logo

‘జగన్‌ పాలనలో పండగ చేసుకునే పరిస్థితి లేదు’

జగన్‌ పాలనలో ప్రజలు సంతోషంగా పండగ చేసుకునే పరిస్థితి లేదని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ దాసరి రాజా మాస్టారు విమర్శించారు. వైకాపా ప్రభుత్వం

Published : 15 Jan 2022 03:59 IST

ప్రజా వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో వేసి నిరసన తెలుపుతున్న తెదేపా నాయకులు

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: జగన్‌ పాలనలో ప్రజలు సంతోషంగా పండగ చేసుకునే పరిస్థితి లేదని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ దాసరి రాజా మాస్టారు విమర్శించారు. వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించిన జీవోలను శుక్రవారం తెదేపా జిల్లా కార్యాలయం వద్ద భోగి మంటల్లో కాల్చి నిరసన తెలిపారు. దాసరి రాజా మాస్టారు మాట్లాడుతూ ‘జగన్‌ అధికారంలోకి వచ్చాక పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం చేతగాక చేతులెత్తేశారు. సంపద సృష్టించలేక కేవలం పన్నులు పెంచుతూ ప్రజలపై భారం మోపడమే పనిగా పెట్టుకున్నారు. ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఓటీఎస్‌ పేరుతో పేదల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన జీవోలను భోగి మంటల్లో వేసి నిరసన తెలియజేశాం’.. అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు గింజుపల్లి వెంకటేశ్వరరావు, నాయుడు ఓంకార్‌, ఈరంటి వరప్రసాద్‌, కొమ్మినేని కోటేశ్వరరావు, గోళ్ల ప్రభాకర్‌, కొనకళ్ల సత్యనారాయణ, గుడిమెట్ల దయారత్నం, షేక్‌ ఫిరోజ్‌, హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని