ఆంక్షలకు వెరవక.. ఆకాంక్షన విడవక
తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆందోళనలు హోరెత్తుతున్నాయి. వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు.
బాబుకు అండగా తెలుగు తమ్ముళ్ల దీక్షాపథం
తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆందోళనలు హోరెత్తుతున్నాయి. వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు. రిలే దీక్షలతోపాటు... పలువురు నేతలు బుధవారం నిరవధిక దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. శాంతియుత నిరసనలు చేపడుతున్నా.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తెదేపా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రిలేదీక్షలు, జలదీక్షలు, కాగడాల ప్రదర్శనలు విస్తృతంగా నిర్వహించారు. మహనీయుల విగ్రహాలకూ వినతి పత్రాలు అందజేశారు. సైకో పోవాలి... సైకిల్ రావాలని నినదించారు. సీఎం జగన్కు మంచి బుద్ధి ప్రసాదించాలని అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు. అంబేడ్కర్ రాజ్యాంగం అమలు చేయకుండా.. జగన్ తన సొంత ఎజెండాతో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు.
ఈనాడు, అమరావతి - న్యూస్టుడే బృందం
విజయవాడ మధ్య
అజిత్సింగ్నగర్లోని సెంట్రల్ తెదేపా కార్యాలయంలో నాయీ బ్రాహ్మణ సంఘ నాయకులు దీక్షలు చేపట్టారు. బొండా ఉమామహేశ్వరరావు వచ్చి సంఘీభావం తెలిపి ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు.
విజయవాడ తూర్పు
జిల్లా తెదేపా కార్యాలయంలో నిర్వహించిన నిరసనలో జడ్పీ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ జగన్ అప్రజాస్వామిక పాలన చేస్తున్నారని ఆరోపించారు.
నందిగామ
తెదేపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. చందర్లపాడులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
పెనమలూరు
పోరంకి తెదేపా కార్యాలయంలో శిరోముండనం చేయించుకొని దీక్షలో పాల్గొన్న తెదేపా ఎస్సీ నేతలు బొంగరాల అబ్రహం, ఈడ్పుగంటి హజరయ్య. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు.
విజయవాడ
ముఖ్యమంత్రి జగన్.. అంబేడ్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని, అతనికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ తెదేపా కార్పొరేటర్లు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి విన్నవించారు.
కొండపల్లి
బాబు బాగుండాలని కోరుతూ... విజయవాడలోని దుర్గమ్మకు పూజలు, గుణదల మేరీమాత సన్నిధిలో ప్రార్థనలు చేసేందుకు బయలుదేరిన తెదేపా కొండపల్లి పట్టణ కౌన్సిలర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా స్టేషన్కు వెళ్లి వారిని పరామర్శించారు.
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట తెదేపా కార్యాలయంలో దీక్షల్లో శ్రేణులు.. మహిళలు పాల్గొన్నారు. అరాచక, విధ్వంస పాలన చేస్తున్న ముఖ్యమంత్రిని రానున్న ఎన్నికల్లో గద్దె దించాలని పిలుపునిచ్చారు. వీరికి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీరాం తాతయ్య దంపతులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. పెనుగంచిప్రోలు మండలం కొణకంచిలో కొవ్వొత్తుల ప్రదర్శనలో నాయకులు, కార్యకర్తలతో శ్రీరాం తాతయ్య పాల్గొని నిరసన తెలిపారు.
విజయవాడ పశ్చిమ
పాతబస్తీ తెదేపా కార్యాలయంలో రిలే దీక్షలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు సాలంకి రాజు జైన్ తదితరులు సంఘీభావం తెలిపారు.
తిరువూరు
చంద్రబాబు అక్రమ అరెస్టుపై తిరువూరులో తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జి శ్యావల దేవదత్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు పాల్గొన్నారు.
మైలవరం
మైలవరంలో నిర్వహించిన దీక్షా శిబిరంలో తెదేపా, తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. సైకో పోవాలి...సైకిల్ రావాలని నినాదాలు చేశారు. జి.కొండూరు మండలం కోడూరులో తెదేపా శ్రేణులు కొవ్వొత్తులతో ప్రదర్శనగా వెళ్లి నిరసన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికార పాపం.. అన్నదాతకు శాపం!
[ 07-12-2023]
కృష్ణా జిల్లాకు మిగ్జాం అపారనష్టం కలిగించింది. అన్నదాతలు ఆరుగాలం కష్టపడిన శ్రమ వరదనీటి పాలైంది. రూ.కోట్లలో నష్టం వచ్చింది. ప్రకృతి వైపరీత్యాలు కొంత అయితే.. అధికారుల అవినీతి, పాలకుల నిర్లక్ష్యం అన్నదాతల పాలిట శాపంగా మారింది. -
ఒకటోసారీ.. రెండోసారి!
[ 07-12-2023]
దుర్గగుడిలో రూ.216 కోట్లతో అభివృద్ధి పనులను చేపడతామని మళ్లీ హడావుడి మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా నేడు శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. -
మార్గదర్శకాల మేరకు నష్టం అంచనాల రూపకల్పన
[ 07-12-2023]
తీవ్ర తుపాను నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా.. జిల్లాలో పంట నష్టం అంచనాలకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆదేశించారు. -
80 వేల హెక్టార్లలో పంట నష్టం
[ 07-12-2023]
తుపాను కారణంగా జిల్లాలో ప్రాథమిక అంచనాల మేరకు 80 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు కలెక్టర్ రాజబాబు సీఎం జగన్మోహన్రెడ్డికి తెలిపారు. -
నిందితుడితో పరిహారం పంపిణీ
[ 07-12-2023]
తుపాను పునరావాస కేంద్రంలోని బాధితులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నిందితుడితో ప్రభుత్వ పరిహారం పంపిణీ చేయించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
మురుగు కాల్వలనూ వదలని వైకాపా నాయకులు : మండలి
[ 07-12-2023]
డ్రెయిన్ల మరమ్మతుల పేరుతో వైకాపా నాయకులు అవినీతికి పాల్పడ్డారని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని నంగేగడ్డ, మర్రిపాలెం, చోడవరం,... -
చెరువుకి నీటి మళ్లింపుపై వైకాపా వర్గాల కొట్లాట
[ 07-12-2023]
చల్లపల్లి మండలం మంగళాపురానికి చెందిన వైకాపా పీఏసీఎస్ ఛైర్మన్ పేరం నాగిరెడ్డి, సర్పంచి డొక్కు నాగేశ్వరరావుపై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు బుధవారం దాడి చేశారని ఆ పార్టీ చల్లపల్లి మండల అధ్యక్షుడు శీరం వెంకటసత్యనారాయణ(నాని) తెలిపారు. -
రైతుల గుండెలు పగిలాయి
[ 07-12-2023]
మిగ్జాం తుపాను బీభత్సానికి వాటిల్లిన తీవ్ర నష్టంతో అన్నదాతల గుండెలు పగిలాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఓటరు దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కారం
[ 07-12-2023]
ఓటరు జాబితాల సవరణల నేపథ్యంలో ఫారం-6, 7, 8ల కింద ఆన్లైన్, ఆఫ్లైన్లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
దుర్గగుడి అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన నేడు
[ 07-12-2023]
ఈనెల 7న దుర్గగుడి అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేస్తారని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. -
ప్రకాశం బ్యారేజీ గేట్ల ఎత్తివేత
[ 07-12-2023]
తుపాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. -
పెళ్లి పేరుతో యువతి మోసం
[ 07-12-2023]
పెళ్లి చేసుకుంటానని నమ్మించి నగలు, రూ.11లక్షల వరకు వసూలు చేసి.. వైద్యుడిని మోసం చేసిన ముగ్గురిపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యారావుపేటకు చెందిన ఓ వైద్యుడు (40)కి 2019లో వివాహమైంది. -
కూరలో ఉప్పు ఎక్కువైందని భార్యాభర్తల గొడవ
[ 07-12-2023]
పూరి కూరలో ఉప్పు ఎక్కువైందని భార్య మీద భర్త కోప్పడగా... క్షణికావేశంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... -
పెట్టుబడి పేరుతో రూ.1.35 లక్షలకు టోకరా
[ 07-12-2023]
తమ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆకర్షణీయమైన ఆదాయం ఇస్తామంటూ నమ్మించి.. ఒక మహిళ నుంచి రూ.1.35 లక్షల మేర మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. -
రూపాయి పంపమని.. రూ.లక్షలు కొట్టేశాడు
[ 07-12-2023]
ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు ప్రకటన ఇస్తే.. అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి అడ్వాన్స్ పంపించేందుకు గూగుల్పే ద్వారా రూపాయి పంపమని చెప్పి వృద్ధుడి నుంచి రూ.1,85,495లు కొట్టేశాడో సైబర్ నేరగాడు.


తాజా వార్తలు (Latest News)
-
TS Cabinet: ఆరు గ్యారంటీలు, ప్రజా సమస్యలపై చర్చించిన తెలంగాణ కేబినెట్
-
SRH-IPL 2024: రచిన్ కోసం ఎస్ఆర్హెచ్ భారీ మొత్తం పెట్టొచ్చు: ఇర్ఫాన్ పఠాన్
-
ఖతార్లో 8మందికి మరణశిక్ష కేసు.. బాధితులతో భారత రాయబారి భేటీ
-
EC: లోక్సభ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సవరణ: ఈసీ
-
Ghaziabad: అతిథులకు ట్రే తగిలిందని ఘాతుకం..వెయిటర్ను చంపి అడవిలో పడేసి..!
-
Google Gemini: గూగుల్ జెమిని వచ్చేసింది.. ప్రత్యేకతలివే