15.2 కిలోల మహా కంద
కృష్ణా జిల్లా అవనిగడ్డ మూడో వార్డుకు చెందిన రైతు అన్నపరెడ్డి వెంకటేశ్వరరావు తన పెరట్లో నాటిన కంద దుంప ఏడాదిన్నర కాలానికి 15.2 కిలోలు బరువు పెరిగింది. ఎటువంటి పోషణ చేయకుండానే దుంప పెద్దది అయిందని
కృష్ణా జిల్లా అవనిగడ్డ మూడో వార్డుకు చెందిన రైతు అన్నపరెడ్డి వెంకటేశ్వరరావు తన పెరట్లో నాటిన కంద దుంప ఏడాదిన్నర కాలానికి 15.2 కిలోలు బరువు పెరిగింది. ఎటువంటి పోషణ చేయకుండానే దుంప పెద్దది అయిందని వెంకటేశ్వరరావు చెప్పారు. దాన్ని అమ్మకానికి తెలిసిన దుకాణదారునికి ఇచ్చినట్లు చెప్పారు. కనుమ రోజున ఆ దుంప దుకాణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుండ్రంగా పెరిగిన దుంపను పలువురు ఆసక్తిగా చూస్తున్నారు. సాధారణంగా ఈ దుంప అయిదారు కిలోల వరకు పెరుగుతుందని.. పెరట్లో కుళ్లిన వ్యర్థాల ద్వారా మంచి పోషకాలు అందడంతో భారీగా పెరిగిందని ఉద్యానాధికారి లక్పతి తెలిపారు.
- న్యూస్టుడే, అవనిగడ్డ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు