విద్యార్థుల సమస్యల పరిష్కారానికి డిమాండ్
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ‘చలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహిస్తామని ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్నకుమార్ హెచ్చరించారు.
ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్టుడే : ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ‘చలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహిస్తామని ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్నకుమార్ హెచ్చరించారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ.. నగరంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకాన్ని కుటుంబంలో ఒకరికే వర్తింపచేస్తున్నారని, ఫీజు రీఇంబర్సుమెంట్ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల నిర్వహణ దారుణంగా ఉందన్నారు. మెస్ ఛార్జీలు చాలక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి పరిష్కారానికి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలు ఉచిత విద్యకు దూరమయ్యారన్నారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ తదితర జీవోల జారీతో విద్యా హక్కు చట్టాన్ని జగన్ ప్రభుత్వం ఉల్లంఘించిందని దుయ్యబట్టారు. నాడు-నేడు పనుల్లో చిత్తశుద్ధి కొరవడిందన్నారు. ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం.సోమేశ్వరరావు మాట్లాడుతూ.. 26,000లకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయకుండా, ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేశారని, ఉపాధ్యాయుల సర్ధుబాటు పేరిట చేతులు దులుపేసుకున్నారని విమర్శించారు. సమాఖ్య జిల్లా అధ్యక్షుడు గోపీనాయక్ మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సమాఖ్య జిల్లా బాలికల విభాగ కన్వీనరు ఎస్.కె.జాహీదా, జిల్లా కమిటీ సభ్యులు కుమారస్వామి, మాధవ్, నగర నాయకుడు పునీత్వర్మ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులకు నష్టపరిహారాన్ని అందించాలి
[ 08-12-2023]
జిల్లాకు కూరగాయలు అందించే మోపిదేవి మండలానికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు. -
కష్టం చూడరు.. నష్టం అడగరు
[ 08-12-2023]
ఉమ్మడి జిల్లాలోనే కేవలం ధాన్యం రైతులకు దాదాపు రూ.350 కోట్ల నష్టం వాటిల్లింది. తుపాను ప్రభావం తగ్గి రెండు రోజులు గడిచింది. -
నాడు నయం.. నేడు దయనీయం!
[ 08-12-2023]
‘విజయవాడ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 200కు పైగా అదనపు తరగతి గదులు అవసరం. గత రెండేళ్లుగా విద్యార్థులకు సరిపడా గదులు లేవు. -
ఎప్పటికప్పుడు ఎదురుచూపులే
[ 08-12-2023]
సమగ్రశిక్షలో ఎప్పుడు జీతాలు ఇస్తారో... ఎన్ని నెలలకు ఇస్తారో తెలియక వివిధ విభాగాల్లో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
ప్రజల సమస్యలు పట్టని ప్రభుత్వం: మండలి
[ 08-12-2023]
ఎదురుమొండి దీవుల ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. -
దిశ మారలేదు.. ఘోరాలు ఆగలేదు..
[ 08-12-2023]
‘దిశ యాప్ తోడుంటే.. అన్నయ్య మీ వెంట ఉన్నట్లే..’ అంటూ తరచూ సభల్లో సీఎం జగన్మోహన్రెడ్డి చెబుతుంటారు. -
దళిత సర్పంచిని అవమానిస్తారా?
[ 08-12-2023]
కె.కొత్తపాలెం సర్పంచికి బుధవారం జరిగిన అవమానాన్ని తెదేపా తీవ్రంగా పరిగణించింది. -
కృష్ణా పాలసమితి సేవలు అమూల్యం
[ 08-12-2023]
పశు పోషణ, పాల వృద్ధికి కృషి చేస్తున్న కృష్ణా పాలసమితి(విజయ డెయిరీ), కృష్ణా నదీ పరివాహక ప్రాంతమంతా వ్యాప్తి చెందాలని చినజీయర్ స్వామి ఆకాంక్షించారు. -
అడుగుకో మడుగు.. గజానికో గొయ్యి
[ 08-12-2023]
ఇది కంకిపాడు మండలం బందరు రోడ్డు నుంచి ఈడుపుగల్లు మీదుగా ఉప్పులూరు వెళ్లే రహదారి. -
బల్లలు వేసి.. ఒడ్డుకు చేర్చి..
[ 08-12-2023]
గుడ్లవల్లేరు మండలం వేమవరంలో ఎంఎన్కే రహదారి పక్కన రెండున్నర ఎకరాల్లోని వరి పంట కోసి పనలపై ఉండగా భారీ వర్షంతో ముంపు బారిన పడ్డాయి. -
రైతులకు నష్టపరిహారం అందించాలి
[ 08-12-2023]
తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేల పరిహారం అందించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజబాబు ప్రభుత్వాన్ని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 08-12-2023]
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన గన్నవరం మండలం కేసరపల్లి శివారు హెచ్సీఎల్ వద్ద చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. -
సీఐడీ కానిస్టేబుల్కు టోకరా
[ 08-12-2023]
సీఐడీ కానిస్టేబుల్కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యనమలకుదురుకు చెందిన ఎం.సురేష్ సీఐడీ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తుంటారు -
బాలిక అపహరణ.. నిందితుడి అరెస్టు
[ 08-12-2023]
ప్రేమ పేరుతో మోసం చేసి పదో తరగతి విద్యార్థినిని ఓ యువకుడు అపహరించిన ఘటనలో నిందితుడ్ని గురువారం అరెస్టు చేసి కోర్టుకు తలించామని గుడివాడ వన్టౌన్ పోలీసులు తెలిపారు.


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: కృత్రిమ మేధా రంగంలో ముందడుగుకు యత్నాలు..: మోదీ
-
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా
-
వాట్సప్లో ఇకపై వాయిస్ మెసేజ్లకు ‘వ్యూ వన్స్’.. త్వరలో ఈ ఫీచర్ కూడా..
-
IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లు.. అప్పుడు హీరోలు వీరే!
-
NTR: నెట్ఫ్లిక్స్ కో-సీఈవోకు ఎన్టీఆర్ ఆతిథ్యం.. ఫొటోలు వైరల్
-
ఐటీ సోదాల్లో ₹220 కోట్లు స్వాధీనం.. ప్రతి పైసా వెనక్కి రప్పిస్తామన్న మోదీ