పురుగుల మందు తాగి ఒకరి ఆత్మహత్య
పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై శనివారం కేసు నమోదు చేసినట్టు సీఐ బండారు సురేష్బాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం..
పెదకాకాని, న్యూస్టుడే: పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై శనివారం కేసు నమోదు చేసినట్టు సీఐ బండారు సురేష్బాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన ఎ.శ్రీనివాసరావు(45) అదే గ్రామానికి చెందిన కోడలు వరసయ్యే ఓ మహిళతో వారం క్రితం ఇంటి నుంచి వెళ్లారు. ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆ మహిళ అదృశ్యమైనట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆమె ఇంటికి తిరిగొచ్చింది. బంధువులు, గ్రామస్థులు పలు రకాలుగా తనను వేధిస్తారని భావించిన శ్రీనివాసరావు పురుగుల మందు తాగి, ఇంటికెళ్లి కుటుంబసభ్యులతో విషయం చెప్పారు. వారు వెంటనే ఆయన్ను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్టు చెప్పారు. ఆయన తండ్రి ఆదియ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Bengaluru: రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత.. బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం
-
Kantara: ‘కాంతార 2’.. హీరోయిన్గా ఆమెను ఎంపిక చేస్తున్నారా?
-
Medicine Racket: నకిలీ ఔషధ రాకెట్ కేసులో ఈడీ ముమ్మర దాడులు
-
AAP: పదేళ్లలో దిల్లీకి ఏం చేశారు?.. భాజపా ఎంపీలకు ఆప్ ప్రశ్న!
-
BRS: ప్రవీణ్కుమార్ను భారాస ప్రధాన కార్యదర్శిగా నియమిస్తాం: కేసీఆర్
-
Yadagirigutta: యాదగిరిగుట్టలో వైభవంగా తిరు కల్యాణ మహోత్సవం