సంక్షేమ శాఖలో... అవినీతి గద్దలు..!
విజయవాడ శివారులో ఈనెల 7న రాష్ట్ర స్థాయి సమావేశానికి హాజరైన సంక్షేమ శాఖ అధికారులు ఇద్దరు మాంసాహారం (చికెన్సూప్, చికెన్ బిర్యానీ, చికెన్ స్టాటర్) తినేసి వసతిగృహ వార్డెన్కు బిల్లు కట్టమని ఇచ్చిన ఆదేశాలివి.
పేద పిల్లల కడపు మాడ్చి.. అధికారుల విలాసానికి...
యాచన కంటే హీనంగా ఉందని వార్డెన్ల అసహనం
ఈనాడు, అమరావతి
‘మేము సమావేశానికి వచ్చాం. ఇక్కడ ఒక హోటల్లో భోజనాలు చేశాం. బిల్లు రూ.1845 అయింది. వెంటనే ఫోన్పే చేయండి..!’
విజయవాడ శివారులో ఈనెల 7న రాష్ట్ర స్థాయి సమావేశానికి హాజరైన సంక్షేమ శాఖ అధికారులు ఇద్దరు మాంసాహారం (చికెన్సూప్, చికెన్ బిర్యానీ, చికెన్ స్టాటర్) తినేసి వసతిగృహ వార్డెన్కు బిల్లు కట్టమని ఇచ్చిన ఆదేశాలివి.
- ఆమె సంక్షేమ శాఖలో డివిజను స్థాయి అధికారిణి. శ్రావణమాసం పూజలు ఇంట్లో చేసేందుకు పూలు, ఇతర సామగ్రి కావాలి. మొత్తం కలిపి రూ.2వేలు మించవు. ఓ సంక్షేమ వసతిగృహం అధికారికి అప్పగించారు. అంతే ఆయన తెచ్చి ఇంట్లో ఇచ్చారు.
ప్రతి వసతిగృహం నుంచి నెలకు రూ.5వేలు ఠంచనుగా అందాల్సిందే. లేదంటే తనిఖీలు వేధింపులు, సస్పెన్షన్లు.. ఇదీ ఆ అధికారి తీరు. ఓ జిల్లా స్థాయి, డివిజను స్థాయి అధికారులు కలిసి సంక్షేమశాఖ వసతి గృహ వార్డెన్లను పీడిస్తున్నారు. అసలే అత్తెసరు బడ్జెట్తో విద్యార్థులకు అరకొర భోజనం వడ్డిస్తున్న వార్డెన్లు.. వీరి మామూళ్ల దాహానికి విద్యార్థులకు మరింత కడుపు మాడుస్తున్నారు. గతంలో విద్యార్థుల సంఖ్య కంటే అదనంగా హాజరు చేర్చి మెనూ ఛార్జీలు తీసుకొనేవారు. ఖర్చు చూపించేవారు. ప్రస్తుతం విద్యార్థుల హాజరు ప్రతి రోజూ బయోమెట్రిక్ ద్వారా తీసుకోవాల్సి ఉంది. ఉదయం అల్పాహారం, భోజనం స్నాక్స్ ఇతర మెనూ అంతా బయోమెట్రిక్ హాజరు బట్టి తయారు చేయాల్సి ఉంటుంది. దీంతో గతంలో లాగా వసతిగృహాల అధికారులకు ప్రస్తుతం మిగలడం లేదంటున్నారు. నాలుగో తరగతి లోపు విద్యార్థులకు నెలకు రూ.1150, 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.1400, పోస్టు మెట్రిక్ విద్యార్థులకు రూ.1600 చొప్పున మెనూ ఛార్జీలు అందిస్తున్నారు. రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.38.33, రూ.46.67, రూ.53.33 చొప్పున భోజనానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక భోజనం బయట మార్కెట్లో రూ.100 ఉంటుంది. మినీ భోజనం (ప్లేట్) రూ.80 వరకు ఉంటుంది. కానీ ఈ ఖర్చుతో మూడు పూటలు పెట్టాలి. దీనికి పండ్లు, గుడ్లు, ఇతర చిరుతిళ్లు అదనం. వీటితో వసతిగృహం నిర్వహణ కష్టంగా మారుతోంది. ప్రభుత్వం ఇచ్చే బియ్యం కావడంతో అన్నం బాగోడం లేదు.
