Cyclone Jawad: కోస్తాంధ్ర తీరం వైపు దూసుకొస్తున్న జవాద్
పశ్చిమమధ్య బంగాళాఖాతం నుంచి గంటకు 22 కిలోమీటర్ల వేగంతో జవాద్ తుపాను కోస్తాంధ్రతీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం విశాఖకు 360 కిలోమీటర్ల దూరంలో
అమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతం నుంచి గంటకు 22 కిలోమీటర్ల వేగంతో జవాద్ తుపాను కోస్తాంధ్రతీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం విశాఖకు 360 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాల్పూర్కు 470, పారాదీప్కు 530 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది మరింత పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ రేపు ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. తుపాను బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశముందని వెల్లడించారు. కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం దిశ మార్చుకుని ఒడిశాలోని పూరి దిశగా కదిలే సూచనలు ఉన్నాయని, ఆ తదుపరి కొద్దిగా బలహీనపడి పశ్చిమ్ బెంగాల్ తీరం దిశగా ప్రయాణించే అవకాశముందని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో తీరం వెంబడి ప్రస్తుతం గంటకు 80 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరానికి దగ్గరగా వచ్చే కొద్దీ గాలుల వేగం 100 కి.మీ కు పెరిగే సూచలు ఉన్నాయని తెలిపారు. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. చాలా చోట్ల 20 సెం.మీ కంటే అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం..
జవాద్ తుపాను ప్రభావంపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్గౌబ నేతృత్వంలో సమీక్ష జరిగింది. జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ ఉన్నతస్థాయి సమావేశంలో జవాద్ తుపాను దృష్ట్యా రాష్ట్రాల సన్నద్ధతపై చర్చించారు. రేపు ఉత్తరాంధ్ర- ఒడిశా మధ్య తుపాను తీరం దాటే అవకాశముందని ఐఎండీ అంచనా వేసిన నేపథ్యంలో.. తుపాను అనంతర చర్యలపై రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ప్రాణ ఆస్తినష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఉత్తర కోస్తా జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష
ఉత్తర కోస్తా జిల్లాలకు జవాద్ తుపాను దృష్ట్యా ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ‘‘ఎక్కడా ప్రాణ నష్టం ఉండకూడదు. ఒక్క మరణం కూడా సంభవించొద్దు. ఆ మేరకు అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలి. సహాయ కార్యక్రమాల కోసం తుపాను ప్రభావిత జిల్లాలకు రూ.10కోట్ల చొప్పున అందుబాటులో ఉంచండి. సహాయక చర్యల్లో ఏ లోపం ఉండకూడదు. జిల్లాలకు వెళ్లిన ప్రత్యేక అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. సహాయ శిబిరాల్లో ఆహార నాణ్యత మరింత ముఖ్యం. అన్ని జిల్లాల్లో అవసరమైన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉండాలి. ఇంకా అదనపు బృందాలను కూడా అందుబాటులో ఉంచాలి. ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలి. చెరువులు, కాల్వలు, రిజర్వాయర్ల కట్టలు ఎలా ఉన్నాయన్నది చూడండి. ఎక్కడైనా గండ్లు పడితే వెంటనే జలవనరులశాఖ అధికారులతో మాట్లాడి అత్యవసర మరమ్మతులు చేపట్టండి. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి’’ అని సీఎం స్పష్టం చేశారు. తుపాను పరిస్థితిని డీఆర్ఎం అనూప్ కుమార్ సమీక్షిస్తున్నారు. విజయనగరం, రాయగడ రైల్వే స్టేషన్లలో హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. తుపాను దృష్ట్యా విశాఖ ఉక్కు పరిశ్రమ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉక్కు ఉత్పత్తికి ఆటంకం లేకుండా 19 మంది అధికారులతో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. మూడ్రోజుల పాటు ఉక్కు ఉత్పత్తికి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లాలో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు
తుపాను దృష్ట్యా రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ ప్రత్యేక అధికారిగా శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. జిల్లా కలెక్టర్ , జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 79 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
* జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నంబరు : 08942 240557
* పాలకొండ డివిజన్ (అర్.డి.ఒ) కంట్రోల్ రూం : 08941-260144, 9493341965
* టెక్కలి డివిజన్ (అర్.డి.ఒ) కంట్రోల్ రూం : 08945-245188
* శ్రీకాకుళం డివిజన్ (అర్.డి.ఒ) కంట్రోల్ రూం : 8333989270
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
మల్టీజోన్ -1 పరిధిలో విధుల్లో అలసత్వం వహించిన ఆరుగురు పోలీసు అధికారులను ఐజీ ఏవీ రంగనాథ్ సస్పెండ్ చేశారు. -
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు