logo

Suicide: అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి యువతి బలవన్మరణం

చిలకలూరిపేట రైతుబజారు ఎదురుగా గాంధీపేటలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ పైనుంచి ఆదివారం ఉదయం ఓ యువతి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం

Updated : 03 Jan 2022 07:30 IST

మృతిచెందిన సుభాషిణి

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: చిలకలూరిపేట రైతుబజారు ఎదురుగా గాంధీపేటలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ పైనుంచి ఆదివారం ఉదయం ఓ యువతి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ప్రముఖ ఆడిటర్‌ అన్నదాత కుమార్తె సుభాషిణి (30) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం సుబ్బయ్యతోటలో ఉన్న ఇంటి నుంచి గాంధీపేటలోని అపార్ట్‌మెంట్‌ వద్దకు వచ్చింది. 5వ ఫ్లోర్‌లో వారి ఫ్లాటు ఉంది. ఈ క్రమంలోనే యువతి పైనుంచి దూకింది. ఆమె ఇనుపగేటుపై పడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే సుభాషిణి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అర్బన్‌ ఎస్సై మోహన్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రి వద్ద మృతదేహాన్ని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించి నివాళి అర్పించారు. అన్నదాత కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని