శ్రేణులు ఒక్కటై.. పోరాట యోధులై...
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెదేపా శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాల్లో నిరసనలు ఉద్ధృతంగా జరుగుతున్నాయి.
చంద్రబాబు అరెస్టుపై నిరసనలు ఉద్ధృతం
మోపిదేవి: పెదకళ్లేపల్లిలో మండలి వెంకట్రామ్ ఆధ్వర్యంలో తెదేపా, జనసేన నాయకుల కొవ్వొత్తుల ప్రదర్శన
ఈనాడు, అమరావతి: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెదేపా శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాల్లో నిరసనలు ఉద్ధృతంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ శాంతియుతంగా దీక్షలు చేపట్టి.. అనంతరం. కొవ్వొత్తుల ర్యాలీలు, కాగడాల ప్రదర్శనలతో తమ నిరసన తెలియజేస్తున్నారు. తెదేపా ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు, సామాన్య ప్రజలు సైతం అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ శిబిరాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. తెదేపా బీసీ, రైతు విభాగాల ఆధ్వర్యంలో బుధవారం పలు నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యేదాకా పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
- మచిలీపట్నం తెదేపా కార్యాలయంలో బీసీ, రైతు విభాగాల ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరంలో మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ పాల్గొని సంఘీభావం తెలిపారు.
- గన్నవరం తెదేపా కార్యాలయం ఆవరణలో చేపడుతున్న నిరాహార దీక్ష శిబిరంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.
- గుడివాడలో తెదేపా ఇన్ఛార్జి రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎనిమిదో రోజు దీక్షలు కొనసాగాయి. పట్టణ తెదేపా అధ్యక్షుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
- పామర్రు నియోజకవర్గలోని కూచిపూడి సెంటర్లో నిర్వహించిన నిరసన దీక్షలో పార్టీ ఇన్ఛార్జి వర్ల కుమార్రాజా పాల్గొన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వచ్చి సంఘీభావం తెలిపారు.
- అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. తెదేపా, జనసేన నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
- పెనమలూరు పార్టీ కార్యాలయంలో బీసీ విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్జంక్షన్: మూల్పూరి కల్యాణి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన
పామర్రు గ్రామీణం: కొమరవోలులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు
మచిలీపట్నం: నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్న కొల్లు రవీంద్ర
గుడివాడ: రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న తెదేపా బీసీ నేతలు
మచిలీపట్నం: తెదేపా నియోజకవర్గ కార్యాలయం వద్ద దీక్షలో బూరగడ్డ వేదవ్యాస్, బాబాప్రసాద్ తదితరులు
పోరంకి: బీసీల రిలే దీక్షలో పోస్టుకార్డులు ప్రదర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, తెదేపా నేతలు
పెడన: చంద్రబాబు విడుదల కావాలని కొబ్బరికాయలు కొట్టిన కాగిత కృష్ణప్రసాద్, నాయకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Chandrababu: దుర్గమ్మ సేవలో చంద్రబాబు దంపతులు
[ 02-12-2023]
విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మను తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) దర్శించుకున్నారు. -
Vijayawada: మూడు మిషన్ల ముచ్చట.. నెట్ లేదు ఇచ్చట...
[ 02-12-2023]
విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో షిఫ్ట్ మారే సమయంలో హాజరు నమోదు కోసం సిబ్బంది నిత్యం ఇలా తిప్పలు పడాల్సి వస్తోంది. వేలిముద్ర ద్వారా తమ హాజరు నమోదు చేసేందుకు సిబ్బంది కిక్కిరిసి పోటెత్తుతున్నారు. -
Chandrababu: చల్లని చంద్రయ్యా.. మా ప్రేమ చూడయ్యా..
[ 02-12-2023]
‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి..!’ ‘గన్నవరం గడ్డా.. యార్లగడ్డ అడ్డా..!’ ‘జై చంద్రబాబు.. జైజై తెలుగుదేశం..’ నినాదాలు మార్మోగాయి. కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. జనసేన కార్యకర్తల ఆవేశం కలగలిసింది. -
స్తంభించిన రిజిస్ట్రేషన్లు
[ 02-12-2023]
ఆయన ఓ ప్రముఖ వ్యాపారి. నగరంలో అత్యంత విలువైన స్థలం కొన్నారు. శుక్రవారం పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. -
30 వేల మంది యువతను కొత్త ఓటర్లుగా చేరుస్తాం
[ 02-12-2023]
మచిలీపట్నం ఓటర్ల జాబితాపై హైకోర్టులో వేసిన పిల్కు సంబంధించి సానుకూల చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ రాజబాబు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనాకు తెలిపారు. -
అక్రమానికి సక్రమ ముద్ర వేసేందుకేనా?!
[ 02-12-2023]
2021 ఫిబ్రవరి 18న విజయవాడ దుర్గగుడిలో అనిశా (అవినీతి నిరోధక శాఖ) అధికారులు దాడులు నిర్వహించి అనేక అక్రమాలను గుర్తించారు. వీటిపై సమగ్ర నివేదికను అప్పుడే రూపొందించి దేవాదాయశాఖ కమిషనర్... ప్రభుత్వానికి అందజేశారు. -
బాలల ఆలోచనలు... విజ్ఞాన పరిమళాలు
[ 02-12-2023]
చిట్టి బుర్రల్లోని చక్కటి ఆలోచనలు ప్రశంసలందుకున్నాయి. రాష్ట్ర స్థాయి పోటీల్లో మేటిగా నిలిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. ఆరో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని... -
ఏలూరు కాలువ కట్టేశారు
[ 02-12-2023]
ఖరీఫ్ సీజన్ ఇంకా పూర్తిగా ముగియకముందే సాగునీటి సరఫరాను నిలిపివేశారు. జలశయాలు పూర్తిగా అడుగంటాయని, పట్టిసీమ, పులిచింతల నుంచి చుక్క నీరు కూడా రావట్లేదని, అందుకే ప్రవాహం నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు. -
రేపు జాతీయ ఉపకార వేతన పరీక్ష
[ 02-12-2023]
జాతీయ మీన్స్ కం మెరిట్ ఉపకార వేతనాల అర్హత పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా జరగనుంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ, ప్రభుత్వ పరీక్షల విభాగం సంయుక్త నిర్వహణలో తగిన ఏర్పాట్లు చేశారు. -
కష్టాల సేద్యం
[ 02-12-2023]
వాతావరణ మార్పులతో రైతులు వరి పంట కాపాడుకునేందుకు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే నూర్పిడి చేసిన ధాన్యాన్ని విక్రయించేందుకు అవస్థలు పడుతున్నారు. కోతలు ప్రారంభమైన నుంచే వాతావరణంలో మార్పులతో కల్లాల్లోనే ధాన్యం నిల్వ ఉంచాల్సిన పరిస్థితి. -
అన్నదాతకు వాయు‘గండం’
[ 02-12-2023]
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో అన్నదాత వెన్నులో మరోమారు వణుకు మొదలైంది. ఆదివారానికి ఇది తుపానుగా మారి ఈదురుగాలులతోపాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ ప్రకటనలతో వరి పండించిన రైతులు భయాందోళన చెందుతున్నారు. -
వేతనాలు రాక విధులకు డుమ్మా
[ 02-12-2023]
మేజర్ పంచాయతీ పెదప్రోలులో తాగునీటి సరఫరా నిలిచింది. ఒప్పంద కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఈ దుస్థితికి దారితీసింది. ఈ ఏడాది మార్చిలో తాగునీట¨ సరఫరా, మరమ్మతులు తదితర పనుల కోసం టెండర్లు పిలిచారు. -
సగం మందికే కందిపప్పు
[ 02-12-2023]
ప్రభుత్వం ఏడు నెలలుగా రేషన్ కార్డులకు కంది పప్పు పంపిణీ చేయడం లేదు. ఈ నెలలో సగం కార్డుదారులకే కంది పప్పు ప్యాకెట్లు సరఫరా చేసింది. దీపావళి, దసరా, వినాయక చవితి పండగలకు ఇవ్వలేదు. -
Andhra News: తెదేపా అధినేత చంద్రబాబు, మంత్రి రోజా ఒకే విమానంలో..
[ 02-12-2023]
తెదేపా అధినేత చంద్రబాబు రాకతో పార్టీ శ్రేణులతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాలు శుక్రవారం సందడిగా మారిన సంగతి తెలిసిందే. తిరుపతి నుంచి చంద్రబాబు చేరుకున్న ఇండిగో విమానంలోనే మంత్రి రోజా కూడా వచ్చారు. -
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
[ 02-12-2023]
గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లోని గ్రామాలకు 8 వాటర్ ట్యాంకర్లు ఇచ్చే కార్యక్రమం విజయవాడలోని కేశినేని భవన్ వద్ద శుక్రవారం నిర్వహించారు. -
అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్వో
[ 02-12-2023]
ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి జి.గీతాబాయి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా నగరంలోని డీఎంహెచ్వో కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
వివాహితను వేధిస్తున్న వైకాపా నాయకుడిపై కేసు
[ 02-12-2023]
నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరచి వివాహితను లైంగికంగా వేధిస్తున్న వైకాపా నాయకుడిపై కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసులు కేసు నమోదుచేశారు. పోలీసుల కథనం ప్రకారం.. -
సచివాలయ ఉద్యోగిపై అధికార పార్టీ నేత దాడి
[ 02-12-2023]
సచివాలయ ఉద్యోగిపై వైకాపా నాయకుడు దాడికి పాల్పడిన ఘటన కృష్ణాజిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ సచివాలయంలో పి.కల్యాణ్కుమార్ వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. -
బేవరేజెస్ ఎండీ అవినీతిపై విచారణ చేయాలి
[ 02-12-2023]
ఏపీ బేవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డి అవినీతిపై న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నేడు, రేపు ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలు
[ 02-12-2023]
ఈనెల 2, 3 తేదీల్లో (శని, ఆదివారాల్లో) జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్లలో ఓటరు నమోదు, జాబితాల సవరణ, మార్పులు, చేర్పుల నిమిత్తం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఒక ఓటరు.. రెండుచోట్ల ఓట్లు
[ 02-12-2023]
ఎన్నికల సంఘం ఒకరికి ఒక ఓటు హక్కు మాత్రమే కల్పిస్తుంది. అందుకు విరుద్ధంగా కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి కొంత మంది ఓటర్లకు రెండు, మూడు ఓట్లు కల్పించారు. ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తికి వేరు వేరు గ్రామాల్లో, వేరు వేరు బూత్లో ఓట్లు ఉండడం సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యానికి దర్పణం పడుతోంది. -
తుపానుకు ముందస్తు చర్యలు చేపట్టాలి
[ 02-12-2023]
తుపాను కారణంగా జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.రాజబాబు అధికారులను ఆదేశించారు. -
‘తెదేపా విజయం తథ్యం’
[ 02-12-2023]
రానున్న ఎన్నికల్లో తెదేపా ఘన విజయం సాధిస్తుందని పామర్రు తెదేపా ఇన్ఛార్జి వర్ల కుమార్రాజా ధీమా వ్యక్తం చేశారు. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గురువిందగుంటలో ప్రచారం చేశారు. -
కదులుతున్న డొంక
[ 02-12-2023]
చల్లపల్లి కేంద్రంగా నడుస్తున్న సింగిల్ నంబర్ లాటరీ డొంక కదులుతోంది. పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈ జూదక్రీడ యథేచ్ఛగా కొనసాగుతోంది. రూపాయికి రూ.60 చెల్లిస్తామంటూ ఆశ చూపి ఒక నంబరు ఇచ్చి 99 నంబర్లను నిర్వాహకులు దోచుకుంటున్నారు. -
వైకాపా అక్రమంగా గెలవాలని చూస్తోంది: బొండా
[ 02-12-2023]
ఓటమి భయంతోనే వైకాపా అక్రమంగా గెలవాలని చూస్తోందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
నేర వార్తలు
[ 02-12-2023]
బ్యూటీషియన్ను బెదిరిస్తున్న స్టూడియో యజమానిపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.వారు తెలిపిన వివరాల ప్రకారం.. పెనమలూరుకు చెందిన మహిళ బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Rohit - Hardik: రోహిత్-హార్దిక్ విషయంలో సెలక్టర్లకు కఠిన సవాల్ తప్పదు: నెహ్రా
-
Honda Recall: హోండా మోటార్ సైకిళ్ల రీకాల్.. కారణం ఇదే!
-
Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. హీరోయిన్గా ఎవరంటే..?
-
Nagarjuna Sagar: సాగర్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Payyavula Keshav: ఫారం-7 గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదు: పయ్యావుల