AP News: ఏ సీఎం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోరు: ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ ఆరోపించారు. మంగళవారం...
అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన అధికారి సరిగా వ్యవహరించటం లేదని అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. ఫిట్మెంట్ 23శాతం ఆమోదయోగ్యం కాదని ఇప్పటికే రాతపూర్వకంగా తెలిపాం, ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ అంశాలను ప్రభుత్వం తప్పకుండా పునఃసమీక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. అధికారులు ఏం చెప్పినా, ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. పీఆర్సీ జీవోలపై పునః సమీక్ష చేయాల్సిదేనన్నారు. మధ్యంతర భృతిని తిరిగి రికవరీ చేస్తామనడం ఏమిటో అర్ధం కావడంలేదన్నారు. మధ్యంతర భృతిని రికవరీ చేసిన పరిస్థితి చరిత్రలో లేదని, అధికారులు సీఎంను తప్పుదోవ పట్టించారని భావిస్తున్నట్టు చెప్పారు.
రాజకీయ కోణంలో చూస్తే ఏ సీఎం కూడా ఈ తరహా నిర్ణయం తీసుకుంటారని భావించడం లేదన్నారు. సెంట్రల్ పే కమిషన్ అమలు చేస్తామన్న ప్రభుత్వం.. రాష్ట్ర ఉద్యోగులపై అధికారాన్ని వదిలేసుకుంటారా? అని ప్రశ్నించారు. పీఆర్సీ జీవోలను వెంటనే నిలిపివేయాలని, సీఎం నేతృత్వంలో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మరో రెండు నెలలు జాప్యమైనా ఫర్వాలేదు.. ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్ను కొనసాగించి ఉద్యోగులకు మేలే చేసేలా కసరత్తు చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవో వల్ల 4 నుంచి 12శాతం జీతం కోతపడే ప్రమాదం ఉందని, ఉద్యోగ సంఘాలన్నీ ఒకే వేదికమీదకు రావాలని సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?