రౌడీషీటర్పై దాడి.. చికిత్స పొందుతూ మృతి
ఇద్దరు వ్యక్తులు దాడిచేసిన ఘటనలో రౌడీషీటర్ మృతిచెందిన సంఘటన నగరం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉల్లిపాలెం గ్రామానికి చెందిన మేకల ప్రేమ్కుమార్(35) ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
మేకల ప్రేమ్కుమార్ (దాచిన చిత్రం)
నగరం, న్యూస్టుడే : ఇద్దరు వ్యక్తులు దాడిచేసిన ఘటనలో రౌడీషీటర్ మృతిచెందిన సంఘటన నగరం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉల్లిపాలెం గ్రామానికి చెందిన మేకల ప్రేమ్కుమార్(35) ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గతంలో చెరుకుపల్లిలో జరిగిన ఓ హత్య కేసులో అతడు నిందితుడు. అందులో భాగంగా ఈ నెల 2న తనతోపాటు అదే కేసులో ఉన్న మరో ఇద్దరు నిందితులతో కలిసి రేపల్లెలోని కోర్టుకు హాజరయ్యాడు. అదేరోజు రాత్రి గ్రామ సమీపంలో వారు మద్యం తాగుతుండగా గొడవపడ్డారు. ఆ ఇద్దరు వ్యక్తులు కర్రతో ప్రేమ్కుమార్ తలపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలిసిన బంధువులు వెంటనే అతడ్ని తెనాలి వైద్యశాలకు, అక్కడ్నించి మెరుగైన వైద్యం నిమిత్తం జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుని భార్య ఎస్తేరు రాణి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై స్వామి శ్రీనివాస్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా