కారు ఢీకొని ఆటో చోదకుడి దుర్మరణం
ఆటోను కారు ఢీ కొట్టిన ఘటనలో చికిత్స పొందుతూ ఆటో చోదకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. తుళ్లూరు మండలం నేలపాడు గ్రామానికి
జ్ఞానపాల్ (పాత చిత్రం)
తాడికొండ, న్యూస్టుడే: ఆటోను కారు ఢీ కొట్టిన ఘటనలో చికిత్స పొందుతూ ఆటో చోదకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. తుళ్లూరు మండలం నేలపాడు గ్రామానికి చెందిన బక్కా జ్ఞానపాల్ (38) ఆటో నడుపుతుంటారు. శుక్రవారం ఉదయం నేలపాడు నుంచి కూలీలను తీసుకొని మండలంలోని లాం గ్రామానికి వచ్చారు.కాసేపటికి తిరిగి ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకొని బయలుదేరారు. పెద్దపరిమి రోడ్డులోని భ్రమరా టౌన్షిఫ్ వద్దకు చేరుకుంటుండగా అదే సమయంలో ఎదురుగా వస్తున్న కారు ఆటోను ఢీకొంది. దీంతో ఆటో పల్టీ కొట్టింది. అందులో ఉన్న ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలవగా, జ్ఞానపాల్కు తీవ్రంగా గాయపడ్డారు. స్పందించిన స్థానికులు 108 వాహనంలో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ జ్ఞానపాల్ మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.