రహదారుల ప్రారంభోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు
రాష్ట్రంలోని పలు రహదారులు, వంతెనలకు ఈ నెల 10న కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, జి.కిషన్రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి ఇందిరాగాంధీ
స్టేడియంలో అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్ జె.నివాస్
విజయవాడ క్రీడలు, న్యూస్టుడే: రాష్ట్రంలోని పలు రహదారులు, వంతెనలకు ఈ నెల 10న కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, జి.కిషన్రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి ఇందిరాగాంధీ స్టేడియంలో చేపడుతున్న ఏర్పాట్లను బుధవారం రాత్రి కలెక్టర్ జె.నివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆహ్వానితులు విచ్చేస్తారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేదిక వద్ద మూడు గ్రీన్ రూమ్లు ఏర్పాటు, నమూనా బ్రిడ్జి, వీఐపీ, వీవీఐపీలు కూర్చునే గ్యాలరీల ఏర్పాట్లపై చర్చించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) కె.మోహన్కుమార్, జాతీయ హైవే పీడీ డి.నారాయణ, డి.శ్రీనివాస్, డ్వామా పీడీ సూర్యనారాయణ, సర్వశిక్షా అభియాన్ పీడీ శేఖర్, ముడా వీసీ నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా