logo

Andhra News: బీసీలపై జగన్‌ది కపట ప్రేమ: బుద్దా వెంకన్న

బీసీలపై సీఎం జగన్‌ కపట ప్రేమ చూపిస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం..

Published : 16 Apr 2022 13:29 IST

విజయవాడ: బీసీలపై సీఎం జగన్‌ కపట ప్రేమ చూపిస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం.. బీసీలను ఆర్థికంగా దెబ్బతీసిందని విమర్శించారు.  విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ తన చెప్పు చేతుల్లో ఉండేవారికి మంత్రి పదవులు ఇచ్చి.. బీసీలకు ఏదో చేశామని చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. కోర్టులో ఉన్న సాక్ష్యాలు దొంగిలించడమేంటని ప్రశ్నించారు. కాకాణి మంత్రి పదవి పోతుందనే భయామా అని నిలదీశారు. జాబులు లేకుండా వైకాపా నిర్వహిస్తున్న జాబ్‌ మేళాలు ఎందుకని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని