వైద్య బిల్లుల రీయంబర్స్మెంట్ అక్రమాల్లో.. కదిలిన డొంక..?
వైద్య బిల్లుల రీయంబర్స్మెంట్ పేరుతో రూ.లక్షల్లో స్వాహా చేసిన సంఘటనలో ఏడుగురు అధికారులపై కూచిపూడి పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఏడుగురు అధికారులపై పోలీసులకు ఫిర్యాదు
కూచిపూడి, న్యూస్టుడే: వైద్య బిల్లుల రీయంబర్స్మెంట్ పేరుతో రూ.లక్షల్లో స్వాహా చేసిన సంఘటనలో ఏడుగురు అధికారులపై కూచిపూడి పోలీసులకు ఫిర్యాదు అందింది. చల్లపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యోగ విరమణ చేసిన పంచాయతీరాజ్ ఏఈ ఎస్.పోతురాజు మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లుల కింద నకిలీ మంజూరు పత్రాలను ఉపయోగించి మొవ్వ సబ్ ట్రెజరీ కార్యాలయం నుంచి రూ.41.86 లక్షలు స్వాహా చేశారు. ఈ మేరకు రూ.5 లక్షలు పైబడి అయిదు బిల్లులు ఉపయోగించి రూ.32.90 లక్షలు, రూ.2 లక్షలలోపు వంతున 9 బిల్లుల కింద రూ.8.96 లక్షలు డ్రా చేశారు. ఈ విషయం ఆలశ్యంగా గుర్తించిన జిల్లా ట్రెజరీ అధికారి రవికుమార్ దీనిపై పూర్తి సమాచారం ఇవ్వాలని చల్లపల్లి ఎంపీడీవోను కోరారు. విషయం బయట పడడంతో అధికారుల సంప్రదింపుల అనంతరం సొమ్ము స్వాహా చేసిన విశ్రాంత ఏఈ ప్రభుత్వ ఖజానాకు దశలవారీగా తిరిగి రూ.23 లక్షలు జమ చేశారు. అనంతరం జిల్లా ట్రెజరీ సహాయ అధికారిణి, అకౌంట్స్ అధికారిణి అయిన ఎం.వి.పి.శ్రీదేవిని తనిఖీ అధికారిగా నియమించారు. నకిలీ మంజూరు పత్రాలతో ప్రభుత్వ నగదు దుర్వినియోగమైందని, అందుకు కారకులైన ఏడుగురు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె కూచిపూడి ఎస్ఐ సందీప్కు ఈ నెల 20న ఫిర్యాదు చేశారు. చల్లపల్లి ఎంపీడీవో కార్యాలయంలో పీఆర్ ఏఈగా ఉద్యోగ విరమణ చేసిన ఎస్.పోతురాజుతోపాటు చల్లపల్లి ఎంపీడీవో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ వై.శ్యామ్సన్బాబు, ఇన్ఛార్జి ఎంపీడీవోలుగా పని చేసిన కె.వి.సుబ్బారావు, ఎ.అరుణకుమారి, ఎంపీడీవో సీహెచ్.చినరత్నాలు, మొవ్వ సబ్ట్రెజరీ అధికారి టి.శ్రీనివాసరావు, జూనియర్ అకౌంటెంట్ బి.ప్రవీణ్పై పోలీసులకు ఫిర్యాదు అందింది. జిల్లా ట్రెజరీ సహాయ అధికారిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కూచిపూడి ఎస్ఐ సందీప్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నదాతకు వాయు‘గండం’
[ 02-12-2023]
-
వేతనాలు రాక విధులకు డుమ్మా
[ 02-12-2023]
మేజర్ పంచాయతీ పెదప్రోలులో తాగునీటి సరఫరా నిలిచింది. ఒప్పంద కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఈ దుస్థితికి దారితీసింది. ఈ ఏడాది మార్చిలో తాగునీట¨ సరఫరా, మరమ్మతులు తదితర పనుల కోసం టెండర్లు పిలిచారు. -
సగం మందికే కందిపప్పు
[ 02-12-2023]
ప్రభుత్వం ఏడు నెలలుగా రేషన్ కార్డులకు కంది పప్పు పంపిణీ చేయడం లేదు. ఈ నెలలో సగం కార్డుదారులకే కంది పప్పు ప్యాకెట్లు సరఫరా చేసింది. దీపావళి, దసరా, వినాయక చవితి పండగలకు ఇవ్వలేదు. -
Andhra News: తెదేపా అధినేత చంద్రబాబు, మంత్రి రోజా ఓకే విమానంలో..
[ 02-12-2023]
తెదేపా అధినేత చంద్రబాబు రాకతో పార్టీ శ్రేణులతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాలు శుక్రవారం సందడిగా మారిన సంగతి తెలిసిందే. తిరుపతి నుంచి చంద్రబాబు చేరుకున్న ఇండిగో విమానంలోనే మంత్రి రోజా కూడా వచ్చారు. -
మూడు మిషన్ల ముచ్చట.. నెట్ లేదు ఇచ్చట...
[ 02-12-2023]
విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో షిఫ్ట్ మారే సమయంలో హాజరు నమోదు కోసం సిబ్బంది నిత్యం ఇలా తిప్పలు పడాల్సి వస్తోంది. వేలిముద్ర ద్వారా తమ హాజరు నమోదు చేసేందుకు సిబ్బంది కిక్కిరిసి పోటెత్తుతున్నారు. -
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
[ 02-12-2023]
గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లోని గ్రామాలకు 8 వాటర్ ట్యాంకర్లు ఇచ్చే కార్యక్రమం విజయవాడలోని కేశినేని భవన్ వద్ద శుక్రవారం నిర్వహించారు. -
అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్వో
[ 02-12-2023]
ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి జి.గీతాబాయి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా నగరంలోని డీఎంహెచ్వో కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
వివాహితను వేధిస్తున్న వైకాపా నాయకుడిపై కేసు
[ 02-12-2023]
నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరచి వివాహితను లైంగికంగా వేధిస్తున్న వైకాపా నాయకుడిపై కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసులు కేసు నమోదుచేశారు. పోలీసుల కథనం ప్రకారం.. -
సచివాలయ ఉద్యోగిపై అధికార పార్టీ నేత దాడి
[ 02-12-2023]
సచివాలయ ఉద్యోగిపై వైకాపా నాయకుడు దాడికి పాల్పడిన ఘటన కృష్ణాజిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ సచివాలయంలో పి.కల్యాణ్కుమార్ వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. -
బేవరేజెస్ ఎండీ అవినీతిపై విచారణ చేయాలి
[ 02-12-2023]
ఏపీ బేవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డి అవినీతిపై న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నేడు, రేపు ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలు
[ 02-12-2023]
ఈనెల 2, 3 తేదీల్లో (శని, ఆదివారాల్లో) జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్లలో ఓటరు నమోదు, జాబితాల సవరణ, మార్పులు, చేర్పుల నిమిత్తం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఒక ఓటరు.. రెండుచోట్ల ఓట్లు
[ 02-12-2023]
ఎన్నికల సంఘం ఒకరికి ఒక ఓటు హక్కు మాత్రమే కల్పిస్తుంది. అందుకు విరుద్ధంగా కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి కొంత మంది ఓటర్లకు రెండు, మూడు ఓట్లు కల్పించారు. ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తికి వేరు వేరు గ్రామాల్లో, వేరు వేరు బూత్లో ఓట్లు ఉండడం సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యానికి దర్పణం పడుతోంది. -
తుపానుకు ముందస్తు చర్యలు చేపట్టాలి
[ 02-12-2023]
తుపాను కారణంగా జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.రాజబాబు అధికారులను ఆదేశించారు. -
‘తెదేపా విజయం తథ్యం’
[ 02-12-2023]
రానున్న ఎన్నికల్లో తెదేపా ఘన విజయం సాధిస్తుందని పామర్రు తెదేపా ఇన్ఛార్జి వర్ల కుమార్రాజా ధీమా వ్యక్తం చేశారు. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గురువిందగుంటలో ప్రచారం చేశారు. -
కదులుతున్న డొంక
[ 02-12-2023]
చల్లపల్లి కేంద్రంగా నడుస్తున్న సింగిల్ నంబర్ లాటరీ డొంక కదులుతోంది. పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈ జూదక్రీడ యథేచ్ఛగా కొనసాగుతోంది. రూపాయికి రూ.60 చెల్లిస్తామంటూ ఆశ చూపి ఒక నంబరు ఇచ్చి 99 నంబర్లను నిర్వాహకులు దోచుకుంటున్నారు. -
వైకాపా అక్రమంగా గెలవాలని చూస్తోంది: బొండా
[ 02-12-2023]
ఓటమి భయంతోనే వైకాపా అక్రమంగా గెలవాలని చూస్తోందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
నేర వార్తలు
[ 02-12-2023]
బ్యూటీషియన్ను బెదిరిస్తున్న స్టూడియో యజమానిపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.వారు తెలిపిన వివరాల ప్రకారం.. పెనమలూరుకు చెందిన మహిళ బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్నారు.