జిల్లాలో బీసీ వసతి గృహాలు 43
విద్యార్థులు 1635
ఫిర్యాదు చేస్తారనే బెరుకూ లేదు...
ప్రతి నెలా ఒక వసతిగృహం నుంచి రూ.10వేలు డివిజను స్థాయి అధికారికి ఇవ్వాలని చెబుతున్నారు. జిల్లా స్థాయిలో మరో రూ.5వేలు ఇవ్వాలని వార్డెన్లు చెబుతున్నారు. ఆ ప్రకారం నెలకు రూ.15వేల వరకు వారికే సమర్పించాల్సి ఉంటుంది. ఇవికాకుండా అధికారులు పర్యటనలకు వచ్చిన సమయంలో వారి ఖర్చు, వారి వెంట వచ్చిన వారి ఖర్చు, మర్యాద ఖర్చులు అన్నీ భరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. వాట్సప్ సందేశాలు ఇస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారనే బెరుకు కూడా లేదు. ఇటీవల జిల్లాకు వచ్చిన ఓ అధికారి, ఓ డివిజన్ అధికారిణి ఎక్కడికైనా ఇద్దరూ కలిసే వెళ్తారు. వారి ఖర్చు మొత్తం ఆయా పరిధిలోని వార్డెన్లు భరించాలట. ఈ శాఖలో కృష్ణా జిల్లాలో మొత్తం 43 వసతిగృహాలు ఉన్నాయి. ఒక నెలకు వసూలు రూ.6.5లక్షల వరకు ఉంటుంది. ఇతర మర్యాద ఖర్చులు కాకుండా ఇవి డివిజన్, జిల్లా స్థాయి అధికారులకు నెలనెలా సమర్పించే మామూళ్లు. ఎన్టీఆర్ జిల్లాలో 28 వసతిగృహాలు ఉన్నాయి. దాదాపు రూ.4.2లక్షలు మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఇక అధికారుల పర్యటనలే కాదు.. స్థానిక నాయకులు అధికారిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినా, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఏర్పాటు చేసినా వాటి ఖర్చు వీరికి కొంత పడుతుంది.
ఎన్నికల నిర్వహణ సందర్భంగా మండలాల్లో పర్యటించిన సమయంలో ఓ అధికారి వాహనానికి ఇంధన ఖర్చుల కింద ఒక్కో వార్డెన్ నుంచి రూ.2వేల చొప్పున ముక్కుపిండి మరీ వసూలు చేశారు. మామూళ్లు ఇవ్వకపోతే బిల్లుల్లో కొర్రీలు వేసి సకాలంలో మంజూరు చేయడం లేదు. ఆ అధికారికి మెజిస్ట్రేట్ హోదా లేకపోయినా.. సైరన్ మోగిస్తూ.. తన వాహనంతో తనిఖీకి మండల కార్యాలయాలకు వెళ్తుంటారు. వీరికి కొంత మంది ప్రజాప్రతినిధుల మద్దతు ఉంది. వారికి మర్యాద పేరుతో వార్డెన్లపైనే పడుతున్నారు.
లోటు పూడ్చుకునేందుకు అడ్డదారులు...
జిల్లా స్థాయిలో కాంట్రాక్టరు ద్వారా వచ్చే కొబ్బరి నూనె, ఇతర కాస్మోటిక్స్ పక్కదారి పడుతున్నాయి. లేదా వసతిగృహం స్థాయిలో కొనుగోలు చేసే వాటిలో కోత వేస్తున్నారు. ప్రతి విద్యార్థికి కాస్మొటిక్స్ కింద నెలకు రూ.150 నుంచి రూ.250 వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి సక్రమంగా పంపిణీ చేయడం లేదు. ఇక హెయిర్ కటింగ్ ఛార్జీలు అసలే ఇవ్వరు. విద్యార్థులు ఇళ్లకు వెళ్లినప్పుడే చేయించుకుంటారు. ఓ జిల్లాలోని ఇద్దరు అధికారుల తీరు మరీ యాచకుల తరహాలో ఉందని, ఒక్క రోజు ఆలస్యమైనా ఫోన్ చేస్తున్నారని ఓ వార్డెన్ అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల కడుపు మాడ్చి ఈ అవినీతి గద్దలకు పెట్టాల్సి వస్తోందని పలవురు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కట్టలేరు
[ 06-12-2023]
తుపాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. -
Vijayawada: నేడూ విజయవాడ డివిజన్లో రైళ్ల రద్దు
[ 06-12-2023]
తుపాను తీరం దాటడంతో రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది. డివిజన్ పరిధిలోని ఆయా స్టేషన్లలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు సమాచారం అందిస్తున్నారు. -
కల్లాలను కమ్మేసి.. కష్టాల్లో నెట్టేసి
[ 06-12-2023]
ధాన్యం రాశులు తడిసి కొందరు.. కోసిన వరి పనలు తడిసి మరికొందరు.. నేలకొరిగిన వరి చేలు చూసి కన్నీరు మున్నీరవుతున్న కర్షకులు ఎందరో... ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు. -
మిగ్జాం... బీభత్సం
[ 06-12-2023]
కుండపోత వర్షం.. వణికించిన ఈదురుగాలులు.. నేలకూలిన చెట్లు.. ధ్వంసమైన దారులు.. కూలిన గుడిసెలు.. ఎడతెరిపి లేని ముసురుతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు పంటలకు అపార నష్టం సంభవించింది. -
అన్నదాతపై మిగ్జాం పంజా
[ 06-12-2023]
మిగ్ జాం తుపాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వీస్తున్న ఈదురు గాలుల వల్ల జిల్లాలో జనజీవనం స్తంభించింది. పలు చోట్ల విద్యుత్తు స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరగడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
తీపి పంచేనా?
[ 06-12-2023]
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏకైక ఉయ్యూరు కేసీపీ చక్కెర కర్మాగారంలో 2023-24 క్రషింగ్ సీజన్ ఈ నెల 6వ తేదీన ప్రారంభం కానుంది. గత నాలుగైదేళ్లుగా సాగు పెంచేందుకు కేసీపీ వ్యవసాయ విభాగం, యాజమాన్యం ఎంత ప్రయత్నించినా ఆశించిన ఫలితం కనపడలేదు -
ప్రయాణికులు లేక బస్సులు రద్దు
[ 06-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల ప్రభావం ఆర్టీసీ సర్వీసులపై పడింది. వాతావరణం అనుకూలంగా లేక చాలా మంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. -
తడిసి ముద్దయిన నగరం..
[ 06-12-2023]
జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారులు జలమయంకావడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. సాధారణ ప్రజలు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
దారులు కాదు.. దారుణాలే
[ 06-12-2023]
విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి జక్కంపూడి మీదుగా మైలవరం వెళ్లేదారి మధ్యలో గుంతలు కనిపిస్తున్నాయి. వర్షాలు పడుతుండటంతో.. తారుపోయి గుంతలు ఏర్పడ్డాయి. -
కనీస వేతనాల కరవు.. అభద్రతాభావం..
