విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి
: విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ దొండపాటి బాలకృష్ణ మృతి చెందిన ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. విజయవాడ నెహ్రూనగర్కు
కానూరు, న్యూస్టుడే : విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ దొండపాటి బాలకృష్ణ మృతి చెందిన ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. విజయవాడ నెహ్రూనగర్కు చెందిన బాలకృష్ణ(45) ఎలక్ట్రీషియన్ పనులు చేస్తుంటాడు. పెనమలూరులోని శివప్రసాదు ఇంట్లో విద్యుత్తు పనులు చేసేందుకు వచ్చాడు. అతనితో పాటు మోహనరావు, సాయి వచ్చారు. పనులు చేస్తున్న సమయంలో వర్షం పడటంతో విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో..
గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే : గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక పిన్నమనేని ఆసుపత్రి వద్ద యాచకుడు రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆత్కూరు ఎస్సై కిశోర్ బృందం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.