పురుగుల మందు తాగి ఒకరి ఆత్మహత్య
పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై శనివారం కేసు నమోదు చేసినట్టు సీఐ బండారు సురేష్బాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం..
పెదకాకాని, న్యూస్టుడే: పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై శనివారం కేసు నమోదు చేసినట్టు సీఐ బండారు సురేష్బాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన ఎ.శ్రీనివాసరావు(45) అదే గ్రామానికి చెందిన కోడలు వరసయ్యే ఓ మహిళతో వారం క్రితం ఇంటి నుంచి వెళ్లారు. ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆ మహిళ అదృశ్యమైనట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆమె ఇంటికి తిరిగొచ్చింది. బంధువులు, గ్రామస్థులు పలు రకాలుగా తనను వేధిస్తారని భావించిన శ్రీనివాసరావు పురుగుల మందు తాగి, ఇంటికెళ్లి కుటుంబసభ్యులతో విషయం చెప్పారు. వారు వెంటనే ఆయన్ను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్టు చెప్పారు. ఆయన తండ్రి ఆదియ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో