సుందర దీవి... కానరాదే ఠీవి?
కేరళ తరహా పచ్చని చెట్లు... గోవాను తలపించే సముద్ర తీరం.. ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణంతో ఎటు చూసినా ప్రకృతి కమనీయ దృశ్యాలతో కట్టిపడేస్తూ మూడు వైపులా ఉప్పుటేరు, ఒకవైపు సముద్రంతో ఉన్న ఈ సుందర దీవి ఎక్కడ అనుకుంటున్నారా..
కొబ్బరి చెట్లతో ఆహ్లాదకరంగా...
కేరళ తరహా పచ్చని చెట్లు... గోవాను తలపించే సముద్ర తీరం.. ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణంతో ఎటు చూసినా ప్రకృతి కమనీయ దృశ్యాలతో కట్టిపడేస్తూ మూడు వైపులా ఉప్పుటేరు, ఒకవైపు సముద్రంతో ఉన్న ఈ సుందర దీవి ఎక్కడ అనుకుంటున్నారా.. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలోని చినగొల్లపాలెం దీవి. భీమవరానికి సమీపంలో ఉంది. చుట్టూ సముద్రం ఉన్నా ఎక్కడ చూసినా మంచి నీరు ఊరడం ఈ దీవి ప్రత్యేకత. బోటింగ్తో పాటు ఇతర వసతులు కల్పించి అందరినీ ఆకర్షించేలా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పాలకులు చెప్పడమే కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇంతటి ప్రాధాన్యతగల దీవి క్రమేపీ కోతకు గురవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఏ ఏటికాయేడు సముద్రపు కోత కారణంగా కొంతకొంతగా దీవి తరిగిపోతూ వస్తోంది. ఇప్పటికే కొబ్బరి, సరుగుడు తదితర తోటలను సముద్రం తనలో కలిపేసుకుంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల మధ్య ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతాన్ని, ఈ దీవిని కాపాడుకోవడానికి ఇప్పటికైనా స్పందించకపోతే మున్ముందు కడలి గర్భంలో కలిసిపోయి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ వ్యవసాయ భూములు కూడా కడలిలో కలసిపోతుండడంతో ఈ ఊరి ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. భవిష్యత్తులో ఈ ఊరు ఉంటుందనే నమ్మకం లేక ఇక్కడ ఉండడానికి ఎవరూ ఇష్ట పడకపోవడంతో త్వరతో ఈ దీవి ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది. పాలకులు పట్టించుకుని ఈ దీవి కోతకు గురవ్వకుండా చుట్టూ రక్షణ చర్యలు తీసుకుని, సుందరమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది బోటింగ్ పాయింట్లు అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.
చిన్నగొల్లపాలెంలో హరిత సోయగం
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కష్టం చూడరు.. నష్టం అడగరు
[ 08-12-2023]
ఉమ్మడి జిల్లాలోనే కేవలం ధాన్యం రైతులకు దాదాపు రూ.350 కోట్ల నష్టం వాటిల్లింది. తుపాను ప్రభావం తగ్గి రెండు రోజులు గడిచింది. -
నాడు నయం.. నేడు దయనీయం!
[ 08-12-2023]
‘విజయవాడ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 200కు పైగా అదనపు తరగతి గదులు అవసరం. గత రెండేళ్లుగా విద్యార్థులకు సరిపడా గదులు లేవు. -
ఎప్పటికప్పుడు ఎదురుచూపులే
[ 08-12-2023]
సమగ్రశిక్షలో ఎప్పుడు జీతాలు ఇస్తారో... ఎన్ని నెలలకు ఇస్తారో తెలియక వివిధ విభాగాల్లో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
ప్రజల సమస్యలు పట్టని ప్రభుత్వం: మండలి
[ 08-12-2023]
ఎదురుమొండి దీవుల ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. -
దిశ మారలేదు.. ఘోరాలు ఆగలేదు..
[ 08-12-2023]
‘దిశ యాప్ తోడుంటే.. అన్నయ్య మీ వెంట ఉన్నట్లే..’ అంటూ తరచూ సభల్లో సీఎం జగన్మోహన్రెడ్డి చెబుతుంటారు. -
దళిత సర్పంచిని అవమానిస్తారా?
[ 08-12-2023]
కె.కొత్తపాలెం సర్పంచికి బుధవారం జరిగిన అవమానాన్ని తెదేపా తీవ్రంగా పరిగణించింది. -
కృష్ణా పాలసమితి సేవలు అమూల్యం
[ 08-12-2023]
పశు పోషణ, పాల వృద్ధికి కృషి చేస్తున్న కృష్ణా పాలసమితి(విజయ డెయిరీ), కృష్ణా నదీ పరివాహక ప్రాంతమంతా వ్యాప్తి చెందాలని చినజీయర్ స్వామి ఆకాంక్షించారు. -
అడుగుకో మడుగు.. గజానికో గొయ్యి
[ 08-12-2023]
ఇది కంకిపాడు మండలం బందరు రోడ్డు నుంచి ఈడుపుగల్లు మీదుగా ఉప్పులూరు వెళ్లే రహదారి. -
బల్లలు వేసి.. ఒడ్డుకు చేర్చి..
[ 08-12-2023]
గుడ్లవల్లేరు మండలం వేమవరంలో ఎంఎన్కే రహదారి పక్కన రెండున్నర ఎకరాల్లోని వరి పంట కోసి పనలపై ఉండగా భారీ వర్షంతో ముంపు బారిన పడ్డాయి. -
రైతులకు నష్టపరిహారం అందించాలి
[ 08-12-2023]
తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేల పరిహారం అందించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజబాబు ప్రభుత్వాన్ని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 08-12-2023]
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన గన్నవరం మండలం కేసరపల్లి శివారు హెచ్సీఎల్ వద్ద చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. -
సీఐడీ కానిస్టేబుల్కు టోకరా
[ 08-12-2023]
సీఐడీ కానిస్టేబుల్కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యనమలకుదురుకు చెందిన ఎం.సురేష్ సీఐడీ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తుంటారు -
బాలిక అపహరణ.. నిందితుడి అరెస్టు
[ 08-12-2023]
ప్రేమ పేరుతో మోసం చేసి పదో తరగతి విద్యార్థినిని ఓ యువకుడు అపహరించిన ఘటనలో నిందితుడ్ని గురువారం అరెస్టు చేసి కోర్టుకు తలించామని గుడివాడ వన్టౌన్ పోలీసులు తెలిపారు.


తాజా వార్తలు (Latest News)
-
AP News: వరదలో కొట్టుకుపోయిన ఎడ్లబండి, యజమాని
-
ISRO: 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో
-
Khammam: రేవంత్ సీఎం.. ఆర్టీసీ డ్రైవర్ పాదయాత్ర
-
Murder: అతిథులకు ట్రే తగిలిందని వెయిటర్ దారుణ హత్య
-
KCR: మాజీ సీఎం కేసీఆర్కు గాయం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
-
Telangana Assembly: ప్రొటెం స్పీకర్ ఎవరనేదానిపై ఆసక్తికర చర్చ