logo

ఈడీగా దుర్గాబాయి బాధ్యతల స్వీకరణ

జిల్లా బీసీ కార్పొరేషన్‌ ఈడీగా డి.దుర్గాబాయి బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని కన్నావారితోటలో ఉన్న కార్పొరేషన్‌ కార్యాలయంలో దస్త్రంపై సంతకం చేసి గురువారం విధుల్లో చేరారు.

Published : 21 Jan 2022 04:47 IST

సంతకం చేస్తున్న దుర్గాబాయి

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లా బీసీ కార్పొరేషన్‌ ఈడీగా డి.దుర్గాబాయి బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని కన్నావారితోటలో ఉన్న కార్పొరేషన్‌ కార్యాలయంలో దస్త్రంపై సంతకం చేసి గురువారం విధుల్లో చేరారు. అనంతరం జిల్లా కలెక్టరు వివేక్‌ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్పొరేషన్‌ ఏఈవో శ్రీనివాసరావు, ఉద్యోగులు అనిల్‌, వెంకటేశ్వరరావులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాబాయి ఇప్పటి వరకు జిల్లా ఉపాధి కల్పన అధికారిగా పని చేశారు. డిప్యుటేషన్‌పై ఈడీగా ప్రభుత్వం నియమించిన విషయం విదితమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు