AP news : క్యాసినో వ్యవహారం వెనక ఉన్నదెవరు?: రఘురామ
కృష్ణా జిల్లా గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన ఓ ఫంక్షన్ హాల్లో క్యాసినో నిర్వహణ వ్యవహారం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీన్ని వదిలే ప్రసక్తే లేదని తెదేపా
దిల్లీ: కృష్ణాజిల్లా గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన ఓ ఫంక్షన్ హాల్లో క్యాసినో నిర్వహణ వ్యవహారం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీన్ని వదిలే ప్రసక్తే లేదని తెదేపా నియమించిన నిజనిర్ధారణ కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏలూరు డీఐజీ రేంజ్ కార్యాలయంలో కమిటీ సభ్యులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. గుడివాడ క్యాసినోతో మంత్రి కొడాలి నానికి సంబంధం లేదని భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన్ని అన్యాయంగా ఇరికించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్నదెవరు? క్యాసినో డబ్బు ఎవరికి వెళ్లింది?తదితర విషయాలు తేటతెల్లం కావాల్సిన అవసరముందని చెప్పారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలను లేవనెత్తారు.
పేర్ని నాని క్షమాపణలు చెప్పాలి
ఇటీవల సినిమా టికెట్ల ధరలపై సీఎంతో చర్చించేందుకు వెళ్లిన సినీనటుడు చిరంజీవిపై మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని ఎంపీ రఘురామ డిమాండ్ చేశారు. తనపై అనర్హత వేటు వేయించలేమని వైకాపా ఒప్పుకుంటే తక్షణం రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తమిళనాడు నుంచి తనకు రావాల్సిన డబ్బును సీఎం జగన్ నిలిపివేయించారని ఆరోపించారు. ఏపీ సీఐడీ తీరుపై ఇచ్చిన నోటీసుపై చర్య తీసుకోవాలని లోక్సభ స్పీకర్ని కోరినట్లు రఘురామ తెలిపారు.పీఆర్సీ ఆంశంపై స్పందిస్తూ.. ఉద్యోగులకు జీతాలు నిలిపివేస్తే ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తుతుందని,సంక్షేమం కంటే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ప్రభుత్వ విధి అని రఘురామ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!