ఆనందం అంతలోనే ఆవిరి
ఎ.కొండూరు మండలం అడ్డరోడ్డు సమీపంలోని స్పిన్నింగ్ మిల్లు వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తాత, మనవరాలు, దుర్మరణం చెందగా, ఆయన కుమార్తె, చిన్న మనవరాలు గాయపడ్డారు. తిరువూరు
రోడ్డు ప్రమాదంలో తాత, మనవరాలు దుర్మరణం
యశ్విత,
తిరువూరు, ఎ.కొండూరు, న్యూస్టుడే: ఎ.కొండూరు మండలం అడ్డరోడ్డు సమీపంలోని స్పిన్నింగ్ మిల్లు వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తాత, మనవరాలు, దుర్మరణం చెందగా, ఆయన కుమార్తె, చిన్న మనవరాలు గాయపడ్డారు. తిరువూరు మండలం చిట్టేలకు చెందిన పొన్నూరు శ్రీనివాసరావు ఎ.కొండూరు మండలం కోమటికుంటలో బంధువుల ఇంట జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. అదే గ్రామంలో ఉంటున్న కుమార్తె మాదాసు సత్యవేణి, మనవరాళ్లు యశ్విత, భవ్యశ్రీలను పుట్టింటికి తీసుకెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై చిట్టేల బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని స్పిన్నింగ్ మిల్లు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ వేగంగా ఢీకొంది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావు (50), పెద్ద మనవరాలు యశ్విత (5) ఘటనాస్థలంలోనే కన్నుమూశారు. గాయపడిన సత్యవేణి, భవ్యశ్రీలను చికిత్స నిమిత్తం మైలవరం ఆస్పత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం విజయవాడ ఆస్పత్రిలో చేర్పించారు. ఎ.కొండూరు ఎస్సై టి.శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీనివాసరావు (దాచిన చిత్రాలు)
ప్రమాద స్థలంలో లారీ, ద్విచక్ర వాహనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట