logo

ఏఐటీయూసీ రాష్ట్ర మహా సభలు వాయిదా

గుంటూరు జిల్లాలో ఈ నెల 29, 30, 31 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ఏఐటీయూసీ 17వ రాష్ట్ర మహా సభలను వాయిదా వేస్తున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ వ్యాప్తి ప్రమాదకరంగా తయారైందన్నారు.

Published : 21 Jan 2022 04:47 IST

గొల్లపూడి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లాలో ఈ నెల 29, 30, 31 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ఏఐటీయూసీ 17వ రాష్ట్ర మహా సభలను వాయిదా వేస్తున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ వ్యాప్తి ప్రమాదకరంగా తయారైందన్నారు. సభలు, సమావేశాలు, ప్రదర్శనలపై ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించిందన్నారు. మహాసభ ఆహ్వాన సంఘం నాయకులతో పాటు మరికొందరు కొవిడ్‌ బారిన పడి చికిత్స పొందుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో మహా సభలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది తెలియజేస్తామన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని