logo

‘ఈయూ కూటమి అభ్యర్థులను గెలిపించండి’

ఆర్టీసీ ఉద్యోగుల క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ (సీసీఎస్‌) ఎన్నికల్లో ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు కోరారు.

Published : 05 Dec 2021 04:58 IST


ఆర్టీసీ బస్టాండులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పలిశెట్టి దామోదరరావు, హనుమంతరావు తదితరులు

పట్నంబజారు, న్యూస్‌టుడే: ఆర్టీసీ ఉద్యోగుల క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ (సీసీఎస్‌) ఎన్నికల్లో ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు కోరారు. ఈనెల 14న సీసీఎస్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం గుంటూరు-1, 2 డిపోల్లోని ఉద్యోగులను కలిసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గతంలో ఉద్యోగి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మూడు నెలలకు మంజూరయ్యేదని, ప్రస్తుతం మూడు రోజులకే వస్తోందన్నారు. ఉద్యోగుల పిల్లల విదేశీ చదువుల కోసం రూ.20 లక్షల వరకు రుణం మంజూరు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఈయూ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హనుమంతరావు, జోనల్‌ అధ్యక్షుడు ఎన్‌.వి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని