నిరంతర వైద్య విద్య కార్యక్రమాలతో సమగ్ర చికిత్సలు
వైద్య విద్య రంగంలో ప్రమాణాలు పెంచేందుకు, వ్యాధులకు సమగ్రమైన చికిత్సలు అందించేందుకు నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని సూపరింటెండెంట్ ప్రభావతి తెలిపారు. సర్వజనాసుపత్రి
జ్యోతి వెలిగిస్తున్న ప్రభావతి, వరప్రసాద్ పక్కన పద్మావతిదేవి తదితరులు
గుంటూరు వైద్యం, న్యూస్టుడే: వైద్య విద్య రంగంలో ప్రమాణాలు పెంచేందుకు, వ్యాధులకు సమగ్రమైన చికిత్సలు అందించేందుకు నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని సూపరింటెండెంట్ ప్రభావతి తెలిపారు. సర్వజనాసుపత్రి ఆర్థో విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి వైద్య విద్య కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సీనియర్ల పర్యవేక్షణలో ఆధునిక వైద్య విధానాలపై ప్రత్యేక శిక్షణ పొందడానికి అవకాశం లభిస్తుందన్నారు. విద్యార్థి వైద్యులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. గుంటూరు వైద్య కళాశాల ప్రధానాచార్యులు పద్మావతిదేవి, రాష్ట్ర వైద్య మండలి సభ్యుడు శ్రీధర్, ఆచార్యులు రమణ యశస్వి, నారాయణరావు, రాష్ట్ర ఆర్థోపెడిక్ సర్జన్స్ సంఘం అధ్యక్షుడు దుర్గాప్రసాద్, కార్యదర్శి నరేష్బాబు, సీనియర్ ఆచార్యులు అమర్నాథ్, సుమితాశంకర్, గంగాభవాని, నజ్మా, బిందేష్, పలువురు బోధనా నిపుణులు, విద్యార్థి వైద్యులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!