భార్య అలిగి వెళ్లిందని భర్త ఆత్మహత్య
భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని గుర్రాలచావిడి పెద్దమసీదు వద్ద ఇది జరిగింది. అర్బన్ పోలీసుల వివరాల మేరకు..
చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్టుడే : భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని గుర్రాలచావిడి పెద్దమసీదు వద్ద ఇది జరిగింది. అర్బన్ పోలీసుల వివరాల మేరకు.. నగరం మండలం సజ్జావారిపాలేనికి చెందిన షేక్ సుభాని (33)తో చిలకలూరిపేటకు చెందిన నజీమాతో వివాహం జరిగింది. చిలకలూరిపేటలోనే దంపతులు ఉండేవారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు. భర్త సుభానీ లారీడ్రైవర్. తరచు మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. దీంతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి భార్య నజీమా అలిగి పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన సుభాని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదివారం పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి