Dollar Seshadri: డాలర్ శేషాద్రి మృతికి జగన్, చంద్రబాబు సంతాపం
తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
అమరావతి: తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణంపై ఏపీ సీఎం జగన్, తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబసభ్యులకు జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 1978 నుంచి ఆయన శ్రీవారి సేవలో ఉన్నారని.. చివరి క్షణం వరకు సేవలో తరించారని పేర్కొన్నారు.
డాలర్ శేషాద్రి మృతి బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. శేషాద్రి మృతి తితిదేకు తీరని లోటని చెప్పారు. ఆయన నిత్యం వేంకటేశ్వరస్వామి సేవలో తరించేవారని.. తితిదేకు విశేష సేవలందించారన్నారు. డాలర్ శేషాద్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. రన్వేపై వీడియో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..