Cm Jagan: వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి: కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు
రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలెక్టర్లను ఆదేశించారు. బాధితులు చెబుతోన్న సమస్యలను తెలుసుకొని
అమరావతి: రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలెక్టర్లను ఆదేశించారు. బాధితులు చెబుతోన్న సమస్యలను తెలుసుకొని ఉదారంగా స్పందించి తక్షణం నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి వసతుల పునరుద్ధరణపై దృష్టిపెట్టాలన్నారు. చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే కాలువలు సహా ప్రత్యామ్నాయ విధానాల ద్వారా బయటకు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్లు, ఇతర విభాగాల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. పాక్షికంగా, లేదా పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం, 104 కాల్ సెంటర్కు వచ్చిన కాల్స్, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, 2వేల రూపాయల అదనపు సాయం పంపిణీ తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. నిత్యావసరాల పంపిణీ, అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు, రోడ్ల తాత్కాలిక పునరుద్ధరణ, చెరువుల భద్రత, గండ్లు పూడ్చివేత, తాగునీటి సరఫరా, గల్లంతైన వారికి పరిహారం, మరణించిన పశువులకు పరిహారం సహా పలు అంశాలను సీఎం సమీక్షించారు.
ఎన్యుమరేషన్ పూర్తయిన వెంటనే సోషల్ ఆడిట్..
‘‘పంట నష్టంపై ఎన్యుమరేషన్ పూర్తయిన వెంటనే సోషల్ ఆడిట్ కూడా నిర్వహించాలి. పూర్తిగా ధ్వంసమైన ఇళ్ల స్థానంలోనే కొత్త ఇళ్లను మంజూరు చేయాలి. వెంటనే పనులు మొదలు పెట్టాలి. ఇళ్లులేని కారణంగా వారికి తాత్కాలిక వసతి ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలి. చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు చేపట్టాలి. చెరువులకు మధ్య అనుసంధానం ఉండాలి. చెరువులు నిండగానే అదనంగా వచ్చే నీటిని నేరుగా కాల్వలకు పంపించే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. భవిష్యత్తులో దీనిపై దృష్టిపెట్టాలి. తాగునీటి వసతుల పునరుద్ధరణపై దృష్టిపెట్టాలి. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో నీటిని నిల్వచేయలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే చాలాచోట్ల తాగునీటి సరఫరాకు ఆధారమైన చెరువులకూ గండ్లు పడ్డాయి. వీటిమీద ఆధారపడిన పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని బలమైన ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలి. నిత్యావసరాలు అందించిన ప్రతి కుటుంబానికి అదనపు సాయంగా రూ.2వేలు ఇవ్వాలి. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు వచ్చే విజ్ఞప్తులపై ఉదారంగా స్పందించాలి.
సీజన్ ముగిసేలోగా సాయం అందిస్తాం..
వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకొనేందుకు శరవేగంగా చర్యలు తీసుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదు. బాధిత కుటుంబాలకు అన్నిరకాలుగా పరిహారాన్ని అందించాం. ఇళ్లు ధ్వంసమైన వారికి, మరణించిన వారికి వారం రోజుల్లో ఆయా కుటుంబాలకు పరిహారం ఇచ్చి వారిని అదుకున్నాం. రేషన్, నిత్యావసరాలతో పాటు సాయంగా రూ. 2వేలు కూడా అందించాం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్ పూర్తిచేసి సీజన్ ముగిసేలోగా వారికి సహాయం అందిస్తాం. గతంలో ఇన్పుట్ సబ్సిడీ అందాలంటే కనీసం సంవత్సరం పట్టేది. ఆ తర్వాత ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు పంట నష్టపోయిన సీజన్ ముగిసేలోగానే పరిహారం అందిస్తున్నాం. కలెక్టర్లు, అధికారులు బాగా పనిచేసి పరిహారాన్ని వేగంగా అందించేలా అన్ని చర్యలు తీసుకున్నారు. అయితే వరదల వల్ల నష్టపోయిన వారికి సరైన సమయంలో వేగంగా సాయం, పరిహారం అందిస్తే కూడా కొంత మంది అనవసర ఆరోపణలు చేస్తూ బురద జల్లుతున్నారు’’ అని సీఎం అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఠారెత్తిస్తోన్న ఎండలు.. ఏం చేయాలి? ఏం చేయొద్దు?
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న వేళ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు పలు కీలక సూచనలు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎగిసిన మంటలు
రహదారి సరిహద్దులోని గ్యాస్ పైపులైను ప్రమాదవశాత్తు లీకవడంతో ఒక్కసారిగా మంటలు ఎగసి పడిన ఘటన ముదినేపల్లి మండలం గురజ-పెనుమల్లి సరిహద్దులో సోమవారం జరిగింది. -
దారి మారలేదు.. ఆళ్ల వల్ల కాలేదు..
కృష్ణా పశ్చిమ డెల్టాలోని వివిధ ప్రాంతాల నుంచి తెనాలికి వచ్చి అక్కడి నుంచి దుగ్గిరాల మీదుగా విజయవాడకు రాకపోకలు సాగించేవారు ఎక్కువ. -
నీటి రాతలే.. నీళ్ల్లివ్వరు!
వలసలతో పట్టణ జనాభా నానాటికీ పెరుగుతోంది.. పెరుగుతున్న అవసరాలకు సరిపడా నీరందడం లేదు. వేసవిలో గుక్కెడు నీటి కోసం పుర ప్రజలు అల్లాడుతున్నారు. -
ప్రయాణికులకు అవే తిప్పలు
ఆర్టీసీ ప్రయాణికుల ఇక్కట్లు ఇప్పట్లో తీరేలా లేవు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ గుడివాడలో నిర్వహించిన సభకు బాపట్ల డిపో నుంచి 26 బస్సులు కేటాయించారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమట!
-
ఠారెత్తిస్తోన్న ఎండలు.. ఏం చేయాలి? ఏం చేయొద్దు?
-
జీలం నదిలో పడవ బోల్తా.. పలువురి గల్లంతు
-
నష్టాల్లోనే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
-
వరుస ఓటములు జట్టును కుంగదీశాయి: బెంగళూరు కెప్టెన్
-
హైదరాబాద్లో మధ్యాహ్నం సగం సిటీ బస్సులకు విశ్రాంతి