బాబుకు బెయిల్పై తెదేపా సంబరాలు
తెదేపా అధినేత చంద్రబాబుపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టినా.. న్యాయస్థానంలో న్యాయం జరిగిందని ఆ పార్టీ శ్రేణులు నినాదాలు చేశాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తెదేపా శ్రేణులు సోమవారం సంబరాలు చేసుకున్నాయి.


కృష్ణా జిల్లాలో..
- మచిలీపట్నంలో తెదేపా కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. బాణసంచా కాల్చి పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచారు.
- పెడన పరిధిలో బంటుమిల్లి మండలంలోని తెదేపా కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి నేతలు సంబరాలు చేసుకున్నారు. న్యాయం గెలిచిందంటూ నినాదాలు చేశారు.
- ఉయ్యూరులో కౌన్సిలర్ సుధారాణి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి వేడుకలు చేసుకున్నారు.
- పోరంకి: మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలో తెదేపా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్హులైన ప్రతి ఒక్కరికి.. ఓటు హక్కు
[ 30-11-2023]
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. యువతకు ఓటు హక్కు కల్పించేందుకు కళాశాల యాజమాన్యాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. డిసెంబరు 9 నాటికి ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదుకు, అభ్యంతరాలకు దరఖాస్తులు చేసుకోవాలి. -
ఖాతాకు కంతలు.. కళ్లకు గంతలు..!
[ 30-11-2023]
రిజిస్ట్రేషన్ రుసుం.. సంఘం నిబంధనలు.. ఒకటా.. రెండా.. ఇలా అన్ని అంశాల్లోనూ అడ్డగోలు ఉల్లంఘనలే. రోడ్లకు కంకర పోసి రోలింగ్ చేసి మమ అనిపించారు. తాగునీటి ట్యాంకును అరకొరగా నిర్మించి వదిలేశారు. -
పనులు తెగ్గొట్టి.. అసలుకే ఎగ్గొట్టి!
[ 30-11-2023]
‘‘అది మొత్తం ఒకే పని. కానీ నామినేషన్పై పనులు దక్కించుకునేందుకు ముక్కలు చెక్కలు చేశారు. ఓ మంత్రి చక్రం తిప్పారు. ఇంకేముంది రూ.1.20 కోట్లకు టెండర్ పెట్టారు. మంత్రి సూచించిన వ్యక్తులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. -
నూతన విధానం... పరిశ్రమకు శరాఘాతం
[ 30-11-2023]
ప్రభుత్వం పరిశ్రమలను అభివృద్ధి చేయడం మాటేమో గానీ ఉన్నవి మూతపడే పరిస్థితి దాపురించిందని పరిశ్రమల నిర్వాహకులు వాపోతున్నారు. రిజిస్ట్రేషన్శాఖలో ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానం వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. -
షట్టర్లు దించేశారు... కాల్వలు కట్టేశారు
[ 30-11-2023]
తూర్పు కృష్ణాలో ముఖ్యమైన కౌతవరం లాకుల వద్ద బుధవారం మూడు ప్రధాన కాల్వలకు షట్టర్లు పూర్తిగా దించేశారు. పుల్లేరు నుంచి నీరు రాకపోవడంతో కాల్వలను కట్టివేశారు. -
సాధికార సభ.. ఆసాంతం వెలవెల
[ 30-11-2023]
మచిలీపట్నంలో బుధవారం నిర్వహించిన వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్ర వెలవెలబోయింది. సభ ప్రారంభమైనా కుర్చీలు కూడా నిండలేదు. -
మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం
[ 30-11-2023]
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లాలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్యలు తెలిపారు. -
ఎప్పటికప్పుడు దరఖాస్తుల పరిష్కారం
[ 30-11-2023]
ఓటరు జాబితాలో అభ్యంతరాలను పెండింగ్ లేకుండా పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. నగరంలోని కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో వారం వారీ సమావేశాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు. -
నాలుగు గంటల ఉత్కంఠ
[ 30-11-2023]
ఇసుక అక్రమ రవాణా అరికట్టాలంటూ ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద ఆందోళన చేస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు తెదేపా నాయకులను పోలీసులు బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అరెస్టు చేశారు. -
దొంగ ఓట్లు కనిపెట్టేయండిలా!!
[ 30-11-2023]
వెంకటేశ్వరరావు అనే వ్యక్తి విజయవాడ శ్రీనగర్కాలనీలో ఉంటారు. ఆయన ఓటరు కార్డు పోయింది. దాని నంబరు కూడా తెలియదు. అసలు తనకు ఓటు ఉందో.. ఉంటే ఎక్కడ ఉందో తెలియడం లేదు. -
రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో గందరగోళం
[ 30-11-2023]
విజయవాడ వన్టౌన్లోని రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో బుధవారం గందరగోళం నెలకొంది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యులుగా 11 మందిని ప్రభుత్వం నియమించింది. వారిలో ఎనిమిది మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. -
జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం
[ 30-11-2023]
జిల్లాను పారిశ్రామికంగా అన్ని విధాల అభివృద్ధి చేస్తామని కలెక్టర్ పి.రాజబాబు తెలిపారు. మచిలీపట్నం మండలం పోతేపల్లి జ్యుయలరీ పార్క్లో మౌలిక వసతుల ఆధునికీకరణ పనులు, గన్నవరం మండలం వీరపనేనిగూడెం ఇండస్ట్రియల్పార్క్ అభివృద్ధి.. -
తిరుమలలో కుప్పకూలిన నవవధువు
[ 30-11-2023]
తిరుపతి వెంకన్నను దర్శించుకున్న నూతన వధూవరుల ఆనందం అంతలోనే ఆవిరైంది. వధువు కుప్పకూలడంతో పెళ్లింట విషాదం అలుముకుంది. -
కానూరులో నీట్ విద్యార్థి మృతి
[ 30-11-2023]
కానూరులోని ఓ కళాశాలలో నీట్ శిక్షణకు వచ్చిన విద్యార్థి మృతి చెందాడు. పెనమలూరు సీఐ టీవీవీ రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. -
కోడలి మృతికి కారకుడైన మామకు అయిదేళ్ల జైలు
[ 30-11-2023]
కోడలిని లైంగికంగా వేధించి ఆమె ఆత్మహత్యకు కారకుడైన మామకు న్యాయస్థానం అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. దీనికి సంబంధించి పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.


తాజా వార్తలు (Latest News)
-
Air India: విమానంలో నీటి లీకేజీ.. క్యాబిన్ పైకప్పునుంచి ధార!
-
Ashish Reddy: దిల్ రాజు ఇంట వేడుక.. హీరో ఆశిష్ నిశ్చితార్థం
-
Vikasraj: ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ప్రత్యేక సెలవు: వికాస్రాజ్
-
Visakhaptnam: విశాఖ ఫిషింగ్ హార్బర్లో మరో అగ్ని ప్రమాదం
-
Manickam Tagore: భాజపా ఓడితే గోవా సర్కార్ కూలడం ఖాయం: కాంగ్రెస్ ఎంపీ
-
COP28: చేతల్లో చేసి చూపెట్టాం.. ‘వాతావరణ చర్యల’పై ప్రధాని మోదీ