Dollar Seshadri: డాలర్‌ శేషాద్రి మృతికి జగన్‌, చంద్రబాబు సంతాపం

తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Updated : 29 Nov 2021 12:16 IST

అమరావతి: తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణంపై ఏపీ సీఎం జగన్‌, తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబసభ్యులకు జగన్‌ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 1978 నుంచి ఆయన శ్రీవారి సేవలో ఉన్నారని.. చివరి క్షణం వరకు సేవలో తరించారని పేర్కొన్నారు.  

డాలర్‌ శేషాద్రి మృతి బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. శేషాద్రి మృతి తితిదేకు తీరని లోటని చెప్పారు. ఆయన నిత్యం వేంకటేశ్వరస్వామి సేవలో తరించేవారని.. తితిదేకు విశేష సేవలందించారన్నారు. డాలర్‌ శేషాద్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని