపట్నం, సమీపాల వద్ద తీరాన్ని దాట¨ జన నష్టంతోపాటు, పశు, పంట నష్టాలను మిగిల్చి కొన్ని ఊళ్ల రూపురేఖలను కనుమరుగు చేశాయి. -
పునరావాస కేంద్రాలకు 4,300 మంది
[ 06-12-2023]
తుపాను ప్రభావిత ఏడు మండలాల పరిధిలోని 249 గ్రామాల నుంచి మంగళవారానికి 4,300 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. నాగాయలంక మండలంలో 19, కోడూరు 6, మచిలీపట్నం 25, కృత్తివెన్ను 5, అవనిగడ్డ 4, మోపిదేవి 3, బంటుమిల్లి 4, చల్లపల్లిలో 4 చొప్పున పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. -
తుపానుతో మినుముకూ నష్టమే
[ 06-12-2023]
తుపానుతో రైతులు మినుము పంటనూ కోల్పోయే పరిస్థితి నెలకొంది. యంత్రాలతో వరి కోసిన రైతులు దమ్ము చేసి మినుము విత్తనాలు చల్లారు. అవి చాలా చోట్ల మొక్కలుగా ఎదిగాయి. -
రైతులను ఉదారంగా ఆదుకోవాలి
[ 06-12-2023]
తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పంటపై రూ.వేలు పెట్టుబడి పెట్టారని, వారికి సహాయం అందించి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Gurpatwant Singh Pannun: పన్నూ బెదిరింపుల వీడియో.. దిల్లీలో అలర్ట్
-
Atlee: ‘జవాన్’కు అరుదైన గౌరవం.. ఆనందంగా ఉందంటూ అట్లీ పోస్ట్
-
AP High Court: విశాఖకు కార్యాలయాలను తరలించడంపై జీవో.. హైకోర్టులో విచారణ
-
BJP: అసెంబ్లీలకి ఎన్నికైన.. 10 మంది భాజపా ఎంపీల రాజీనామా
-
Automobile Sales: రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. నవంబర్లో 28.54 లక్షల అమ్మకాలు
-
AP High Court: ‘ఇసుక కేసు’లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా