logo

ఆటో నుంచి జారిపడివ్యక్తి దుర్మరణం

ఆటో నుంచి పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటనపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. వడ్రంగిగా పనిచేస్తూ జీవనాన్ని సాగించే ఇటుకల అర్జున(62) కుటుంబంతో గొల్లపూడి సమీపంలోని

Published : 23 Jan 2022 03:39 IST

కృష్ణలంక, న్యూస్‌టుడే: ఆటో నుంచి పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటనపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. వడ్రంగిగా పనిచేస్తూ జీవనాన్ని సాగించే ఇటుకల అర్జున(62) కుటుంబంతో గొల్లపూడి సమీపంలోని నల్లకుంటలో ఉంటున్నారు. ఈనెల 20న భార్య అంజమ్మ, బంధువులతో కలసి ఓ పెళ్లి సంబంధం మాట్లాడేందుకు ఆటోలో తెనాలి వెళ్లారు. తిరిగొచ్చే క్రమంలో ఆయన డ్రైవర్‌కు ఎడమ వైపున కూర్చున్నాడు. సాయంత్రం సుమారు 6గంటల సమయంలో ఆటో కృష్ణలంక జాతీయ రహదారి ఎంహోటల్‌ పరిసరాలకు చేరుకున్న క్రమంలో  ఆయన ఆటో నుంచి జారి రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్రగాయమైంది. క్షతగాత్రుడిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం అర్జున మరణించారు. ఆసుపత్రి సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని