logo

మంగళగిరికి ఇంటర్‌ బోర్డు తరలింపు

విజయవాడ నాగార్జుననగర్‌లోని ఇంటర్‌ బోర్డు కార్యాలయాన్ని మంగళగిరికి తరలించారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇటీవల ఇంటర్‌ బోర్డు అధికారులు సచివాలయానికి దగ్గరగా ఉండటానికి వీలుగా

Published : 08 Dec 2021 05:13 IST


వాహనాల్లో సామగ్రి తీసుకెళ్తున్న చిత్రం

కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే: విజయవాడ నాగార్జుననగర్‌లోని ఇంటర్‌ బోర్డు కార్యాలయాన్ని మంగళగిరికి తరలించారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇటీవల ఇంటర్‌ బోర్డు అధికారులు సచివాలయానికి దగ్గరగా ఉండటానికి వీలుగా మంగళగిరికి మార్చేందుకు నిర్ణయించారు ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా ఆయా విభాగాలను తరలిస్తున్నారు. బోర్డు కార్యాలయంలో మిగిలిన వస్తువులను మంగళవారం వాహనాల్లో ఎక్కించి తీసుకెళ్లారు. దీంతో ఇక్కడ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని