ఇళ్లు ఇప్పిస్తానని మోసం
కబేళా సెంటర్లో నగరపాలక సంస్థ నిర్మించిన జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు ఇప్పిస్తామని మోసం చేసిన ఇద్దరిపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..
10 మంది వద్ద రూ.19 లక్షల వసూలు
వీఎంసీ అధికారుల సంతకాలతో రశీదులు
చిట్టినగర్, న్యూస్టుడే : కబేళా సెంటర్లో నగరపాలక సంస్థ నిర్మించిన జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు ఇప్పిస్తామని మోసం చేసిన ఇద్దరిపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తపేట, పైలావారి వీధికి చెందిన జిల్లెల్ల రామారావు ప్లాస్టిక్ వ్యాపారం చేస్తాడు. తనతో పాటు ప్లాస్టిక్ వ్యాపారం చేసే కోటి ద్వారా ఆర్ఎంపీగా పని చేసే మస్తాన్ పరిచయమయ్యాడు. అతనికి నగరపాలక సంస్థలో పెద్ద పెద్ద అధికారులు తెలుసని చెప్పాడు. కబేళా సెంటర్ వద్ద జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద నిర్మించిన ఇళ్లు తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి డబ్బులు చెల్లిస్తే ఇప్పిస్తానని అన్నాడు. అందుకు రూ.3.50 లక్షల వరకు అవుతుందని మస్తాన్ రామారావుకు చెప్పాడు. నిజమేనని నమ్మి మస్తాన్కి మొదటిగా రూ.50 వేలు, రెండోసారి రూ.66,000లు చెల్లించాడు. 2021 అక్టోబరు 20వ తేదీన జేఎన్ఎన్యూఆర్ఎం, బీఎస్యూపీ లబ్ధిదారులకు సమాచార లేఖను ప్రాజెక్టు మేనేజర్, హౌసింగ్ సేల్ సంతకంతో కూడిన రశీదు రామారావుకు ఇచ్చాడు. అందులో రామారావు లబ్ధిదారుడని పొందుపరచి ఉంది. కట్టిన డబ్బులకు గ్యారెంటీ ఏంటని మస్తాన్ అడిగితే పాతరాజరాజేశ్వరీపేటలోని జేపీ అపార్టుమెంట్లో నివాసం ఉండే షకీలా అనే మహిళ దగ్గరకు తీసుకెళ్లి ఈమె ద్వారానే ఇళ్లు వస్తాయని ఆమెను పరిచయం చేశాడు. ఆమె రామారావుతో మీకు తప్పకుండా ఇల్లు వస్తుందని చెప్పింది. అనుమానం వచ్చి ఈ విషయమై నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లి విచారించగా మస్తాన్, షకీలా మోసం చేశారని తెలిసింది. మిగతా డబ్బులు ఎంత తొందరగా చెల్లిస్తే అంత తొందరగా ఇళ్లు వస్తాయని, డబ్బులు కట్టమని ఒత్తిడి చేశారు. రామారావుతోపాటు అతని అత్త పుష్పలత తెలిసిన వారైన యోగి, జానకీరావు, జాన్పాల్, మరికొంత మంది గృహాల కోసం డబ్బులు చెల్లించారు. ఇళ్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి మోసగించిన మస్తాన్, షకీలాపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితుడు రామారావు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. వీరిద్దరు ఇళ్లు ఇప్పిస్తామని 10 మంది వద్ద సుమారు రూ.19 లక్షల మేర వసూలు చేసి మోసం చేసినట్లు ప్రాథమికంగా తెలిసిందని సీఐ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికార పాపం.. అన్నదాతకు శాపం!
[ 07-12-2023]
కృష్ణా జిల్లాకు మిగ్జాం అపారనష్టం కలిగించింది. అన్నదాతలు ఆరుగాలం కష్టపడిన శ్రమ వరదనీటి పాలైంది. రూ.కోట్లలో నష్టం వచ్చింది. ప్రకృతి వైపరీత్యాలు కొంత అయితే.. అధికారుల అవినీతి, పాలకుల నిర్లక్ష్యం అన్నదాతల పాలిట శాపంగా మారింది. -
ఒకటోసారీ.. రెండోసారి!
[ 07-12-2023]
దుర్గగుడిలో రూ.216 కోట్లతో అభివృద్ధి పనులను చేపడతామని మళ్లీ హడావుడి మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా నేడు శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. -
మార్గదర్శకాల మేరకు నష్టం అంచనాల రూపకల్పన
[ 07-12-2023]
తీవ్ర తుపాను నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా.. జిల్లాలో పంట నష్టం అంచనాలకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆదేశించారు. -
80 వేల హెక్టార్లలో పంట నష్టం
[ 07-12-2023]
తుపాను కారణంగా జిల్లాలో ప్రాథమిక అంచనాల మేరకు 80 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు కలెక్టర్ రాజబాబు సీఎం జగన్మోహన్రెడ్డికి తెలిపారు. -
నిందితుడితో పరిహారం పంపిణీ
[ 07-12-2023]
తుపాను పునరావాస కేంద్రంలోని బాధితులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నిందితుడితో ప్రభుత్వ పరిహారం పంపిణీ చేయించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
మురుగు కాల్వలనూ వదలని వైకాపా నాయకులు : మండలి
[ 07-12-2023]
డ్రెయిన్ల మరమ్మతుల పేరుతో వైకాపా నాయకులు అవినీతికి పాల్పడ్డారని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని నంగేగడ్డ, మర్రిపాలెం, చోడవరం,... -
చెరువుకి నీటి మళ్లింపుపై వైకాపా వర్గాల కొట్లాట
[ 07-12-2023]
చల్లపల్లి మండలం మంగళాపురానికి చెందిన వైకాపా పీఏసీఎస్ ఛైర్మన్ పేరం నాగిరెడ్డి, సర్పంచి డొక్కు నాగేశ్వరరావుపై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు బుధవారం దాడి చేశారని ఆ పార్టీ చల్లపల్లి మండల అధ్యక్షుడు శీరం వెంకటసత్యనారాయణ(నాని) తెలిపారు. -
రైతుల గుండెలు పగిలాయి
[ 07-12-2023]
మిగ్జాం తుపాను బీభత్సానికి వాటిల్లిన తీవ్ర నష్టంతో అన్నదాతల గుండెలు పగిలాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఓటరు దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కారం
[ 07-12-2023]
ఓటరు జాబితాల సవరణల నేపథ్యంలో ఫారం-6, 7, 8ల కింద ఆన్లైన్, ఆఫ్లైన్లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
దుర్గగుడి అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన రేపు
[ 07-12-2023]
ఈనెల 7న దుర్గగుడి అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేస్తారని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. -
ప్రకాశం బ్యారేజీ గేట్ల ఎత్తివేత
[ 07-12-2023]
తుపాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. -
పెళ్లి పేరుతో యువతి మోసం
[ 07-12-2023]
పెళ్లి చేసుకుంటానని నమ్మించి నగలు, రూ.11లక్షల వరకు వసూలు చేసి.. వైద్యుడిని మోసం చేసిన ముగ్గురిపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యారావుపేటకు చెందిన ఓ వైద్యుడు (40)కి 2019లో వివాహమైంది. -
కూరలో ఉప్పు ఎక్కువైందని భార్యాభర్తల గొడవ
[ 07-12-2023]
పూరి కూరలో ఉప్పు ఎక్కువైందని భార్య మీద భర్త కోప్పడగా... క్షణికావేశంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... -
పెట్టుబడి పేరుతో రూ.1.35 లక్షలకు టోకరా
[ 07-12-2023]
తమ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆకర్షణీయమైన ఆదాయం ఇస్తామంటూ నమ్మించి.. ఒక మహిళ నుంచి రూ.1.35 లక్షల మేర మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. -
రూపాయి పంపమని.. రూ.లక్షలు కొట్టేశాడు
[ 07-12-2023]
ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు ప్రకటన ఇస్తే.. అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి అడ్వాన్స్ పంపించేందుకు గూగుల్పే ద్వారా రూపాయి పంపమని చెప్పి వృద్ధుడి నుంచి రూ.1,85,495లు కొట్టేశాడో సైబర్ నేరగాడు.