[ 06-12-2023]
విజయవాడ గాంధీనగర్లోని జింఖానా మైదానంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న పొరుగు సేవల ఉద్యోగుల రాష్ట్ర స్థాయి ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అసోసియేట్ ఛైర్మన్ టి.వి.ఫణి పేర్రాజు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సంఘ నాయకులు పిలుపునిచ్చారు. -
రైల్వేకు ప్రతిష్ఠాత్మక అవార్డులు
[ 06-12-2023]
విజయవాడ డివిజన్కు అవార్డుల పంట పండింది. అధికారులు, సిబ్బంది కృషి కారణంగా ఈ ఏడాది వివిధ విభాగాల్లో ప్రతిష్ఠాత్మకమైన జీఎం ఎఫిషియన్సీ షీల్డులు కైవసం చేసుకుంది. -
సహాయ చర్యలకు కలెక్టర్ ఆదేశం
[ 06-12-2023]
తుపాను నేపథ్యంలో కలెక్టర్ ఎస్.డిల్లీరావు మంగళవారం నగర, పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. సహాయక చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
నేడూ పాఠశాలలు.. కళాశాలలకు సెలవు
[ 06-12-2023]
తుపాను నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ బుధవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించినట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
అపరాల విత్తనాలను ఉచితంగా ఇవ్వాలి: మండలి
[ 06-12-2023]
రైతులు రెండో పంటగా వేసేందుకు మినుము, మొక్క జొన్న, పెసర విత్తనాలను ఉచితంగా ప్రభుత్వం అందించాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కోరారు. -
పంట నష్టం లెక్కింపులో జాప్యం వద్దు
[ 06-12-2023]
తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు డిమాండ్ చేశారు. -
నేర వార్తలు
[ 06-12-2023]
ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన వైద్యుడు అతని కుటుంబం వేధించడం వల్ల, మరో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన కుమార్తె చనిపోయిందని తండ్రి ఎస్పీ పి.జాషువాను ఆశ్రయించడంతో మంగళవారం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా డీఎస్పీ పి.శ్రీకాంత్ దర్యాప్తు... -
దేశంలో 12 అత్యంత తీవ్రమైన తుపానులు
[ 06-12-2023]
బంగాళాఖాతంలో ఇంతవరకు అత్యంత తీవ్రమైన తుపాన్లు 12 ఏర్పడ్డాయి. వాటిలో 3 అత్యంత ప్రభావమైనవి మచిలీపట్నం, సమీపాల వద్ద తీరాన్ని దాట¨ జన నష్టంతోపాటు, పశు, పంట నష్టాలను మిగిల్చి కొన్ని ఊళ్ల రూపురేఖలను కనుమరుగు చేశాయి. -
పునరావాస కేంద్రాలకు 4,300 మంది
[ 06-12-2023]
తుపాను ప్రభావిత ఏడు మండలాల పరిధిలోని 249 గ్రామాల నుంచి మంగళవారానికి 4,300 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. నాగాయలంక మండలంలో 19, కోడూరు 6, మచిలీపట్నం 25, కృత్తివెన్ను 5, అవనిగడ్డ 4, మోపిదేవి 3, బంటుమిల్లి 4, చల్లపల్లిలో 4 చొప్పున పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. -
తుపానుతో మినుముకూ నష్టమే
[ 06-12-2023]
తుపానుతో రైతులు మినుము పంటనూ కోల్పోయే పరిస్థితి నెలకొంది. యంత్రాలతో వరి కోసిన రైతులు దమ్ము చేసి మినుము విత్తనాలు చల్లారు. అవి చాలా చోట్ల మొక్కలుగా ఎదిగాయి. -
రైతులను ఉదారంగా ఆదుకోవాలి
[ 06-12-2023]
తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పంటపై రూ.వేలు పెట్టుబడి పెట్టారని, వారికి సహాయం అందించి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
New sim card Rule: జనవరి 1 నుంచి సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్
-
Senthil remarks: ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్పై మండిపడ్డ భాజపా
-
రేవంత్ సీఎం అని ముందే ఎలా చెప్పారు?.. తనదైన శైలిలో ఆన్సర్ చెప్పిన బండ్ల గణేశ్
-
Biden-Trump: అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకపోతే.. నేనూ చేయనేమో: బైడెన్
-
Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీని ఇష్టపడటానికి కారణమదే: బ్రెండన్ మెక్కల్లమ్
-
TDP-Janasena: తెదేపా అధినేత చంద్రబాబుతో పవన్కల్యాణ్ భేటీ