భీమడోలు కూడలిలో ప్రమాదం
గుండుగొలను- దేవరపల్లి రహదారిపై భీమడోలు కూడలిలో శనివారం ఉదయం ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఒక ప్రైవేటు బస్సు ఢీకొట్టిన ఘటనలో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై వి.ఎస్.వి.భద్రరావు కథనం ప్రకారం..
భీమడోలు, న్యూస్టుడే : గుండుగొలను- దేవరపల్లి రహదారిపై భీమడోలు కూడలిలో శనివారం ఉదయం ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఒక ప్రైవేటు బస్సు ఢీకొట్టిన ఘటనలో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై వి.ఎస్.వి.భద్రరావు కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న వెంకటపద్మావతి ట్రావెల్స్ బస్సు భీమడోలు కూడలి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈప్రమాదంలో బస్సు డ్రైవరు విజయవాడకు చెందిన అంకం బుజ్జి, నూజీవీడు మండలం ఎలమందల గ్రామానికి చెందిన గరిగిపాటి జోజిబాబుతో సహా బస్సులోని మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.