ఉద్యోగాలు క్రమబద్ధీకరించకపోతే నిరవధిక సమ్మె
ఉద్యోగాలను పర్మినెంట్ చేయకపోతే నిరవధిక సమ్మెకు మున్సిపల్ కార్మికులు సిద్ధపడతారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ కె.ధనలక్ష్మి హెచ్చరించారు.
రెండో రోజు రిలే నిరాహార దీక్షలో కె.ధనలక్ష్మి, మున్సిపల్ కార్మికులు, తదితరులు
విజయవాడ(అలంకార్కూడలి), న్యూస్టుడే : ఉద్యోగాలను పర్మినెంట్ చేయకపోతే నిరవధిక సమ్మెకు మున్సిపల్ కార్మికులు సిద్ధపడతారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ కె.ధనలక్ష్మి హెచ్చరించారు. శుక్రవారం విజయవాడ ధర్నాచౌక్లో మున్సిపల్ కార్మికుల రెండో రోజు రిలే నిరాహర దీక్షలను ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని ప్రతిపక్ష నేత హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించారన్నారు. అధికారం చేపట్టాక నాటి హామీలను విస్మరించారని గుర్తు చేశారు. మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కమిటీ నాయకులు టి.తిరుపతమ్మ, గార్లపాటి లక్ష్మి, ఏ.జాన్బాబు, చంద్రకళ, కె.వెంగమ్మ, సరళ, జె.విజయలక్ష్మి, రాజు, బాలరాజు, వరమ్మ, సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
[ 02-12-2023]
గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లోని గ్రామాలకు 8 వాటర్ ట్యాంకర్లు ఇచ్చే కార్యక్రమం విజయవాడలోని కేశినేని భవన్ వద్ద శుక్రవారం నిర్వహించారు. -
అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్వో
[ 02-12-2023]
ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి జి.గీతాబాయి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా నగరంలోని డీఎంహెచ్వో కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
వివాహితను వేధిస్తున్న వైకాపా నాయకుడిపై కేసు
[ 02-12-2023]
నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరచి వివాహితను లైంగికంగా వేధిస్తున్న వైకాపా నాయకుడిపై కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసులు కేసు నమోదుచేశారు. పోలీసుల కథనం ప్రకారం.. -
సచివాలయ ఉద్యోగిపై అధికార పార్టీ నేత దాడి
[ 02-12-2023]
సచివాలయ ఉద్యోగిపై వైకాపా నాయకుడు దాడికి పాల్పడిన ఘటన కృష్ణాజిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ సచివాలయంలో పి.కల్యాణ్కుమార్ వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక లాంజ్ నుంచి వెళ్లిన మంత్రి రోజా
[ 02-12-2023]
తెదేపా అధినేత చంద్రబాబు రాకతో పార్టీ శ్రేణులతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాలు శుక్రవారం సందడిగా మారిన సంగతి తెలిసిందే. తిరుపతి నుంచి చంద్రబాబు చేరుకున్న ఇండిగో విమానంలోనే మంత్రి రోజా కూడా వచ్చారు. -
బేవరేజెస్ ఎండీ అవినీతిపై విచారణ చేయాలి
[ 02-12-2023]
ఏపీ బేవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డి అవినీతిపై న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నేడు, రేపు ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలు
[ 02-12-2023]
ఈనెల 2, 3 తేదీల్లో (శని, ఆదివారాల్లో) జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్లలో ఓటరు నమోదు, జాబితాల సవరణ, మార్పులు, చేర్పుల నిమిత్తం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఒక ఓటరు.. రెండుచోట్ల ఓట్లు
[ 02-12-2023]
ఎన్నికల సంఘం ఒకరికి ఒక ఓటు హక్కు మాత్రమే కల్పిస్తుంది. అందుకు విరుద్ధంగా కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి కొంత మంది ఓటర్లకు రెండు, మూడు ఓట్లు కల్పించారు. ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తికి వేరు వేరు గ్రామాల్లో, వేరు వేరు బూత్లో ఓట్లు ఉండడం సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యానికి దర్పణం పడుతోంది. -
తుపానుకు ముందస్తు చర్యలు చేపట్టాలి
[ 02-12-2023]
తుపాను కారణంగా జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.రాజబాబు అధికారులను ఆదేశించారు. -
‘తెదేపా విజయం తథ్యం’
[ 02-12-2023]
రానున్న ఎన్నికల్లో తెదేపా ఘన విజయం సాధిస్తుందని పామర్రు తెదేపా ఇన్ఛార్జి వర్ల కుమార్రాజా ధీమా వ్యక్తం చేశారు. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గురువిందగుంటలో ప్రచారం చేశారు. -
కదులుతున్న డొంక
[ 02-12-2023]
చల్లపల్లి కేంద్రంగా నడుస్తున్న సింగిల్ నంబర్ లాటరీ డొంక కదులుతోంది. పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈ జూదక్రీడ యథేచ్ఛగా కొనసాగుతోంది. రూపాయికి రూ.60 చెల్లిస్తామంటూ ఆశ చూపి ఒక నంబరు ఇచ్చి 99 నంబర్లను నిర్వాహకులు దోచుకుంటున్నారు. -
వైకాపా అక్రమంగా గెలవాలని చూస్తోంది: బొండా
[ 02-12-2023]
ఓటమి భయంతోనే వైకాపా అక్రమంగా గెలవాలని చూస్తోందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
నేర వార్తలు
[ 02-12-2023]
బ్యూటీషియన్ను బెదిరిస్తున్న స్టూడియో యజమానిపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.వారు తెలిపిన వివరాల ప్రకారం.. పెనమలూరుకు చెందిన మహిళ బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్నారు.