యాప్ పేరిట ఊడ్చేశారు
టెక్నాలజీ పెరిగే కొద్దీ, ఆన్లైన్ మోసాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. తెలివిగా ఉంటూ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక సందర్భంలో బోల్తా పడాల్సి వస్తోంది. కొత్తగణేశునిపాడులో ఒక యువకుడు సుమారు రెండు నెలల
కస్టమర్ కేర్ పేరుతో రూ.9.50 లక్షల మోసం
మాచవరం, న్యూస్టుడే : టెక్నాలజీ పెరిగే కొద్దీ, ఆన్లైన్ మోసాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. తెలివిగా ఉంటూ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక సందర్భంలో బోల్తా పడాల్సి వస్తోంది. కొత్తగణేశునిపాడులో ఒక యువకుడు సుమారు రెండు నెలల క్రితం ఆన్లైన్ మోసం ద్వారా రూ.లక్ష పోగొట్టుకోగా, తాజాగా మాచవరంలో అలాంటిదే జరిగింది. ఈసారి పెద్ద మొత్తంలో బురిడీ కొట్టించారు. పోలీసుల వివరాలు ప్రకారం.. మాచవరానికి చెందిన చిట్టిప్రోలు నరసింహరావు గురువారం విమాన టికెట్ బుక్ చేశాడు. డబ్బులు ఆన్లైన్ ద్వారా చెల్లించినా, టికెట్ డౌన్లోడ్ కానీ కన్ఫరేషన్ మెసేజ్ రాలేదు. దాంతో ఆన్లైన్లో నెంబరు చూసి కస్టమర్ కేర్కు ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తిన వ్యక్తి తాను మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పి, కొద్దిసేపటికి అతనికి ఫోన్ చేశాడు. ఒక యాప్ పేరు చెప్పి డౌన్లోడ్ చేసుకోమని సలహా ఇచ్చాడు. వెంటనే నరసింహరావు దాన్ని డౌన్లోడ్ చేసుకొని, ఇంటర్నెట్ బ్యాంకింగ్కు సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డు నమోదు చేశాడు. వెంటనే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.9.50 లక్షలు డ్రా అయ్యాయి. సెల్ఫోన్కు మెసేజ్లు వరుసగా రావడంతో మోసపోయినట్లు గ్రహించి వెంటనే బ్యాంకు సిబ్బందికి ఫోన్ చేసి ఖాతాను సీజ్ చేయించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్