AP News: తాడేపల్లిలో ఇంజినీరింగ్‌ విద్యార్థుల మొబైల్‌ ఫోన్లు చోరీ

గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద బ్యాగ్‌లో ఉంచిన 24 మొబైల్‌ ఫోన్లు చోరీకి గురయ్యాయి. వట్టిచెరుకుఊరు కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు కృష్ణానదిలో స్నానానికి వెళుతూ ఒడ్డున బ్యాగ్‌లో ..

Published : 08 Dec 2021 08:10 IST

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద బ్యాగ్‌లో ఉంచిన 24 మొబైల్‌ ఫోన్లు చోరీకి గురయ్యాయి. వట్టిచెరుకుఊరు కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు కృష్ణానదిలో స్నానానికి వెళుతూ ఒడ్డున బ్యాగ్‌లో 24 సెల్‌ఫోన్లు ఉంచారు. స్నానం తర్వాత ఒడ్డుకు చేరుకుని చూసేసరికి ఆ బ్యాగ్‌ కనిపించలేదు. అనంతరం విద్యార్థులు తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. సుమారు రూ.3లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని