తానా అన్నపూర్ణ పథకం ప్రారంభం
తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమాలకు తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ భరోసా ఇచ్చారు. ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం తెనాలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు
నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్,
తెనాలి (కొత్తపేట), న్యూస్టుడే: తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమాలకు తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ భరోసా ఇచ్చారు. ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం తెనాలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ పథకం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. దాతలు కాట్రగడ్డ సుధాకర్, వెంకటేశ్వరరావులు వారి తల్లితండ్రులైన సుబ్బారావు, కాళికాంబల జ్ఞాపకార్థం ఆస్పత్రిలో రోగుల సహాయకులకు రోజూ ఉచితంగా భోజనాన్ని అందజేయడం ప్రశంసనీయమన్నారు. తానా ఫౌండేషన్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకట, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, ఫౌండేషన్ ట్రస్టీ, తానా అన్నపూర్ణ సమన్వయకర్త పుట్టగుంట సురేష్లు మాట్లాడూతూ ఇక్కడ క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, దీనికి ఎమ్మెల్యే సహాయ సహకారాలను కోరుతున్నట్లు వారు పేర్కొన్నారు. తానా కమ్యూనిటీ సర్వీస్ నిర్వాహకుడు కసుకుర్తిరాజా, కుమార్ పంప్స్ అధినేత సుబ్రహ్మణ్యం, డాక్టర్ శారద, ఆర్ఎంవోలు రాజేంద్ర, సుధీర్, పురపాలిక ఛైర్పర్సన్ నసీమ్, వైస్ఛైర్మన్లు హరిప్రసాద్, కోటేశ్వరరావు, అక్షయపాత్ర నిర్వాహకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది